NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఇండియా మొబైల్ కాంగ్రెస్: 5G తర్వాత, 6Gలో కూడా భారతదేశం ముందుండాలి: మోదీ 
    తదుపరి వార్తా కథనం
    ఇండియా మొబైల్ కాంగ్రెస్: 5G తర్వాత, 6Gలో కూడా భారతదేశం ముందుండాలి: మోదీ 
    ఇండియా మొబైల్ కాంగ్రెస్: 5G తర్వాత, 6Gలో కూడా భారతదేశం ముందుండాలి: మోదీ

    ఇండియా మొబైల్ కాంగ్రెస్: 5G తర్వాత, 6Gలో కూడా భారతదేశం ముందుండాలి: మోదీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 27, 2023
    01:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    6G టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా నిలిచే దిశలో భారత్ పయనిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అన్నారు.

    ఢిల్లీలో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ఆయన మాట్లాడుతూ.. దేశంలో 5జీని విస్తరించడమే కాకుండా 6జీ టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా నిలిచే దిశగా పయనిస్తున్నామని చెప్పారు.

    మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌లో భారతదేశం మునుపటి ర్యాంక్ 118 నుండి 43వ స్థానానికి చేరుకుందని, 5G రోల్-అవుట్ అయిన ఒక సంవత్సరంలోనే నాలుగు లక్షల 5G బేస్ స్టేషన్‌లను ఏర్పాటు చేశామని ప్రధాని మోదీ తెలిపారు.

    ఈ సందర్భంగా ప్రధాని 2G స్పెక్ట్రమ్ కుంభకోణంపై యూపీఏ ప్రభుత్వాన్ని నిలదీసారు.

    Details 

    శాంసంగ్,ఆపిల్ ఇండియాలో తయారు అవుతున్నాయి: మోదీ 

    2జీ (యూపీఏ ప్రభుత్వ హయాంలో స్పెక్ట్రమ్ కేటాయింపు) సమయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసునని, మా ప్రభుత్వ హయాంలో 4జీని విస్తరించామే కానీ మాపై ఎలాంటి మచ్చ పడలేదని, 6జీ టెక్నాలజీలోనూ భారత్ అగ్రగామిగా నిలుస్తుందన్న నమ్మకం ఉందన్నారు.

    పిక్సెల్ ఫోన్‌లను భారతదేశంలోనే తయారు చేస్తామని గూగుల్ ఇటీవల ప్రకటించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

    శాంసంగ్ ఫోల్డ్ 5 మొబైల్ ఫోన్,ఆపిల్ ఐఫోన్ 15 భారతదేశంలో తయారవుతున్నాయి.

    ఇప్పుడు ప్రపంచం మేడ్ ఇన్ ఇండియా మొబైల్ ఫోన్‌లను ఉపయోగిస్తున్నందుకు గర్వపడుతున్నామని ప్రధాని అన్నారు.

    భారత టెక్‌ విప్లవంలో యువత పాత్ర కీలకమని మోదీ అన్నారు. అంతరిక్ష రంగంలో భారత్ వేగంగా వృద్ధి చెందుతోందని తెలిపారు.

    Details 

    ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఆసియాలోనే అతిపెద్ద టెలికాం,మీడియా, టెక్నాలజీ ఫోరమ్ 

    అక్టోబరు 27-29 వరకు షెడ్యూల్ చేయబడిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ 7వ ఎడిషన్‌ను ఇటీవల ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో ప్రధాని మోదీ ప్రారంభించారు.

    ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఆసియాలోనే అతిపెద్ద టెలికాం, మీడియా, టెక్నాలజీ ఫోరమ్.

    ఇది టెలికమ్యూనికేషన్స్, టెక్నాలజీలో అద్భుతమైన పురోగతులను ప్రదర్శించడానికి భారతదేశం ఒక వేదికను అందిస్తోంది.

    వినూత్న ఉత్పత్తులు,పరిష్కారాలను ప్రదర్శించే అవకాశాన్ని స్టార్ట్-అప్‌లకు అందిస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    UPI app: యూపీఐ వినియోగదారులకు హెచ్చరిక.. ఇకపై బ్యాలెన్స్ చెక్‌కు 50 సార్లు మాత్రమే ఛాన్స్! యూపీఐ
    Vivo T4 Ultra: వివో T4 Ultra వచ్చేస్తోంది.. 100X జూమ్, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో లాంచ్‌కు సిద్ధం!  స్మార్ట్ ఫోన్
    Squid Game 3 : ఫైనల్ గేమ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. 'స్క్విడ్ గేమ్ 3' ట్రైలర్ విడుదల! ఓటిటి
    Miss World 2025: మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ యువతి థాయిలాండ్

    నరేంద్ర మోదీ

    చారిత్రక సందర్భం.. అధికారికంగా భారత పార్లమెంట్‌గా మారిన కొత్త భవనం  పార్లమెంట్ కొత్త భవనం
    పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్‌‌కు 'సంవిధాన్‌ సదన్‌' పేరు.. ప్రధాని మోదీ ప్రతిపాదన  పార్లమెంట్ కొత్త భవనం
    లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు.. 'చారిత్రక దినం'గా అభివర్ణించిన ప్రధాని మోదీ  మహిళా రిజర్వేషన్‌ బిల్లు
    Women's Reservation Bill: ఎన్డీఏ, యూపీఏ మహిళా రిజర్వేషన్ బిల్లుల మధ్య తేడా ఏంటి?  మహిళా రిజర్వేషన్‌ బిల్లు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025