NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్లకు మహర్దశ.. ఆగస్ట్ 6న మోదీ శంకుస్థాపన
    తదుపరి వార్తా కథనం
    దేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్లకు మహర్దశ.. ఆగస్ట్ 6న మోదీ శంకుస్థాపన
    దేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్లకు మహర్దశ

    దేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్లకు మహర్దశ.. ఆగస్ట్ 6న మోదీ శంకుస్థాపన

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 04, 2023
    05:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్ల ఆధునీకీకరణ పనులకు ముహుర్తం ఖరారైంది. ఆగస్టు 6న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది.

    ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.

    రైల్వేస్టేషన్ చుట్టూ నగరం లేదా పట్టణాభివృద్దిని పెంచేందుకు ఈ నిర్మాణాలను చేపట్టనున్నారు. ఆయా ప్రాంతాల్లోని సంస్కృతి, వారసత్వం, వాస్తుకు ప్రాధాన్యత ఇచ్చేలా స్టేషన్ కు రూపకల్పన చేస్తున్నారు.

    కేంద్రంలో ఎన్డీఏ రెండో సారి అధికారంలోకి వచ్చాక అత్యాధునిక ప్రజా రవాణా సదుపాయాలపై దృష్టిపెట్టింది. ఈ మేరకు అమృత్ ‌భారత్ ‌స్టేషన్ పథకం కింద దాదాపు రూ. 24,470 కోట్లతో ఆయా స్టేషన్లకు మరమ్మతులు చేయనున్నారు.

    DETAILS

    తెలంగాణలో 21, ఏపీలో 18 స్టేషన్లకు ఆధునీకీకరణ

    దేశ ప్రజారవాణాకు రైల్వేలు ప్రతీకగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రైల్వేస్టేషన్‌లల్లో ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పించాల్సి ఉందని గతంలోనే మోదీ చెప్పారు.

    ఇందుకు అనుగుణంగానే 1309 రైలు స్టేషన్లను ఆధునికీకరిస్తున్నారు. ఇందులో భాగంగానే అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని రూపొందించారు.

    దేశంలోని 27 రాష్ట్రాలు, యూటీ ప్రాంతాలకు సంబంధించి 508 రైల్వేస్టేషన్లను ఆ శాఖ ఎంపిక చేసింది.

    యూపీ 55

    రాజస్థాన్‌ 55

    బీహార్‌ 49

    మహారాష్ట్ర 44

    పశ్చిమ బెంగాల్‌ 37

    మధ్యప్రదేశ్‌ 34

    అస్సాం 32

    ఒడిశా 25

    పంజాబ్‌ 22

    గుజరాత్ 21

    తెలంగాణ 21

    జార్ఖండ్‌లో 20

    ఆంధ్రప్రదేశ్ 18

    తమిళనాడులో 18

    హర్యానాలో 15

    కర్నాటకలో 13 రైల్వే స్టేషన్లు ఉండటం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రైల్వే స్టేషన్
    నరేంద్ర మోదీ

    తాజా

    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా
    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్
    Kannappa : భీమవరంలో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. జూన్ 22న గ్రాండ్‌గా! మంచు విష్ణు

    రైల్వే స్టేషన్

    ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కలకలం.. 4 బోగీలు పూర్తిగా దగ్ధం రైలు ప్రమాదం
    కాషాయ రంగులోకి మారిన వందే భారత్ రైలు.. కారణం ఇదేనా? వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    తిరుపతి యార్డులో పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్‌, రెండు రైళ్లు రీ షెడ్యూల్‌ తిరుమల తిరుపతి
    హైదరాబాద్: తప్పిన రైలు ప్రమాదం.. ఒకే ట్రాక్‌పైకి రెండు ఎంఎంటీఎస్‌లు హైదరాబాద్

    నరేంద్ర మోదీ

    తెలంగాణ కొత్త రాష్ట్రమే కావచ్చు, కానీ దేశ చరిత్రలో పాత్ర చాలా గొప్పది: ప్రధాని మోదీ ప్రధాన మంత్రి
    చంద్రయాన్-3 ప్రయోగానికి ప్రధాని మోదీ హాజరవుతారా? ఇస్రో చీఫ్ సమాధానం ఇదే ఇస్రో
    ఎన్‌సీపీలో సంక్షోభం తర్వాత తొలిసారి ఒకే వేదికపై శరద్ పవార్, అజిత్ పవార్ శరద్ పవార్
    ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు భారత్ ప్రయత్నాన్ని స్వాగతిస్తాం: అమెరికా  అమెరికా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025