NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mallikarjun Kharge: ఉగ్రవాద దాడిపై నిఘా వర్గాల నివేదిక.. ప్రధాని మోదీ కాశ్మీర్ పర్యటన రద్దు ఎందుకు భద్రత కల్పించలేదు..?: ఖర్గే
    తదుపరి వార్తా కథనం
    Mallikarjun Kharge: ఉగ్రవాద దాడిపై నిఘా వర్గాల నివేదిక.. ప్రధాని మోదీ కాశ్మీర్ పర్యటన రద్దు ఎందుకు భద్రత కల్పించలేదు..?: ఖర్గే
    ఉగ్రవాద దాడిపై నిఘా వర్గాల నివేదిక.. ప్రధాని మోదీ కాశ్మీర్ పర్యటన రద్దు ఎందుకు భద్రత కల్పించలేదు..?: ఖర్గే

    Mallikarjun Kharge: ఉగ్రవాద దాడిపై నిఘా వర్గాల నివేదిక.. ప్రధాని మోదీ కాశ్మీర్ పర్యటన రద్దు ఎందుకు భద్రత కల్పించలేదు..?: ఖర్గే

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 06, 2025
    03:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గాం ఉగ్రదాడి ఘటనపై కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.

    జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి తగినంత భద్రత ఎందుకు కల్పించలేదని ఆయన ప్రశ్నించారు.

    'సంవిధాన్‌ బచావో'పేరిట రాంచీలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఈవ్యాఖ్యలు చేశారు.

    దేశంలో నెలకొన్న పరిస్థితులు అందరికీ తెలిసిన విషయమేనని వ్యాఖ్యానించిన ఖర్గే, పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి నిఘా వైఫల్యం ఉందని ప్రభుత్వం కూడా అంగీకరించిందని గుర్తు చేశారు.

    కేంద్రం ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేస్తామంటూ హామీ ఇచ్చిందని,దాడికి మూడు రోజుల ముందు నుంచే కీలకమైన నిఘా సమాచారం వచ్చిందన్న విషయాన్ని తనకు తెలుసని తెలిపారు.

    అలాంటప్పుడు ఎందుకు పహల్గాంలో ముందస్తుగా సమర్థవంతమైన భద్రతా ఏర్పాట్లు చేయలేకపోయారని ప్రశ్నించారు.

    వివరాలు 

    మోదీ పాలన తీరుపైనా తీవ్రస్థాయిలో విమర్శలు

    పహల్గాం దాడికి ప్రతిస్పందనగా పాకిస్థాన్‌పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా, ఆ చర్యలకు కాంగ్రెస్‌ పూర్తి మద్దతు ఉంటుందని ఖర్గే స్పష్టం చేశారు.

    రాజకీయ పార్టీలు వేర్వేరు అయినా, దేశ భద్రత విషయంలో అందరూ ఐక్యంగా ఉండాలని ఆయన అన్నారు.

    జాతీయ సమైక్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇక ప్రధాని మోదీ పాలన తీరుపైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

    కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను ఒకదాని తర్వాత ఒకదాన్ని మూసివేస్తూ ముందుకెళ్తోందని ఆరోపించారు.

    అదే మోదీ పాలనా విధానమని వ్యాఖ్యానించారు.

    అదేవిధంగా, ఆదివాసీ నాయకులను భయపెట్టే విధానాన్ని అవలంబించకూడదని కేంద్రానికి హితవు పలికారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మల్లికార్జున ఖర్గే

    తాజా

    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్
    Manchu Vishnu: 'కన్నప్ప' విషయంలో చేసిన పెద్ద పోరపాటు అదే : మంచు విష్ణు కన్నప్ప
    Man Arrested For Spying Pak : భారత రహస్య సమాచారం పాక్‌కు లీక్‌.. గుజరాత్‌లో వ్యక్తి అరెస్ట్‌ గుజరాత్

    మల్లికార్జున ఖర్గే

    మణిపూర్‌ పరిస్థితిపై ప్రధాని మోదీ మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్: ఈ నెల 24న నిరసన మణిపూర్
    రాష్ట్రపతిని కలిసిన ప్రతిపక్ష నేతల బృందం; మణిపూర్ పరిస్థితిపై మెమోరాండం అందజేత ద్రౌపది ముర్ము
    రూల్ ఏదైనా చర్చకు మేం రెడీ.. కానీ ప్రధాని ప్రకటనపై మార్చుకొని వైఖరి ఇండియా
    దిల్లీలో తెలంగాణ రాజకీయాలు : ఖర్గే సమక్షంలో హస్తం గూటికి చేరిన జూపల్లి  కాంగ్రెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025