NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Chenab bridge: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చినాబ్ వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ .. 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Chenab bridge: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చినాబ్ వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ .. 

    Chenab bridge: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చినాబ్ వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ .. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 06, 2025
    12:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనగా పేరుగాంచిన చినాబ్ ఉక్కు వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అధికారికంగా ప్రారంభించారు.

    కట్‌ఢా నుంచి కశ్మీర్ దాకా నడిచే వందే భారత్ రైలుకు జెండా ఊపడం ద్వారా ఈ వంతెనను ప్రజల వినియోగానికి తీసుకొచ్చారు.

    శివాలిక్,పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ కశ్మీర్ లోయను రైలు మార్గంలో భారత్ మిగతా ప్రాంతాలతో అనుసంధానించాలన్న ఆశయం, బ్రిటిష్ పాలన కాలం నాటినుంచి ఉన్న ఈ దీర్ఘకాలిక కల, ఇప్పుడే సాకారమైంది.

    ఈ సందర్భంగా కట్‌ఢాలో దాదాపు రూ.46వేల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని ప్రారంభించారు.

    వివరాలు 

    పహల్గాం ఉగ్రదాడి అనంతరం  మోదీ జమ్మూకశ్మీర్‌కి రావడం ఇదే మొదటిసారి

    కట్‌ఢా-శ్రీనగర్ మధ్య నడిచే రైలుకు జెండా ఊపారు.అంతేకాకుండా, దేశంలోనే మొట్టమొదటి తీగల ఆధారిత రైల్వే వంతెనగా గుర్తింపు పొందిన అంజీ కేబుల్ బ్రిడ్జిని కూడా ప్రధాని ప్రారంభించారు.

    పహల్గాం ఉగ్రదాడి అనంతరం ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్‌కి రావడం ఇదే మొదటిసారి.

    ఆయన ఉధంపుర్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కి చేరుకున్న తర్వాత చినాబ్ వంతెన నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.

    ఆ తరువాత జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశమయ్యారు.

    అనంతరం కట్‌ఢాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఉగ్రవాద హంతక చర్యల నేపథ్యంలో ప్రధాని పర్యటన సందర్భంగా భద్రతా దళాలను విస్తృతంగా మోహరించారు.

    వివరాలు 

    చినాబ్ వంతెన విశేషాలు 

    ఉధంపుర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఈ చినాబ్ వంతెన, కశ్మీర్‌ను భారత దేశ మిగతా ప్రాంతాలతో రైలు మార్గం ద్వారా అనుసంధానించేందుకు కీలక పాత్ర పోషిస్తోంది.

    చినాబ్ నదికి 359 మీటర్ల ఎత్తులో నిర్మించబడిన ఈ వంతెన పొడవు 1,315 మీటర్లు.

    ఇప్పటి వరకు చైనాలోని బెయిపాన్ నదిపై ఉన్న షుబాయ్ రైల్వే వంతెన (ఎత్తు 275 మీటర్లు) ప్రపంచంలోనే ఎత్తైనదిగా గుర్తింపు పొందింది.

    కానీ ఇప్పుడు చినాబ్ వంతెన ఆ రికార్డును చెరిపేసింది. దీనిని ప్రముఖ ప్యారిస్ ఐఫిల్ టవర్‌తో పోలిస్తే ఇది దాదాపు 30 మీటర్ల ఎత్తుగా ఉంటుంది.

    ఈ వంతెనను అత్యాధునిక ఇంజినీరింగ్ నిపుణతతో నిర్మించారు.భూకంపాలు, వరదలు, పేలుళ్లును సైతం తట్టుకునేలా అత్యాధునిక సాంకేతికతతో దీనిని నిర్మించారు.

    వివరాలు 

     23 ఏళ్ల అనంతరం సాకారమైన కల 

    దీని ప్రారంభంతో జమ్మూ-శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.

    ఇంజినీర్ల అంచనాల ప్రకారం, ఈ వంతెన ఆయుష్కాలం సుమారు 120 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నారు.

    దీనిపై గరిష్ఠంగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడపవచ్చు. ఈ వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.1,486 కోట్లు వెచ్చించింది.

    ఈ కట్టడంలో 28 వేల టన్నుల ఉక్కును వినియోగించినట్లు అధికారిక సమాచారం.

    ఈ ప్రాజెక్ట్‌కు 2002లో అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్న సమయంలో రూపకల్పన జరిగింది. అంటే ఇప్పుడు దాదాపు 23 ఏళ్ల అనంతరం ఈ కల సాకారమైంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    చినాబ్ వంతెన ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ ..

    #WATCH | J&K: Prime Minister Narendra Modi waves the Tiranga as he inaugurates Chenab bridge - the world’s highest railway arch bridge.#KashmirOnTrack

    (Video: DD) pic.twitter.com/xfBnSRUQV5

    — ANI (@ANI) June 6, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    Chenab bridge: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చినాబ్ వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ ..  నరేంద్ర మోదీ
    Home loan: గృహ రుణాలదారులకు ఊరట.. వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్‌బీఐ  ఆర్ బి ఐ
    Gold And Silver Rate: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ లక్ష రూపాయలకు తులం బంగారం బంగారం
    Vijay Mallya: అరెస్టు అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టే.. భారత్‌ను వీడా: విజయ్‌ మాల్యా విజయ్ మాల్యా

    నరేంద్ర మోదీ

    PM Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యవేక్షణలో 'ఆపరేషన్‌ సిందూర్‌'..  9 పాక్ ఉగ్ర స్థావరాల ధ్వంసం  భారతదేశం
    PM Modi: ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో.. పలు దేశాల పర్యటనలను రద్దు చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ  భారతదేశం
    Modi on Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ పై మోదీ ఫస్ట్ రియాక్షన్ ఇదే.. భారతదేశం
    PM Modi: చంద్రునిపై 2040కల్లా భారతీయుడు.. కుజ, శుక్ర గ్రహ యాత్రలూ జరపబోతున్నాం: మోదీ  టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025