Page Loader
PM Modi: దేశ ప్రజల సహకారంతో కుంభమేళా విజయవంతమైంది
దేశ ప్రజల సహకారంతో కుంభమేళా విజయవంతమైంది

PM Modi: దేశ ప్రజల సహకారంతో కుంభమేళా విజయవంతమైంది

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 18, 2025
12:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ ప్రజల సహకారంతో మహా కుంభమేళా విజయవంతమైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. రెండో విడత బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ప్రసంగించిన ఆయన, కుంభమేళాను విజయవంతం చేసిన దేశ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మహా కుంభమేళా దేశ ప్రజలను ఐక్యం చేసిందని, అలాగే భారత శక్తిని ప్రపంచానికి చూపించామని స్పష్టం చేశారు. "కుంభమేళా భవిష్యత్ తరాలకు ఓ మార్గదర్శకంగా నిలిచింది. ఇది చారిత్రాత్మక ఘట్టం. యువత కూడా ఉత్సాహంగా ఇందులో పాల్గొనడం విశేషం. మన శక్తి సామర్థ్యాలపై ఉన్న అనుమానాలను కుంభమేళా పూర్తిగా తొలగించింది," అని మోడీ పేర్కొన్నారు.

వివరాలు 

66 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు

మహా కుంభమేళా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ ఏడాది జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరిగింది. ఈ సందర్భంగా దాదాపు 66 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. మొత్తం రూ.3 లక్షల కోట్లకు పైగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కొన్ని చిన్న సంఘటనలు మినహా కుంభమేళా పూర్తిగా ప్రశాంతంగా ముగిసింది. ఈ మహా కుంభమేళాకు దేశం నలుమూలలతో పాటు విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దేశ ప్రజల సహకారంతో కుంభమేళా విజయవంతమైంది