NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: "డిజిటల్ అరెస్టులు, డీప్ ఫేక్‌లపై దృష్టి పెట్టండి".. డీజీపీలు, ఐజీపీల సదస్సులో ప్రధాని మోదీ
    తదుపరి వార్తా కథనం
    PM Modi: "డిజిటల్ అరెస్టులు, డీప్ ఫేక్‌లపై దృష్టి పెట్టండి".. డీజీపీలు, ఐజీపీల సదస్సులో ప్రధాని మోదీ
    డీజీపీలు, ఐజీపీల సదస్సులో ప్రధాని మోదీ

    PM Modi: "డిజిటల్ అరెస్టులు, డీప్ ఫేక్‌లపై దృష్టి పెట్టండి".. డీజీపీలు, ఐజీపీల సదస్సులో ప్రధాని మోదీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 02, 2024
    08:53 am

    ఈ వార్తాకథనం ఏంటి

    డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలు, కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతికతల ద్వారా జరుగుతున్న అక్రమాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

    డీప్ ఫేక్‌ల వంటి సాంకేతికతలు సామాజిక, కుటుంబ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

    భువనేశ్వర్‌లోని లోక్‌సేవా భవన్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన డీజీపీలు, ఐజీపీల మూడు రోజుల సదస్సు ముగింపు రోజు ఆదివారం నాడు ప్రధాన మంత్రి మాట్లాడారు.

    కానిస్టేబుళ్ల స్థాయిలో సాంకేతికతను ఉపయోగించి వారి పని భారాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.

    వివరాలు 

    స్మార్ట్ పోలీసింగ్‌ను అనుసరించడంపై ప్రత్యేకంగా దృష్టి

    ఈ సదస్సులో దేశ భద్రతకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చ జరిగింది.

    ముఖ్యంగా ఉగ్రవాదం, మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణ, సైబర్ నేరాల తగ్గింపు, మహిళలపై హింసా చర్యల నిరోధకానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు.

    అంతేకాకుండా, జల మార్గాల్లో సమర్థ బందోబస్తుకు సంబంధించి కూడా తీర్మానాలు జరిపారు.

    సైబర్ నేరాలను నియంత్రించడం కోసం ప్రత్యేక యుద్ధ ప్రణాళికగా పోలీసు శాఖ చర్యలు చేపట్టాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. స్మార్ట్ పోలీసింగ్‌ను అనుసరించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

    ఈ 59వ సదస్సులో 250 మంది అధికారులు ప్రత్యక్షంగా, మరో 750 మంది వర్చువల్‌గా హాజరయ్యారు.

    కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    నరేంద్ర మోదీ

    Narendra Modi: పని చేయని ఉద్యోగుల నిర్బంధ పదవీ విరమణ.. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధాని మోదీ హెచ్చరిక  భారతదేశం
    India: చర్చలేమీ జరగలేదు.. మోదీ-ట్రూడో సమావేశంపై కేంద్రం వివరణ జస్టిన్ ట్రూడో
    India Mobile Congress 2024: త్వరలోనే పూర్తి మేడిన్‌ ఇండియా మొబైల్స్‌ .. డబ్ల్యూటీఎస్‌ఏ ఈవెంట్‌లో ప్రధాని మోదీ భారతదేశం
    PM Modi: పుతిన్ ఆహ్వానం.. మరోసారి రష్యాకు ప్రధాని నరేంద్ర మోదీ  రష్యా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025