NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP High Court: పోసాని కృష్ణమురళికి హైకోర్టులో ఊరట.. ఆ కేసులలో కీలక ఆదేశాలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    AP High Court: పోసాని కృష్ణమురళికి హైకోర్టులో ఊరట.. ఆ కేసులలో కీలక ఆదేశాలు
    పోసాని కృష్ణమురళికి హైకోర్టులో ఊరట.. ఆ కేసులలో కీలక ఆదేశాలు

    AP High Court: పోసాని కృష్ణమురళికి హైకోర్టులో ఊరట.. ఆ కేసులలో కీలక ఆదేశాలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 06, 2025
    12:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత,సినీ నటుడు పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali)కి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (Andhra Pradesh High Court) కీలక ఊరట లభించింది.

    సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం,సోషల్ మీడియాలో (Social Media) అభ్యంతరకర పోస్టులు పెట్టినట్టుగా వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నాలుగు పోలీసు స్టేషన్లలో తనపై నమోదు చేసిన కేసులను రద్దు చేయాలని కోరుతూ పోసాని కృష్ణ మురళి మంగళవారం ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ (Quash Petition) దాఖలు చేశారు.

    ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది.

    వివరాలు 

    17కి పైగా పోలీస్ స్టేషన్లలో కేసులు

    విశాఖపట్టణం, చిత్తూరు జిల్లాల్లో నమోదైన కేసులపై తక్షణ చర్యలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

    అయితే,పోసాని కృష్ణ మురళిపై రాష్ట్రవ్యాప్తంగా 17కి పైగా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

    అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి ఫిబ్రవరి 26న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

    అనంతరం రైల్వే కొడూరు మేజిస్ట్రేట్ రిమాండ్ విధించడంతో రాజంపేట సబ్ జైలు (Rajampet Sub Jail)కి తరలించారు.

    నరసరావుపేట పోలీస్ స్టేషన్‌లో నమోదైన మరో కేసు కారణంగా అక్కడి పోలీసులు రాజంపేట సబ్ జైలుకు చేరుకుని పీటీ వారెంట్‌ (PT Warrant)పై పోసానిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు.

    వివరాలు 

    కర్నూలు జిల్లాలో పోసానికి 14 రోజుల రిమాండ్

    అదే రోజు సాయంత్రం నరసరావుపేట కోర్టులో అతన్ని హాజరుపరిచారు.

    ఈ నేపథ్యంలో, పోసాని కృష్ణ మురళికి ఈ నెల 13 వరకు కోర్టు రిమాండ్ విధించింది.

    తదనంతరం గుంటూరు సబ్ జైలుకు తరలించగా, మంగళవారం ఆదోని (Adoni) పోలీసులు గుంటూరు (Guntur) జైలులో నుంచి అతన్ని అదుపులోకి తీసుకుని కర్నూలు (Kurnool) తరలించారు.

    అక్కడ కర్నూలు జిల్లా జడ్జి ఎదుట హాజరుపరచగా, న్యాయమూర్తి పోసానికి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం పోసాని కృష్ణ మురళి కర్నూలు జిల్లా జైలులో ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Ravi Teja : మాస్ మహారాజా ఫ్యాన్స్ కి సూపర్ ఫ్యాన్స్.. మరోసారి థియోటర్స్‌లోకి 'వెంకీ' రవితేజ
    Chhattisgarh: బీజాపూర్ నేషనల్ పార్క్‌లో ఎన్‌కౌంటర్ .. ఇద్దరు మావోయిస్టులు హతం ఛత్తీస్‌గఢ్
    Pawan Kalyan: పవన్‌కళ్యాణ్‌తో అర్జున్ దాస్‌.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్! పవన్ కళ్యాణ్
    APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీకి మరో 600 విద్యుత్తు బస్సులు ఏపీఎస్ఆర్టీసీ

    ఆంధ్రప్రదేశ్

    chilli farmers: మిర్చి రైతులకు ఊరట.. చంద్రబాబు విజ్ఞప్తికి కేంద్రం సానుకూల స్పందన చంద్రబాబు నాయుడు
    APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్ పరీక్షపై కీలక ప్రకటన  భారతదేశం
    Amaravati: అమరావతి మళ్లీ ఊపందుకోనుందా? నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్! అమరావతి
    Andhra News: పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌.. ఫిబ్రవరి మూడో వారానికే 243 ఎంయూలకు చేరిన వినియోగం  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025