NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Amaravati: అమరావతికి వెళ్లే ప్రజలకు ప్రత్యేక ఆహార ఏర్పాట్లు.. మూడు పూటలా ప్రత్యేక వంటకాలు.. వివరాలు ఇవే.. 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Amaravati: అమరావతికి వెళ్లే ప్రజలకు ప్రత్యేక ఆహార ఏర్పాట్లు.. మూడు పూటలా ప్రత్యేక వంటకాలు.. వివరాలు ఇవే.. 
    Amaravati: అమరావతికి వెళ్లే ప్రజలకు ప్రత్యేక ఆహార ఏర్పాట్లు..

    Amaravati: అమరావతికి వెళ్లే ప్రజలకు ప్రత్యేక ఆహార ఏర్పాట్లు.. మూడు పూటలా ప్రత్యేక వంటకాలు.. వివరాలు ఇవే.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 02, 2025
    09:37 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అమరావతిలో పునర్నిర్మాణ కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాష్ట్ర పర్యటనకు రానున్నారు.

    మధ్యాహ్నం 2.55 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన, సాయంత్రం 4.55 గంటల వరకు అమరావతిలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

    ఈ సందర్బంగా, అమరావతిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

    ఈ భారీ సభకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఐదు లక్షల మంది ప్రజలను తరలించేందుకు కూటమి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది.

    సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది.

    ప్రత్యేకంగా మూడు పూటల భోజనంతో పాటు, వేసవి తీవ్రత దృష్టిలో ఉంచుకొని పండ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ, తాగునీరు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు.

    వివరాలు 

    బస్సుల్లో ప్రత్యేక ఏర్పాట్లు.. 

    సభకు ప్రజలను తీసుకెళ్లేందుకు ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులతో పాటు ఆర్టీసీ బస్సులు ఉపయోగిస్తున్నారు. ప్రతి బస్సులో పౌష్టికాహారంతో కూడిన సరఫరా ఈ విధంగా ఉంది:

    120 భోజన ప్యాకెట్లు, 100 అరటి పండ్లు, 120 తాగునీటి సీసాలు, 60 ఓఆర్ఎస్ ప్యాకెట్లు, 60 మజ్జిగ ప్యాకెట్లు, కిచిడి, చట్నీ, ఒక నారింజ పండు ఇతర లాజిస్టిక్ అవసరాల కోసం ప్రతి బస్సులో ఒక ప్రభుత్వ ఉద్యోగిని నియమించారు.

    వివరాలు 

    మూడు పూటల ప్రత్యేక మెనూ 

    ఎడ వేడిమి నుంచి ఉపశమనం కోసం బహిరంగ సభకు వచ్చే వారికి మజ్జిగ, ఓఆర్ఎస్ టెట్రా ప్యాకెట్లు, పండ్లు వంటి దినుసులను పంపిణీ చేస్తున్నారు.

    భోజన ఏర్పాట్లు ఈ విధంగా ఉన్నాయి:

    ఉదయం అల్పాహారం: పులిహోర రెండు అరటి పండ్లు రెండు అరలీటరు తాగునీటి సీసాలు ఓఆర్ఎస్ టెట్రా ప్యాకెట్ మజ్జిగ ప్యాకెట్

    మధ్యాహ్న భోజనం: వెజిటబుల్ బిర్యానీ రెండు అరటి పండ్లు ఓఆర్ఎస్ టెట్రా ప్యాకెట్ మజ్జిగ ప్యాకెట్ రెండు తాగునీటి సీసాలు

    సాయంత్రం స్నాక్స్: రెండు బిస్కెట్ ప్యాకెట్లు రెండు నారింజ పండ్లు ఓఆర్ఎస్ టెట్రా ప్యాకెట్ మజ్జిగ ప్యాకెట్ రెండు తాగునీటి సీసాలు

    రాత్రి డిన్నర్: కిచిడీ గోంగూర చట్నీ రెండు తాగునీటి సీసాలు మజ్జిగ ప్యాకెట్

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమరావతి

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    అమరావతి

    Amaravati: రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.11 వేల కోట్లు విడుదల చేసేందుకు హడ్కో నిర్ణయం భారతదేశం
    AP New Airport : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఎయిర్‌పోర్ట్.. ఆ ప్రాంత రూపురేఖలు మార్చే ప్రణాళిక! నారా లోకేశ్
    Ap Tourism :పర్యాటక రంగం అభివృద్ధిపై ఏపీ స్పెషల్ ఫోకస్.. రూ.500 కోట్లతో అమరావతిలో భారీ పర్యాటక ప్రాజెక్టు! భారతదేశం
    Amaravati: అయిదేళ్ల నిరీక్షణకు తెరపడింది.. అమరావతి టవర్ల పునాదుల పునః ప్రారంభం ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025