NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని మోదీ, అమిత్‌ షా శుభాకాంక్షలు
    తదుపరి వార్తా కథనం
    PM Modi: రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని మోదీ, అమిత్‌ షా శుభాకాంక్షలు
    రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని మోదీ, అమిత్‌ షా శుభాకాంక్షలు

    PM Modi: రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని మోదీ, అమిత్‌ షా శుభాకాంక్షలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 26, 2024
    11:52 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు (మంగళవారం) పాత పార్లమెంటు ప్రాంగణంలోని సెంట్రల్ హాల్‌లో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

    ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా భారత ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, పటిష్ఠమైన భారత్ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు.

    వివరాలు 

    రాజ్యాంగం, దేశాభివృద్ధికి కీలకమైన పునాది 

    హోం మంత్రి అమిత్ షా, రాజ్యాంగం భారత ప్రజాస్వామ్యానికి మూర్తిరూపమైన శక్తి అని అభివర్ణించారు.

    సమాన హక్కులు అందరికీ నిర్ధారిస్తూ, జాతీయ ఐక్యతకు తోడ్పడుతున్న ఈ రాజ్యాంగం, దేశాభివృద్ధికి కీలకమైన పునాది అని పేర్కొన్నారు.

    రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన మహానుభావుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ వేడుకలను జరుపుకోవాలని ఆయన ప్రజలను కోరారు.

    రాజ్యాంగం ఒక పుస్తకం మాత్రమే కాకుండా, అందులోని మార్గదర్శక సూత్రాలను నిష్టగా అమలు చేయడం ప్రధాన లక్ష్యమై ఉండాలని ఆయన అన్నారు.

    వివరాలు 

     వేడుకలలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్ ప్రసంగం 

    ఈ ప్రత్యేక వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు పాల్గొంటారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు తెలిపారు.

    ఈ సందర్భంగా ఇండియా కూటమి నేతలు, కార్య‌క్ర‌మంలో తమకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.

    దీనిపై స్పందించిన రిజిజు, ఈ వేడుకల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్ మాత్రమే ప్రసంగిస్తారని, ప్రధాని మోదీ ఈ కార్య‌క్ర‌మంలో ప్రసంగించరని స్పష్టంచేశారు.

    అయితే, వేడుకల అనంతరం జరిగే మరో కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    అమిత్ షా

    తాజా

    Stock market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 1281 పాయింట్లు,నిఫ్టీ 346 పాయింట్లు చొప్పున నష్టం  స్టాక్ మార్కెట్
    Pm Modi: భవిష్యత్తు తరాలకు మీరు ఆదర్శం.. భారత సైన్యాన్ని అభినందించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Pm Modi: భారత సైనిక పరాక్రమం త్రివిధ దళాల ఐక్యతకు ప్రతీక: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Cockroaches and Lizards: బొద్దింకలు, బల్లుల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?.. ఐతే ఈ సులభమైన పద్ధతితో చెక్ పెట్టండి..! జీవనశైలి

    నరేంద్ర మోదీ

    Narendra Modi: దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు 'నో ఎంట్రీ'.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు  బీజేపీ
    Ratan Tata: ప్రభుత్వ లాంఛనాలతో రతన్‌ టాటా అంత్యక్రియలు.. కేంద్రం తరఫున అమిత్‌ షా రతన్ టాటా
    PM Modi: యురేషియా,పశ్చిమాసియాలో శాంతి కోసం పిఎం మోదీ పిలుపు.. యుద్ధానికి కాదు.. దౌత్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి అంతర్జాతీయం
    Narendra Modi: పని చేయని ఉద్యోగుల నిర్బంధ పదవీ విరమణ.. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధాని మోదీ హెచ్చరిక  భారతదేశం

    అమిత్ షా

    JKNF: 'జేకేఎన్‌ఎఫ్‌'ను ఐదేళ్ల పాటు నిషేధించిన కేంద్రం  జమ్ముకశ్మీర్
    Amit Shah: సిఎఎ ముస్లిం,మైనారిటీలకు వ్యతిరేకం కాదు.. వెనక్కితీసుకునే ప్రసక్తే లేదు: అమిత్ షా  భారతదేశం
    Amit Shah: కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల నుంచి బయటపడాలి...సీఏఏ అమలు చేస్తాం: అమిత్ షా  భారతదేశం
    Reservations-Amith Sha-Bjp Complaint: రిజర్వేషన్ల పై అమిత్ షా వ్యాఖ్యలను వీడియో మార్ఫింగ్ చేశారు...ఫిర్యాదు చేసిన బీజేపీ బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025