NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / పంచాయతీ పోలింగ్ వేళ, పశ్చిమ బెంగాల్‌లో చెలరేగిన హింస; 15మది మృతి 
    తదుపరి వార్తా కథనం
    పంచాయతీ పోలింగ్ వేళ, పశ్చిమ బెంగాల్‌లో చెలరేగిన హింస; 15మది మృతి 
    పంచాయతీ ఎన్నికల పోలింగ్ వేళ, పశ్చిమ బెంగాల్ చెలరేగిన హింస; 15మది మృతి

    పంచాయతీ పోలింగ్ వేళ, పశ్చిమ బెంగాల్‌లో చెలరేగిన హింస; 15మది మృతి 

    వ్రాసిన వారు Stalin
    Jul 08, 2023
    08:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పశ్చిమ బెంగాల్‌లో శనివారం జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ హింసాత్మకంగా మారింది. ఒకవైపు పోలింగ్ జరుతుండగా, మరోవైపు ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ హింసలో మొత్తం 15మంది చనిపోయారు.

    మరణించిన వారిలో టీఎంసీ నుంచి 8మంది, సీపీఎం నుంచి ముగ్గురు, బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఒక్కరు చొప్పున మృతి చెందారు. మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది.

    ముర్షిదాబాద్‌లో ముగ్గురు టీఎంసీ సభ్యులు, ఒక కాంగ్రెస్ కార్యకర్త మరణించారు.

    కూచ్ బెహార్‌లో ఇద్దరు (బీజేపీ నుంచి ఒకరు, టీఎంసీ నుంచి ఒకరు) చనిపోయారు.

    తూర్పు బుర్ద్వాన్‌లో ఇద్దరు సీపీఐ కార్యకర్తలు, ఒక టీఎంసీ కార్యకర్త హత్యకు గురయ్యారు.

    టీఎంసీ నాయకుడు ఒకరు మాల్దాలో మరణించగా, మరొక టీఎంసీ నేత దక్షిణ 24పరగణాలలో ప్రాణాలు కోల్పోయాడు.

    పశ్చిమ బెంగాల్

    అమిత్ షా జోక్యం చేసుకోవాలని బీజేపీ లేఖ

    పంచాయతీ ఎన్నికల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై బీజేపీ స్పందించింది. రాష్ట్రంలో హింస నేపథ్యంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకురాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సుకాంత మజుందార్ లేఖ రాశారు.

    హత్యలు, గందరగోళం లేకుండా మమతా బెనర్జీ రాష్ట్రంలో ఎన్నికలను నిర్వహించలేరని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శించారు.

    పంచాయతీ ఎన్నికల్లో తన పార్టీ ఆధిపత్యాన్ని నిలబెట్టడానికి ఆమె ఎంతకైనా దిగజారిపోతారన్నారు.

    హింసపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా బెంగాల్ నాయకులు సువేందు అధికారి, మంగళ్ పాండేతో మాట్లాడారు. ఈ ప్రజాస్వామ్య మరణాన్ని బీజేపీ సహించబోదని నడ్డా వారితో చెప్పారు. ఇది ఎన్నికల పేరుతో జరిగిన మారణకాండగా బీజేపీ అభివర్ణించింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    అమిత్ షాకు లేఖ రాసిన మంజుదార్

    West Bengal BJP President Dr Sukanta Majumdar writes to Union Home Minister Amit Shah requesting to restore democracy in the state after it witnessed violence during the Panchayat poll. pic.twitter.com/PCiXGZYYln

    — ANI (@ANI) July 8, 2023

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    పోలింగ్ స్టేషన్‌పై దాడి జరిగిన దృశ్యం

    #WATCH | West Bengal panchayat election | Voting suspended at Indreshwar primary school in Dinhata after water was thrown into the ballot box here. pic.twitter.com/1CKYjmsgoH

    — ANI (@ANI) July 8, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పశ్చిమ బెంగాల్
    పోలింగ్
    బీజేపీ
    ఎన్నికలు

    తాజా

    Bhanu Prakash Reddy: తిరుమలలో మరో భారీ స్కామ్... తులాభారం కానుకలను దొంగలించారన్న భానుప్రకాశ్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం
    Rahul Gandhi: యుద్ధంలో విమాన నష్టాన్ని వివరించండి... జైశంకర్‌ను నిలదీసిన రాహుల్ రాహుల్ గాంధీ
    Hill Sations In AP: సిమ్లా, ముసూరి వెళ్లాల్సిన అవసరం లేదు.. ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్న ఈ హిల్ స్టేషన్లు చాలు! వేసవి కాలం
    CM Revanth Reddy: 'ఇందిర సౌర గిరి జల వికాసం' ద్వారా 6 లక్షల ఎకరాల్లో సాగునీరు  రేవంత్ రెడ్డి

    పశ్చిమ బెంగాల్

    కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు కోవిడ్
    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    'జై శ్రీరామ్ అన్నందుకే ఈ దారుణం'.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలుపై రాళ్ల దాడి భారతదేశం
    పశ్చిమ బెంగాల్: అమెరికా నుంచి వచ్చిన నలుగురిలో బీఎఫ్-7 వేరియంట్ కోవిడ్

    పోలింగ్

    అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో బీజేపీ ఆధిక్యం; మేఘాలయలో ఎన్‌పీపీ హవా అసెంబ్లీ ఎన్నికలు
    ఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో కమల వికాసం; మేఘాలయలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన ఎన్‌పీపీ అసెంబ్లీ ఎన్నికలు
    అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక‌లో రేపే పోలింగ్; ముఖ్యాంశాలు ఇవే కర్ణాటక
    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: కొనసాగుతున్న పోలింగ్; ఓటేసిన ప్రముఖులు కర్ణాటక

    బీజేపీ

    బీజేపీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి చేరికపై ఈటెల ఆసక్తికర కామెంట్స్  ఈటల రాజేందర్
    బీజేపీ ఎంపీ సుజనా చైదరికి కేంద్రం ఝలక్.. మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు ఎంపీ
    యూపీలో బీజేపీ 'ఖానే పే చర్చా'; 2024 సార్వత్రిక ఎన్నికలే మోదీ-యోగి టార్గెట్  ఉత్తర్‌ప్రదేశ్
    భారత్‌లో రాజకీయాలు చేయడం కష్టం; ప్రధాని మోదీ, బీజేపీ పాలనపై రాహుల్ గాంధీ విమర్శలు  రాహుల్ గాంధీ

    ఎన్నికలు

    ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు; ప్యానెల్ ఏర్పాటు సుప్రీంకోర్టు
    2024ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తా: మమత బెనర్జీ మమతా బెనర్జీ
    రాజకీయ పార్టీల విరాళాల్లో 66శాతం అజ్ఞాత వ్యక్తులు ఇచ్చినవే: ఏడీఆర్ నివేదిక బీజేపీ
    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; 16వ తేదీన ఫలితాలు ఎమ్మెల్సీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025