NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Operation Sindoor: సోషల్ మీడియాలో పాకిస్థాన్ 'ఫేక్ న్యూస్' వార్.. వాస్తవాలతో స్పందించిన భారతదేశం 
    తదుపరి వార్తా కథనం
    Operation Sindoor: సోషల్ మీడియాలో పాకిస్థాన్ 'ఫేక్ న్యూస్' వార్.. వాస్తవాలతో స్పందించిన భారతదేశం 
    సోషల్ మీడియాలో పాకిస్థాన్ 'ఫేక్ న్యూస్' వార్.. వాస్తవాలతో స్పందించిన భారతదేశం

    Operation Sindoor: సోషల్ మీడియాలో పాకిస్థాన్ 'ఫేక్ న్యూస్' వార్.. వాస్తవాలతో స్పందించిన భారతదేశం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 07, 2025
    09:04 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన దారుణ ఉగ్రదాడికి భారత్‌ గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది.

    ఈ దాడికి బదులుగా, భారత సైన్యం పాకిస్థాన్‌ ఆక్రమిత భూభాగంలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని 'ఆపరేషన్‌ సిందూర్‌' పేరిట మెరుపుదాడులు జరిపింది.

    ఈ ఆపరేషన్‌ విజయవంతమైందని భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది.

    ఈ దాడులతో పాకిస్థాన్‌ తీవ్ర ఆందోళనకు లోనైంది. వెంటనే సోషల్‌ మీడియాలో తప్పుడు వార్తలు వ్యాపింపజేయడం ప్రారంభించింది.

    అయితే, భారత్‌ దీనిపై నిర్ధారణ చేసిన తర్వాత వాటిని పూర్తిగా తిప్పికొట్టి వాస్తవాలను ప్రజల ముందు ఉంచింది.

    వివరాలు 

    తప్పుడు వీడియోలతో పాకిస్థాన్‌ ప్రపంచాన్ని మోసం చేయాలని ప్రయత్నం 

    భారతసైన్యం స్థావరాలను తాము ధ్వంసం చేశామని పాకిస్థాన్‌ ఆర్మీ తరఫున కొన్ని సోషల్‌ మీడియా ఖాతాలు ప్రచారం చేయడం మొదలుపెట్టాయి.

    ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది.

    ఫ్యాక్ట్‌ చెక్‌ నిర్వహించి వాటి వెనుక ఉన్న వాస్తవాన్ని బయటపెట్టింది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం,పాక్‌ ప్రచారం చేస్తున్న వీడియోలన్నీ పాతవే.

    అవిభారత్‌కు సంబంధించినవే కాదు.2024లో ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రాంతంలో జరిగిన ఘర్షణల దృశ్యాలను,ఐర్లాండ్‌లో జరిగిన మరో ఘటనల క్లిప్పింగులను ఉద్దేశపూర్వకంగా భారత సైన్యం స్థావరాలపై దాడులుగా చూపిస్తూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తోంది.

    ఈనేపథ్యంలో భారత ప్రభుత్వం ప్రజలకు ఒక హెచ్చరిక జారీ చేసింది.

    "సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నతప్పుడు సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండండి.నిజం తెలుసుకోకుండా వాటిని నమ్మవద్దు,"అని కేంద్రం స్పష్టం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్
    సోషల్ మీడియా

    తాజా

    Operation Sindoor: సోషల్ మీడియాలో పాకిస్థాన్ 'ఫేక్ న్యూస్' వార్.. వాస్తవాలతో స్పందించిన భారతదేశం  పాకిస్థాన్
    Operation Sindoor: 'మాకు న్యాయం జరిగింది' .. పహల్గాం దాడి బాధిత కుటుంబసభ్యులు జమ్ముకశ్మీర్
    Operation Sindoor: భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌లో.. 80 మంది ఉగ్రవాదులు మృతి..? ఉగ్రవాదులు
    Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. పలు విమానాశ్రయాలు మూసివేత..విమానాల రాకపోకలకు అంతరాయం  విమానం

    పాకిస్థాన్

    Cyber Attack: పాక్‌ హ్యాకర్ల ముప్పు.. భారత్‌లో సైబర్‌ అలర్ట్‌ ప్రకటించిన ప్రభుత్వం భారతదేశం
    Shehbaz Sharif: మేము రాజీపడం.. ఉగ్రవాది తర్వాత భారత్‌కు పాక్ ప్రధాని హెచ్చరిక! ప్రపంచం
    BSF Jawan: పాక్ చెరలో భారత్ జవాన్.. 85 గంటల గడిచినా విడుదల లేదు! ఆర్మీ
    Hanif Abbasi: 130 అణుబాంబులతో భారత్‌పై దాడి చేస్తాం.. పాకిస్థాన్ రైల్వే మంత్రి హెచ్చరిక! భారతదేశం

    సోషల్ మీడియా

    రెజ్లర్ల నిరసనలో ఖాప్ నేతల మధ్య  వాగ్యుద్ధం; వీడియో వైరల్  రెజ్లింగ్
    5 శాతం మంది ఉద్యోగులకు తొలగించిన రెడ్డిట్  ఉద్యోగుల తొలగింపు
    ఔరంగజేబును కీర్తిస్తూ సోషల్ మీడియా పోస్ట్; కొల్హాపూర్‌లో నిరసనలు; పోలీసుల లాఠీ‌ఛార్జ్  మహారాష్ట్ర
    స్విగ్గీ డెలివరీ బాయ్‌గా మారిన ఇంజనీర్‌కు లింక్డ్‌ఇన్‌లో పోటెత్తిన ఉద్యోగాలు  స్విగ్గీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025