NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Modi 3.0: కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార తేదీలో మార్పు? ఆ రోజు ప్రధానిగా ప్రమాణ స్వీకారం 
    తదుపరి వార్తా కథనం
    Modi 3.0: కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార తేదీలో మార్పు? ఆ రోజు ప్రధానిగా ప్రమాణ స్వీకారం 
    Modi 3.0: కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార తేదీలో మార్పు?

    Modi 3.0: కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార తేదీలో మార్పు? ఆ రోజు ప్రధానిగా ప్రమాణ స్వీకారం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 06, 2024
    05:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    లోక్‌సభ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)కి 293 సీట్లు వచ్చాయి. ఎన్డీయే నాయకుడిగా నరేంద్ర మోదీ ఎన్నికయ్యారు.

    అలయన్స్ లోని అన్ని పార్టీలు తమ మద్దతు లేఖలను సమర్పించాయి. ఇప్పుడు మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

    అయితే, ఆయన ప్రమాణ స్వీకారోత్సవం తేదీపై అనుమానాలు ఉన్నాయి. ప్రధానమంత్రి పదవికి ప్రమాణ స్వీకార తేదీని మార్చినట్లు చెబుతున్నారు.

    ఇప్పుడు జూన్ 9 సాయంత్రం 6 గంటలకు మోడీ మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

    ముందుగా ఈ కార్యక్రమం జూన్ 8న జరగాల్సి ఉంది. ఈ విషయాన్ని మీడియా నివేదికలో పేర్కొంది.

    ప్రమాణ స్వీకారోత్సవాన్ని గ్రాండ్‌గా నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. దీనికి విదేశీ అతిథులను ఆహ్వానించారు.

    Details 

    రాష్ట్రపతికి రాజీనామా లేఖ 

    ప్రమాణస్వీకారోత్సవానికి ముందు బుధవారం మోదీ తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ముర్ముకు సమర్పించారు.

    రాష్ట్రపతి నరేంద్ర మోదీ, ఆయన మంత్రుల రాజీనామా లేఖను ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు తాత్కాలిక ప్రధానమంత్రిగా కొనసాగాలని అభ్యర్థించారు.

    Details 

    21 మంది నేతలు సంతకాలు.. కూటమి నాయకుడిగా మోదీ 

    ఒక రోజు ముందు,NDA తన నాయకుడిగా నరేంద్ర మోదీని ఏకగ్రీవంగా అంగీకరించింది.బుధవారం న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో 21మంది ఎన్డీయే నేతలు మోదీని తమ నాయకుడిగా అంగీకరిస్తూ లేఖపై సంతకాలు చేశారు.

    దీంతో నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావడానికి మార్గం సుగమమైంది.ఈ సమావేశంలో, నాయకులందరూ కూడా ప్రధాని మోదీ గత 10సంవత్సరాలలో దేశంలో చేసిన అభివృద్ధి పనులకు అభినందనలు తెలిపారు.

    భారత ఎన్నికల సంఘం మంగళవారం లోక్‌సభ 2024 ఎన్నికల ఫలితాలను ప్రకటించింది.ఇందులో బీజేపీ అత్యధికంగా 240సీట్లు సాధించగా,కాంగ్రెస్‌ 99సీట్లతో రెండో స్థానంలో నిలిచింది.

    అయితే గత సారితో పోలిస్తే ఈ ఎన్నికల్లో బీజేపీ 32 సీట్లు కోల్పోయింది. 2014 తర్వాత బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోవడం ఇదే తొలిసారి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    నరేంద్ర మోదీ

    PM Modi on Rahul Gandhi: రాహుల్ గాంధీ వయోనాడ్ లో కూడా ఓడిపోతారు: పీఎం మోదీ ప్రధాన మంత్రి
    Elone Musk-India Visit-Postphoned: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత పర్యటన వాయిదా టెస్లా
    Modi Fire-Congress: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మీ సంపద గోవిందా...కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ బీజేపీ
    Ncp-Sharad Pawar-Modi: మాజీ ప్రధానుల గురించి తర్వాత...ముందు మీరేం చేశారో చెప్పండి మోదీగారు: శరద్ పవార్ శరద్ పవార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025