NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / West Asia Crisis: మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. మోదీ అధ్యక్షతన భద్రతా క్యాబినెట్ కమిటీ అత్యవసర భేటీ
    తదుపరి వార్తా కథనం
    West Asia Crisis: మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. మోదీ అధ్యక్షతన భద్రతా క్యాబినెట్ కమిటీ అత్యవసర భేటీ
    మోదీ అధ్యక్షతన భద్రతా క్యాబినెట్ కమిటీ అత్యవసర భేటీ

    West Asia Crisis: మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. మోదీ అధ్యక్షతన భద్రతా క్యాబినెట్ కమిటీ అత్యవసర భేటీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 04, 2024
    11:01 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పశ్చిమాసియాలో ప్రాంతీయ యుద్ధ విస్తరణ భయాలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా క్యాబినెట్ కమిటీని అత్యవసరంగా సమావేశం కావాలంటూ పిలుపునిచ్చారు.

    ఈ కమిటీలో ప్రధాని, కేంద్ర హోం, రక్షణ, విదేశాంగ, ఆర్దిక మంత్రులు, జాతీయ భద్రతా సలహాదారు సభ్యులుగా ఉన్నారు.

    ఈ సమావేశంలో పశ్చిమాసియాలో జరుగుతున్న ఉద్రిక్తతలపై చర్చించనున్నారు.

    లెబనాన్‌లో పరిమిత స్థాయిలో ఇజ్రాయెల్‌పై దాడులు ప్రారంభమైన కొద్ది గంటల్లో, టెల్ అవీవ్, జెరూసలెం లక్ష్యంగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడం పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్తతలకు దారితీస్తోంది.

    ఈ పరిస్థితులు మరింత తీవ్రంగా మారవచ్చని, తదనుగుణంగా మూడో ప్రపంచ యుద్ధం తలెత్తే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    వివరాలు 

    ఆయిల్, పెట్రోలియం, ఇతర ఉత్పత్తులపై చర్చలు

    ఈ సందర్భంగా, పశ్చిమాసియాలోని ఇటీవలి పరిణామాలను తీవ్రంగా అభివర్ణిస్తూ, విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న సంక్షోభం కారణంగా ఉత్పన్నమయ్యే వివిధ సమస్యలపై అత్యుత్తమ స్థాయి కమిటీ అధ్యయనం నిర్వహించింది.

    వాణిజ్యం, రవాణా, సరఫరా చైన్ల ముఖ్యంగా ఆయిల్, పెట్రోలియం, ఇతర ఉత్పత్తులపై చర్చలు జరగనున్నాయి.

    భారత్ దౌత్యం, చర్చల ద్వారా అన్ని సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని, యుద్ధాన్ని నివారించాలని అన్ని పక్షాలను కోరింది. "ఈ సంఘర్షణ తీవ్రమైన ప్రాంతీయ యుద్ధంగా మారవద్దని" కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

    వివరాలు 

    హౌతీలు మరింత దాడులు

    ఈ సంక్షోభం ప్రభావం పశ్చిమాసియాకే పరిమితం కాకుండా, మిగతా ప్రాంతాలను, ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.

    ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగితే, కీలకమైన ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ అడెన్ మార్గాల్లో వాణిజ్యం తీవ్రంగా అంతరాయం పడుతుంది.

    ఇరాన్-మద్దతు పొందుతున్న హెజ్బొల్లా మిలిటెంట్లకు యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

    ఈ నేపథ్యంలో, ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ అడెన్ మార్గాల్లో సరుకులను రవాణా చేసే వ్యాపార నౌకలు, చముర నౌకలపై హౌతీలు మరింత దాడులు చేయవచ్చని భావిస్తున్నారు, ఇది వాణిజ్యాన్ని ప్రభావితం చేయవచ్చు.

    వివరాలు 

    వాణిజ్య నౌకలపై హౌతీలు దాడులు

    గతేడాది అక్టోబరులో ఎర్ర సముద్రంలో సంక్షోభం మొదలైనప్పుడు, హమాస్‌కు మద్దతుగా ఇజ్రాయేల్, దాని మిత్రదేశాల వాణిజ్య నౌకలపై హౌతీలు దాడులు జరుపుతున్నారు.

    దీనికి అనుగుణంగా, భారత్‌కు వచ్చే పెట్రోలియం ఎగుమతులపై కూడా ఈ పరిస్థితులు ప్రభావం చూపాయి, ఈ ఏడాది ఆగస్టులో 37.56% తగ్గి $5.96 బిలియన్లకు చేరింది, గతేడాది ఇదే సమయంలో $9.54 బిలియన్లుగా ఉంది.

    వివరాలు 

    గల్ఫ్ దేశాలతో భారత్‌కు పెద్ద ఎత్తున వాణిజ్య సంబంధాలు

    2023 డేటా ప్రకారం, సూయజ్ కాలువతో అనుసంధానమయ్యే ఎర్ర సముద్రం మార్గంలో భారతదేశ ఎగుమతుల్లో 50% అంటే రూ. 18 లక్షల కోట్లు, 30% దిగుమతులు అంటే రూ. 17 లక్షల కోట్ల విలువైనవి. గత ఆర్దిక సంవత్సరంలో భారత్ వాణిజ్యం (ఎగుమతులు, దిగుమతులు) విలువ రూ. 94 లక్షల కోట్లు కాగా, ఎగుమతులు 68%, దిగుమతులు 98% సముద్రమార్గం గుండానే సాగుతున్నాయి.

    అలాగే, గల్ఫ్ దేశాలతో భారత్‌కు పెద్ద ఎత్తున వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ఈ దేశాల వాటా భారత్ మొత్తం వాణిజ్యంలో 15% ఉంది. ఇంధనం, రక్షణ, భద్రత, ఆరోగ్య రంగాల్లో గణనీయమైన వృద్ధి నమోదు అవుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్‌ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ! జూనియర్ ఎన్టీఆర్
    Jammu Kashmir: పూంచ్‌లో పాకిస్తాన్  లైవ్‌ షెల్‌..ధ్వంసం చేసిన భారత ఆర్మీ  జమ్ముకశ్మీర్
    India-US: భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు  పీయూష్ గోయెల్‌
    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్

    నరేంద్ర మోదీ

    Semicon India 2024: నేడు ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో సెమికాన్ ఇండియా 2024 కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ..   నోయిడా
    Semicon 2024: ఇండియన్ మేడ్ చిప్ మా కల.. సెమికాన్ 2024 కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ  భారతదేశం
    PM e-DRIVE: రూ. 10,900 కోట్లతో పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్‌ను ఆమోదించిన కేబినెట్ కేంద్ర ప్రభుత్వం
    DY Chandrachud: గణేష్ పూజ వివాదం.. బీజేపీ, విపక్షాల మధ్య మాటల యుద్ధం  ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025