NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Golden Temple: పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయాన్ని టార్టెట్‌ చేసిన పాక్‌.. భారత వైమానిక రక్షణ ఎలా కాపాడిందంటే?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Golden Temple: పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయాన్ని టార్టెట్‌ చేసిన పాక్‌.. భారత వైమానిక రక్షణ ఎలా కాపాడిందంటే?
    పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయాన్ని టార్టెట్‌ చేసిన పాక్‌..

    Golden Temple: పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయాన్ని టార్టెట్‌ చేసిన పాక్‌.. భారత వైమానిక రక్షణ ఎలా కాపాడిందంటే?

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 19, 2025
    11:05 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా బలమైన ప్రతిచర్య తెలిపిన విషయం తెలిసిందే.

    మే 7వ తేదీన భారత్‌ పాకిస్థాన్‌,పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న సుమారు తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మిస్సైళ్లతో భీకరంగా దాడి చేసింది.

    ఈ మిస్సైల్‌ దాడుల్లో ఆయా ఉగ్ర కేంద్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా, ఈ దాడుల్లో వందకు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.

    ఈ ఘటనల తర్వాత పాకిస్తాన్‌ కూడా భారతపై ప్రతిదాడులకు ప్రయత్నించిన విషయం తెలిసిందే.

    వివరాలు 

    మిస్సైళ్లు, డ్రోన్లతో లక్ష్యం

    ఈ నేపథ్యంలో పంజాబ్‌లోని అమృత్‌సర్‌ ప్రాంతంలో ఉన్న విశ్వ ప్రసిద్ధిగాంచిన స్వర్ణ దేవాలయాన్ని టార్గెట్‌గా చేసేందుకు మిస్సైళ్లు,డ్రోన్లను ఉపయోగించేందుకు యత్నించిందని 15వ ఇన్‌ఫాంట్రీ డివిజన్‌కు చెందిన జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (జీఓసీ) మేజర్ జనరల్ కార్తీక్ సి శేషాద్రి సోమవారం వెల్లడించారు.

    అయితే, భారత ఆర్మీకి చెందిన వైమానిక రక్షణ విభాగం అటువంటి దాడులను సమర్థవంతంగా అడ్డుకుంది అని ఆయన స్పష్టం చేశారు.

    భారత సైన్యం చేసిన ఉగ్ర స్థావరాలపై దాడులు పాక్‌ను తీవ్రమైన ఒత్తిడిలోకి నెట్టాయని,దాంతోనే వారు భారత్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే యత్నం చేశారని చెప్పారు.

    వివరాలు 

    స్వర్ణ దేవాలయానికి సంపూర్ణ స్థాయిలో వైమానిక రక్షణ ఏర్పాటు

    ముఖ్యంగా భారతదేశంలోని సైనిక స్థావరాలు, నివాస ప్రాంతాలు, పూజా స్థలాలు వారు టార్గెట్ చేయవచ్చని ముందుగానే భారత సైన్యం అంచనా వేసినట్లు పేర్కొన్నారు.

    ఇందులో స్వర్ణ దేవాలయం ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ప్రదేశమైందిగా పరిగణించి, అక్కడ సంపూర్ణ స్థాయిలో వైమానిక రక్షణ ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమృత్‌సర్

    తాజా

    Golden Temple: పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయాన్ని టార్టెట్‌ చేసిన పాక్‌.. భారత వైమానిక రక్షణ ఎలా కాపాడిందంటే? అమృత్‌సర్
    Sarfaraz Khan: ఫిట్‌నెస్‌ పై ఫోకస్‌.. 10 కేజీల బరువు తగ్గిన సర్ఫరాజ్‌ ఖాన్‌ సర్ఫరాజ్ ఖాన్
    Shreyas Iyer: ఐపీఎల్ చరిత్రలో తొలి కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఘనత శ్రేయస్ అయ్యర్
    Bill Gates: 2045 నాటికి మెరుగైన ప్రపంచం కోసం బిల్ గేట్స్ ఛాలెంజ్‌.. సాయం చేయాలంటూ తోటి బిలియనీర్లకు పిలుపు.. మైక్రోసాఫ్ట్

    అమృత్‌సర్

    అమృత్‌పాల్ సింగ్ కోసం కొనసాగుతున్న వేట; పంజాబ్ పోలీసుల ఎదుట లొంగిపోయిన అతని మామ, డ్రైవర్ పంజాబ్
    'ఏకేఎఫ్' పేరుతో ఆర్మీ ఏర్పాటుకు అమృతపాల్ సింగ్‌ ప్రయత్నం; వెలుగులోకి వస్తున్న సంచలన నిజాలు పంజాబ్
    భార్యను అమృత్‌పాల్ సింగ్ తరుచూ కొట్టేవాడు, అమ్మాయిలపై మోజు, థాయ్‌లాండ్‌లో గర్లఫ్రెండ్: నిఘా వర్గాలు పంజాబ్
    పంజాబ్: అమృత్‌పాల్ సింగ్ గోల్డెన్ టెంపుల్‌ వద్ద లొంగిపోవాలనుకున్నాడా? పంజాబ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025