NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / TATA Aircraft Complex: సి-295 తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన భారత్‌, స్పెయిన్‌ ప్రధానులు
    తదుపరి వార్తా కథనం
    TATA Aircraft Complex: సి-295 తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన భారత్‌, స్పెయిన్‌ ప్రధానులు
    సి-295 తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన భారత్‌, స్పెయిన్‌ ప్రధానులు

    TATA Aircraft Complex: సి-295 తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన భారత్‌, స్పెయిన్‌ ప్రధానులు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 28, 2024
    10:58 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత ప్రధాని నరేంద్ర మోదీ,స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్‌తో కలిసి గుజరాత్‌లోని వడోదరలో సి-295 ట్రాన్స్‌పోర్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు.

    టాటా సంస్థ భాగస్వామ్యంతో ఎయిర్‌బస్‌ సంస్థ ఈ కేంద్రాన్ని నెలకొల్పింది. ఇది ఐరోపాకు చెందిన సంస్థ.

    విదేశాల్లో తయారైన ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఉత్పత్తి చేయడం ఇదే మొదటి సారి. స్పెయిన్‌లో తయారైన ఈ విమానాల్లో కొన్ని గతేడాది నుంచి భారత్‌కు చేరుకోవడం మొదలైంది.

    ఈ ప్రారంభోత్సవానికి ముందు మోదీ, పెడ్రో సాంచెజ్ వడోదరాలో ఒక రోడ్‌షోను నిర్వహించారు.

    ఈ కార్యక్రమంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎక్స్‌లో స్పందిస్తూ, అక్టోబర్ 28 తేదీ భారత వైమానిక రంగంలో ఒక ప్రత్యేకమైన రోజుగా పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవంలో ఆయన కూడా పాల్గొన్నారు.

    వివరాలు 

    ఆవ్రో-748 విమానాల స్థానంలో..  సి-295 

    భారత్‌కు 56 సి-295 విమానాల సరఫరాకు 2021 సెప్టెంబర్‌లో రూ.21,935 కోట్లకు ఒప్పందం కుదుర్చబడింది.

    ఇందులో 16 విమానాలు స్పెయిన్‌లోని ఎయిర్‌బస్‌ కర్మాగారంలో నుంచి అందించబడతాయి, మిగతా 40 విమానాలు వడోదర యూనిట్‌లో తయారు చేయబడతాయి.

    కాలం చెల్లించిన ఆవ్రో-748 విమానాల స్థానంలో భారత వాయుసేన ఈ సి-295 విమానాలను ప్రవేశపెట్టనుంది.

    సి-295కి సంబంధించిన విడిభాగాల ఉత్పత్తి ఇప్పటికే హైదరాబాద్‌లోని 'మెయిన్ కన్‌స్టిట్యూట్ అసెంబ్లీ'లో ప్రారంభమైంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గుజరాత్

    తాజా

    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ
    Donald Trump: 'ఆపిల్‌'కు ట్రంప్‌ వార్నింగ్‌.. అలాచేస్తే 25% సుంకం చెల్లించాల్సిందే! డొనాల్డ్ ట్రంప్

    గుజరాత్

     Congress: రామాలయం ఎఫెక్ట్.. కాంగ్రెస్‌కు ఎమ్మెల్యే రాజీనామా కాంగ్రెస్
    Modi in Gujarat: నేడు గుజరాత్ లో పర్యటించనున్న ప్రధాని భారతదేశం
    Sudarshan Setu: దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ.. ప్రత్యేకతలు ఇవే..  నరేంద్ర మోదీ
    PM Modi: అరేబియా సముద్రంలో మునిగి.. ద్వారకలో ప్రధాని మోదీ పూజలు నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025