
Pragathi Bhavan: బద్దలైన ప్రగతి భవన్ గేట్లు.. అంబేద్కర్ ప్రజాభవన్'లో భారీ మార్పులు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ గేట్లు బద్దలయ్యాయి. ఈ మేరకు గత ప్రభుత్వ తాలుకా ఉన్న ఛాయలన్నీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తొలగిస్తోంది.
ఈ క్రమంలోనే ప్రగతి భవన్లో భారీగా మార్పులు చేర్పులతో అంబేద్కర్ ప్రజా భవన్గా పేరు మారింది.
కాంగ్రెస్ సర్కారు హయాంలో సామాన్యుేలకి సైతం ప్రజా భవన్లోకి ప్రవేశం ఉంటుందని ప్రకటించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రగతి భవన్'లోకి మంత్రులకు కూడా ప్రవేశం ఉండేది కాదని, ఇప్పుడు సాధారణ ప్రజలకు ప్రవేశం కల్పిస్తామని కాంగ్రెస్ గతంలోనే ప్రకటించింది.
2016 నవంబరు 23న నిర్మించిన సీఎం అధికార నివాసం రూ.38 కోట్లు ఖర్చయ్యాయి.ముంబైకి చెందిన షాపూర్జీ పల్లోంజి నిర్మాణ సంస్థ 9 ఎకరాల్లో ప్రగతి భవన్ నిర్మించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బద్దలైన ప్రగతి భవన్ గేట్లు
PragathiBhavan becoming Ambedkar PrajaBhavan
— Congress for Telangana (@Congress4TS) December 7, 2023
ప్రగతిభవన్... అంబేద్కర్ ప్రజాభవన్గా మారుతోంది.
ప్రగతి భవన్ ముందు రోడ్ పై ఉన్న షెడ్, గ్రిల్స్ ని తొలగిస్తున్న GHMC సిబ్బంది.
GHMC staff removing the shed and grills on the road in front of Pragati Bhavan.#TelanganaCM #RevanthReddy… pic.twitter.com/GtwQxc9h2u