NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Jammu Kashmir: సరిహద్దులో మళ్లీ కాల్పులకు తెగబడిన పాక్‌.. మహిళ మృతి.. మరొకరికి గాయాలు
    తదుపరి వార్తా కథనం
    Jammu Kashmir: సరిహద్దులో మళ్లీ కాల్పులకు తెగబడిన పాక్‌.. మహిళ మృతి.. మరొకరికి గాయాలు
    సరిహద్దులో మళ్లీ కాల్పులకు తెగబడిన పాక్‌.. మహిళ మృతి.. మరొకరికి గాయాలు

    Jammu Kashmir: సరిహద్దులో మళ్లీ కాల్పులకు తెగబడిన పాక్‌.. మహిళ మృతి.. మరొకరికి గాయాలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 09, 2025
    09:27 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో గురువారం చోటు చేసుకున్న పాక్ షెల్లింగ్ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా మరో మహిళ తీవ్రంగా గాయపడింది.

    అధికారిక సమాచారం ప్రకారం, రేజర్వానీ నుంచి బారాముల్లాకు వెళ్తున్న వాహనం మొహురా సమీపంలో షెల్లింగ్ దాడికి గురయ్యింది.

    ఈ దాడిలో బశీర్ ఖాన్ భార్య నాగ్రిస్ బేగం ప్రాణాలు కోల్పోగా, రాజీక్ అహ్మద్ ఖాన్ భార్య హఫీజా గాయాలపాలయ్యారు. హఫీజాను వెంటనే జీఎంసీ బారాముల్లాకు తరలించారు.

    కొద్ది రోజులుగా పాక్ కశ్మీర్ సరిహద్దుల్లో ఉరి, కుప్వారా ప్రాంతాల్లో నిరంతరంగా షెల్లింగ్‌కు పాల్పడుతోంది.

    ఇదే క్రమంలో గురువారం రాత్రి పాకిస్థాన్, జమ్ముకశ్మీర్‌తో పాటు పంజాబ్, రాజస్థాన్ సరిహద్దుల్లోని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగింది.

    Details

    సరిహద్దు గ్రామాల్లో తీవ్ర ఆందోళన

    పఠాన్‌కోట్ (పంజాబ్), జైసల్మేర్(రాజస్థాన్) ప్రాంతాల్లో తీవ్ర కాల్పులకు పాల్పడినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, భారత వైమానిక రక్షణ వ్యవస్థలు తక్షణమే స్పందించాయి.

    పాక్ ప్రయోగించిన అన్ని డ్రోన్లు, క్షిపణులను విజయవంతంగా ఛేదించాయి. జైసల్మేర్‌లో పాకిస్తాన్ డ్రోన్లను అడ్డుకునేందుకు భారత సాయుధ దళాలు చురుగ్గా వ్యవహరించాయి.

    పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ప్రతీకారంగా భారతదేశం చేపట్టిన ఆపరేషన్ తర్వాత మరింత ముదురాయి.

    తాజాగా భారత్‌లోని 15 నగరాలను లక్ష్యంగా చేసుకునే పాకిస్తాన్ కుట్రను కూడా భారత రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా భగ్నం చేశాయి.

    ఇలాంటి పరిస్థితుల్లో, సరిహద్దు గ్రామాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. భద్రతా దళాలు పటిష్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నా పాక్ తరచుగా కాల్పులకు పాల్పడుతూ పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్
    పంజాబ్
    రాజస్థాన్
    పాకిస్థాన్

    తాజా

    Jammu Kashmir: సరిహద్దులో మళ్లీ కాల్పులకు తెగబడిన పాక్‌.. మహిళ మృతి.. మరొకరికి గాయాలు జమ్ముకశ్మీర్
    AP Liquor Scam: మద్యం కుంభకోణం.. రూ.3,200 కోట్ల దందాపై ఈడీ కేసు నమోదు! ఆంధ్రప్రదేశ్
    Operation Sindoor: పాకిస్థాన్ డ్రోన్లు కూల్చేశాం: భారత ఆర్మీ పోస్టు ఆపరేషన్‌ సిందూర్‌
    IPL 2025: సరిహద్దుల్లో ఉద్రిక్తత.. ఐపీఎల్ 2025 నిలిపివేత దిశగా బీసీసీఐ? బీసీసీఐ

    జమ్ముకశ్మీర్

    Pahalgam Terror attack: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి కలకలం - క్షేమంగా బయటపడ్డ నటి దీపికా కాకర్ దంపతులు  సినిమా
    Pahalgam Terror Attack: పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాది ముష్కరుడి ఫొటో విడుదల.. భారతదేశం
    Pahalgam: నాడు క్లింటన్‌..నేడు జేడీ వాన్స్‌: దేశంలో విదేశీ అగ్రనేతల పర్యటనలు సాగుతున్న వేళే ఉగ్రదాడులు..! భారతదేశం
    Pahalgam: కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు తరువాత ఏర్పడిందే టీఆర్‌ఎఫ్‌ భారతదేశం

    పంజాబ్

    58ఏళ్ల వయసులో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సిద్ధూ మూసేవాలా తల్లి  తాజా వార్తలు
    IVF Case: మూసేవాలా తల్లికి IVF చికిత్స.. చట్టబద్ధతను ప్రశ్నించిన కేంద్రం  కేంద్ర ప్రభుత్వం
    Punjab: సంగ్రూర్‌లో కల్తీ మద్యం సేవించి 21 మంది మృతి  భారతదేశం
    Punjab:లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో బీజేపీ ఒంటరిగా పోటీ.. అకాలీదళ్‌తో పొత్తు లేదు బీజేపీ

    రాజస్థాన్

    Sonia Gandhi: రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ.. నేడు నామినేషన్ దాఖలు  సోనియా గాంధీ
    Sonia Gandhi: రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ నామినేషన్  సోనియా గాంధీ
    Blood Transfusion: యువకుడికి 'AB' పాజిటివ్‌ బదులు..O పాజిటివ్‌ రక్తం ఎక్కించారు,కాసేపటికే.. భారతదేశం
    Rahul Kaswan: లోక్‌సభ ఎన్నికల వేళ.. కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ ఎంపీ  కాంగ్రెస్

    పాకిస్థాన్

    #NewsBytesExplainer: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, పాకిస్తాన్ భారతదేశంపై సైబర్ యుద్ధం ఎలా చేస్తోందో తెలుసా? భారతదేశం
    Big Standoff at Attari: సొంతదేశ ప్రజల్ని అనుమతించని పాకిస్తాన్.. అట్టారీ-వాఘా వద్ద ఉద్రిక్తత భారతదేశం
    Pahalgam Terror Attack:'ఇది రహస్యం అని నేను అనుకోను': ఉగ్రవాదులతో ఇస్లామాబాద్ సంబంధాలు నిజమే కానీ.. అంగీకరించిన బిలావల్ భుట్టో  అంతర్జాతీయం
    India-Pakistan: ఉగ్రవాద నిధులను అరికట్టడానికి పాకిస్తాన్‌పై భారత్ ఫైనాన్షియల్ స్ట్రైక్స్‌..?  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025