NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Parliment Session: జనవరి 31న ప్రారంభం కానున్న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు.. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం 
    తదుపరి వార్తా కథనం
    Parliment Session: జనవరి 31న ప్రారంభం కానున్న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు.. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం 
    జనవరి 31న ప్రారంభం కానున్న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు..

    Parliment Session: జనవరి 31న ప్రారంభం కానున్న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు.. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 28, 2025
    04:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31న ప్రారంభం అవుతున్నాయి. తొలి రోజు, శుక్రవారం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

    ఈ పార్లమెంట్‌ సమావేశాలు రెండు విడతల్లో నిర్వహించబడతాయి. మొదటి విడత సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతాయి.

    రెండవ విడత సమావేశాలు మార్చి 10న ప్రారంభమై, ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి.

    మంగళవారం విడుదలైన పార్లమెంటరీ బులిటెన్‌ ప్రకారం, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌-2025ను ప్రవేశపెడతారు.

    ఆపై, రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత అరగంట సమయం గడిచిన తరువాత రాజ్యసభ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.

    వివరాలు 

    ప్రతిపక్షం సహకరిస్తేనే పార్లమెంట్‌

    పార్లమెంట్‌ సమావేశాలకు ముందు,జనవరి 30న ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు తెలిపారు.

    రాబోయే సమావేశాల్లో పార్లమెంట్‌ను సమర్ధవంతంగా నిర్వహించేందుకు ప్రతిపక్ష నాయకులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

    ఈ సందర్భంలో గతంలో జరిగిన సమావేశాల పరమైన పరిస్థితులను ప్రస్తావించారు.

    రెండు సెషన్లలో,పార్లమెంట్‌లో గందరగోళం ఏర్పడింది. ఈ కారణంగా, పార్లమెంట్‌ ప్రతిష్టకు గాయం కలిగింది.

    ఈ సారి ప్రతిపక్ష నాయకులు,ఇతర ఎంపీలు చర్చల్లో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

    ప్రతిపక్షం సహకరిస్తేనే పార్లమెంట్‌ పనిచేస్తుంది, చర్చలు జరుగుతాయని చెప్పారు.

    కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ సమతుల్య బడ్జెట్‌ను ప్రవేశపెడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

    ఈ సారి బడ్జెట్‌ సమంజసంగా ఉండాలని అందరూ ఆశిస్తున్నారని ఆయన తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కిరెణ్ రిజిజు

    తాజా

    Apple Games: ఆపిల్‌ నుంచి కొత్త గేమింగ్ యాప్ ఆవిష్కరణ.. 'ఆల్-ఇన్-వన్' ప్లాట్‌ఫారంగా మారే అవకాశం! ఆపిల్
    WWDC 2025: యాపిల్‌ watchOS 26 ఆవిష్కరణ.. లిక్విడ్ గ్లాస్ డిజైన్, జెస్టర్ కంట్రోల్స్ వంటి అధునాతన ఫీచర్లు! ఆపిల్
    Apple: యాపిల్ iPadOS 26 అధికారికంగా విడుదల.. డెస్క్‌టాప్ అనుభూతి, కొత్త డిజైన్, అపారమైన ఫీచర్లు  ఆపిల్
    macOS Tahoe: ఆపిల్ macOS Tahoe విడుదల.. కొత్త లిక్విడ్ గ్లాస్ డిజైన్, మెరుగైన AI ఫీచర్లు! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    కిరెణ్ రిజిజు

    సుప్రీంకోర్టు కొలీజియంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులను చేర్చాలి: కిరెన్ రిజిజు సుప్రీంకోర్టు
    కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను నిలిపివేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం: జస్టిస్ నారిమన్ సుప్రీంకోర్టు
    'దేశ ప్రజలకే వదిలేయండి'; స్వలింగ వివాహంపై కిరణ్ రిజిజు ఆసక్తికర కామెంట్స్ డివై చంద్రచూడ్
    కేంద్ర న్యాయ మంత్రిగా కిరెణ్ రిజిజు తొలగింపు; అర్జున్ రామ్ మేఘవాల్ నియామకం  అర్జున్ రామ్ మేఘవాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025