NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / వరి పంటకు వాతావరణ గండాలు.. అన్నదాతకు నీటి కటకటాలు
    తదుపరి వార్తా కథనం
    వరి పంటకు వాతావరణ గండాలు.. అన్నదాతకు నీటి కటకటాలు
    నానాటికీ పెరుగుతున్న భూ ఉష్ణోగ్రతలు

    వరి పంటకు వాతావరణ గండాలు.. అన్నదాతకు నీటి కటకటాలు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 12, 2023
    11:32 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నానాటికీ భూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కారణంగా వరికి గండాలు అదే స్థాయిలో హెచ్చుతోంది. ఈ కారణంగా కోట్లాది భారత ప్రజలకు కావాల్సిన ఆహారం, జీవనోపాధికి ముప్పు తప్పేలా కనిపించట్లేదు.

    మరోవైపు ఆయా వరి పండించేందుకు కావాల్సిన సాగునీరు దొరకపోవడం, కీలక సమయాల్లో వరుణ దేవుడు చేతులెత్తేయడం అన్నదాతలను దిక్కుతోచని స్థితిలో నిలుపుతోంది.

    భారత వ్యవసాయ రంగం 50 ఏళ్ల కిందట కరువును, ఆకలిని, ఎదుర్కొనేందుకు క్రాప్ ప్రొడక్షన్ ను భారీగా పెంచాల్సి వచ్చింది.

    అయితే అప్పటి అవసరాలను అత్యధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్‌ విత్తనాలు, రసాయన ఎరువులు (కెమికల్ ఫర్టిలైజర్స్) ఆ ఆవశ్యకతలను తీర్చేశాయి. కానీ దీర్ఘకాలంలో నేటికీ వరి పంటకు వాతావరణ పరిస్థితులు సంకటంలా మారిపోవడం గమనార్హం.

    DETAILS

    పంటలు చేతికి రాకపోవడానికి ఇలాంటి కారణాలెన్నో 

    ఒక్కోసారి అవసరం లేకపోయినా విపరీతమైన వానలు కురుస్తుంటాయి. మరోసారి సముద్రుడు పొంగితే ఆ నీరంతా చొచ్చుకొచ్చి పంటలను ముంచేస్తుంది. ఇక రాత్రి సమయాల్లోనూ వేడి ఉష్ణోగ్రతల కారణంగా దిగుబడులు క్రమేపి తగ్గిపోతున్నాయి.

    అయితే వరి ఉత్పత్తికి కావాల్సిన నూతన పరిస్థితులు, వాటికి అవసరమయ్యే నూతన వ్యవసాయ విధానాలను సమకూర్చుకునేందుకు అన్నదాతలకు సవాళ్లు విసురుతున్నాయి. దీని కారణంగానే అన్నదాతలు తమ పంట కాలాలను మార్చుకుంటున్నారు.

    వేడి వాతావరణాన్ని, ఉప్పు నేలల్ని సైతం తట్టుకునే విత్తనాల తయారీకి విస్త్తృత ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సాగు నీటి వనరుల లభ్యత తక్కువున్న పొలాలకు నీరు ఏర్పాటు చేయకుండా కావాలనే ఆయా రైతులు ఎండబెడుతున్నారు.

    DETAILS

    ప్రపంచ వ్యాప్తంగా వరి పంటకు కటకటే

    వర్ష బీభత్సాల కారణంగా గడిచిన 20 ఏళ్లలో చైనా దేశంలో వరి దిగుబడి కుదేలైంది. మరోవైపు భారత్‌ తన సొంత వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని బియ్యం ఎగుమతులను తగ్గించుకుంది.

    ఇక పాకిస్థాన్‌లో అయితే ఉష్ణోగ్రతల పెరుగుదల, ఆకస్మిక వరదలు పంటలను తీవ్రంగా ధ్వంసం చేశాయి. వాతావరణంలో చోటు చేసుకుంటున్న పెను మార్పుల వల్ల ధాన్యం ఉత్పత్తి ప్రపంచవ్యాప్తంగా తగ్గిపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది.

    అయితే ప్రపంచ ధాన్యాగారంగా పేరుగాంచిన వియత్నాం దేశంలోని మెకాంగ్‌ డెల్టాలో దాదాపు రెండున్నర లక్షల ఎకరాలను వరి ఉత్పత్తి నుంచి తప్పిస్తూ ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

    మెకాంగ్‌ డెల్టాలో ఏటా 3 పంటలు పండిస్తూ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల ఆకలిని అక్కడి రైతులు తీర్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం

    తాజా

    Gold And Silver Rate: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ లక్ష రూపాయలకు తులం బంగారం బంగారం
    Vijay Mallya: అరెస్టు అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టే.. భారత్‌ను వీడా: విజయ్‌ మాల్యా విజయ్ మాల్యా
    Covid 19: దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా.. 5,364 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు.. 55 మరణాలు కరోనా కొత్త కేసులు
    USA: హార్వర్డ్‌ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశం నిలిపివేత.. ట్రంప్ కి షాక్ ఇచ్చిన ఫెడరల్‌ కోర్టు ..  అమెరికా

    భారతదేశం

    జపాన్‌: హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ  జపాన్
    కశ్మీర్‌లో జీ20 సమావేశం నిర్వహించడంపై చైనా అక్కసు; భారత్ కౌంటర్ ఎటాక్  జీ20 సమావేశం
    ఆస్ట్రేలియా: పర్రమట్టా మేయర్‌గా ఎన్నికైన మొదటి భారత సంతతి వ్యక్తి సమీర్ పాండే ఆస్ట్రేలియా
    యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలు విడుదల; అమ్మాయిలే టాప్, తెలుగు వాళ్లు సత్తా కలెక్టర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025