NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: 'ఉగ్రవాదులను మట్టిలో కలిపేశాం'.. ఆపరేషన్ సిందూర్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    PM Modi: 'ఉగ్రవాదులను మట్టిలో కలిపేశాం'.. ఆపరేషన్ సిందూర్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
    'ఉగ్రవాదులను మట్టిలో కలిపేశాం'.. ఆపరేషన్ సిందూర్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

    PM Modi: 'ఉగ్రవాదులను మట్టిలో కలిపేశాం'.. ఆపరేషన్ సిందూర్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 30, 2025
    01:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బిహార్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేస్తానని గతంలో ఇచ్చిన హామీని గుర్తుచేశారు.

    అప్పట్లో ఉగ్రవాదులకు ఊహించని రీతిలో శిక్షవిధిస్తానని చెప్పిన మాటను ఇప్పుడు అమలుచేశానని స్పష్టం చేశారు.

    శుక్రవారం బిహార్‌లోని కరకట్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు.

    ''రాముడి మార్గంలో నడిచే మనం ఒకసారి మాట ఇచ్చితే అది నిలబెట్టుకుంటాం.ఇదే కొత్త భారత్‌ విధానం.పహల్గాం ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.ఆ ఘటన జరిగిన మరుసటి రోజే నేను ఏప్రిల్ 24న బిహార్‌కి వచ్చాను.అప్పట్లోనే పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేస్తానని ఈ భూమిపై నుంచే దేశ ప్రజలకు మాట ఇచ్చాను.ఇప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చాకే మళ్లీ బిహార్‌ అడుగుపెట్టాను''అని తెలిపారు.

    వివరాలు 

    పామును తలతో సహా నాశనం చేస్తాం

    ఉగ్రవాదులపై భారత్‌ చర్యలు తీసుకున్న తీరును వివరిస్తూ.. ''పాకిస్తాన్‌ మన మహిళల సిందూర శక్తిని చూసింది. పాక్‌ ఆర్మీ రక్షణలో ఉన్నామని భావించిన ఉగ్రవాదులను మేము నిష్క్రియులుగా మార్చాం. వారి సైనిక స్థావరాలు, ఎయిర్ బేస్‌లను క్షణాల్లోనే నాశనం చేశాం. ఆపరేషన్‌ సిందూర్‌ అనేది మన మిలిటరీ తుంపల్లో ఉన్న అనేక బాణాల్లో ఒకటే. పాకిస్తాన్‌ దీన్ని గుర్తుంచుకోవాలి. ఉగ్రవాదంపై మన పోరాటం ఇంకా పూర్తవలేదు, అలాగే తగ్గిపోలేదు. మరోసారి అలాంటి దాడికి పాల్పడితే.. ఈసారి ఆ పామును తలతో సహా నాశనం చేస్తాం'' అని హెచ్చరించారు.

    వివరాలు 

    మోదీ పర్యటనకు ప్రాధాన్యం

    ప్రధాని మోదీ ప్రస్తుతం రెండు రోజుల బిహార్ పర్యటనలో ఉన్నారు.

    గురువారం పట్నాలో నిర్వహించిన మరో ర్యాలీలో కూడా పాల్గొన్నారు.

    అప్పట్లో ఆయన మాట్లాడుతూ ''దేశం ఎప్పుడూ ముందుకు సాగుతుంది.. బిహార్‌లో అభివృద్ధి ఆగదు'' అని ధీమా వ్యక్తం చేశారు.

    త్వరలో బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    PM Modi: 'ఉగ్రవాదులను మట్టిలో కలిపేశాం'.. ఆపరేషన్ సిందూర్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ
    Bhairavam Review: 'భైరవం' రివ్యూ.. ముగ్గురు హీరోలు ఎలా చేశారంటే? మంచు మనోజ్
    Rajnath Singh:పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్నిఎదుర్కోవడానికి భారతదేశం అన్ని పద్ధతులను ఉపయోగిస్తుంది: రాజ్‌నాథ్ సింగ్    రాజ్‌నాథ్ సింగ్
    Sadhana Broadcast shares fraud: సాధన బ్రాడ్‌కాస్ట్ షేర్ స్కామ్‌.. బాలీవుడ్ నటుడు సహా 57 మందిపై సెబీ నిషేధం  సెబీ

    నరేంద్ర మోదీ

    PM Modi: నేడు భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ భేటీ.. అధ్యక్షత వహించనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  భారతదేశం
    PM Modi: రష్యా వేడుకలకు హాజరుకాని మోదీ.. భారత కూటమి వైఖరికి సంకేతమా? ఇండియా
    PM Modi: ముంబయి వేదికగా 'వేవ్స్‌' 2025ను ప్రారంభించిన మోదీ భారతదేశం
    PM Modi: అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి: మోదీ అమరావతి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025