NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కటక్ లో ప్రధాని మోదీ.. బాధితులకు పరామర్శ.. ఆదుకుంటామని భరోసా
    కటక్ లో ప్రధాని మోదీ.. బాధితులకు పరామర్శ.. ఆదుకుంటామని భరోసా
    1/2
    భారతదేశం 0 నిమి చదవండి

    కటక్ లో ప్రధాని మోదీ.. బాధితులకు పరామర్శ.. ఆదుకుంటామని భరోసా

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 03, 2023
    06:15 pm
    కటక్ లో ప్రధాని మోదీ.. బాధితులకు పరామర్శ.. ఆదుకుంటామని భరోసా
    ఒడిశాలో మోదీ టూర్

    ఒడిశా కటక్‌లోని వివిధ ఆస్పత్రుల్లో వైద్య పొందుతున్న క్షతగాత్రులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం సాయంత్రం పరామర్శించారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యసేవలపై మంత్రులు, అధికారులతో కలిసి మోదీ స్యయంగా పర్యవేక్షించారు. దాదాపుగా 900 మంది వరకూ గాయపడి కటక్‌లోని పలు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఒడిశాలో ప్రధానమంత్రి పర్యటన కొనసాగుతోంది. తొలుత రైలు ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు మోదీ. మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ఘటనలో దాదాపు 300కిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం ఘటనాస్థలి బాలేశ్వర్ కి ప్రధాని చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి, ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలపై ఆరా తీశారు.

    2/2

    ప్రమాద స్థలిని పరిశీలించిన ప్రధాని మోదీ

    మోదీ వచ్చే సమయానికి అక్కడే ఉన్న కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఇతర అధికారులు ప్రాథమిక నివేదిక వివరాలను మోదీ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆస్పత్రికి చేరుకుని బాధితులను, క్షతగాత్రులను పరామర్శించారు. అంతకుముందు మోదీ ఎయిర్ ఫోర్స్ కి చెందిన హెలికాఫ్టర్ ద్వారా బాలాసోర్ ని సందర్శించారు. తొలుత ప్రధాని నేరుగా ప్రమాద స్థలికి చేరుకుని అక్కడి పరిస్థితిని సమీక్షించారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, రైల్వే అధికారులతో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అధికారులు ప్రాథమిక నివేదికను మోదీకి వివరించారు. అనంతరం ఆయన నేరుగా కటక్ చేరుకుని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని ఓదార్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    ప్రధాన మంత్రి
    నరేంద్ర మోదీ
    భారతదేశం
    ఒడిశా

    ప్రధాన మంత్రి

    భారత్- నేపాల్ మధ్య బంధాన్ని హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్తాం: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    కాంగ్రెస్ పాలనలోనే మహిళలపై నేరాలు అధికం; రాజస్థాన్‌లో ప్రధాని మోదీ ఫైర్  నరేంద్ర మోదీ
    Indian Economy: ఆర్థిక వ్యవస్థలో భారత్ దూకుడు.. మోర్గాన్ స్టాన్లీ ప్రశంసలు భారతదేశం
    కొత్త పార్లమెంట్‌లో 'అఖండ భారత్‌' మ్యాప్; నేపాల్ అభ్యంతరం  నేపాల్

    నరేంద్ర మోదీ

    దిల్లీ పీఠాన్ని కదిలించిన ఒడిశా దుర్ఘటన... బాలాసోర్‌లో మోదీ పర్యటన రైలు ప్రమాదం
    బ్రిజ్ భూషణ్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రధాని దేశానికి చెప్పాలి: ప్రియాంక గాంధీ  ప్రియాంక గాంధీ
    అమెరికాలో రాహుల్ గాంధీ బిజినెస్ మీటింగ్స్...పెగాసెస్ పై సంచలన వ్యాఖ్యలు  భారతదేశం
    భారత్‌లో రాజకీయాలు చేయడం కష్టం; ప్రధాని మోదీ, బీజేపీ పాలనపై రాహుల్ గాంధీ విమర్శలు  రాహుల్ గాంధీ

    భారతదేశం

    ప్రపంచాన్ని భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. పెరుగుతున్న కేసుల సంఖ్య ప్రపంచం
    ప్రమాదానికి కొద్ది క్షణాల ముందే కోరమాండల్ రాంగ్ ట్రాక్‌కి మారింది రైలు ప్రమాదం
    ప్రజారోగ్యానికి హాని కలగొచ్చు.. అందుకే ఈ కాంబో ఔషధాలు బ్యాన్ : కేంద్రం కేంద్రమంత్రి
    సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలపై కేంద్రం దేశద్రోహం అస్త్రం : అభిషేక్ సింగ్వి కాంగ్రెస్

    ఒడిశా

    భారత్‌కు ప్రపంచ నేతల సానుభూతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పుతిన్, ఫుమియో రైలు ప్రమాదం
    Odisha train accident: అంతా నిమిషాల్లోనే జరిగిపోయింది; అసలు మూడు ట్రైన్లు ఎలా ఢీకొన్నాయంటే?  రైలు ప్రమాదం
    ఒడిశా రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో 18 రైళ్లు తాత్కాలికంగా రద్దు  రైల్వే శాఖ మంత్రి
    భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలు ఇవే  రైలు ప్రమాదం
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023