NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rahul Gandhi: పహల్గామ్‌పై కాంగ్రెస్ కొత్త డిమాండ్?.. పార్లమెంటులో ప్రత్యేక సమావేశాలు కోరుతూ ప్రధానికి రాహుల్‌ లేఖ
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Rahul Gandhi: పహల్గామ్‌పై కాంగ్రెస్ కొత్త డిమాండ్?.. పార్లమెంటులో ప్రత్యేక సమావేశాలు కోరుతూ ప్రధానికి రాహుల్‌ లేఖ
    పార్లమెంటులో ప్రత్యేక సమావేశాలు కోరుతూ ప్రధానికి రాహుల్‌ లేఖ

    Rahul Gandhi: పహల్గామ్‌పై కాంగ్రెస్ కొత్త డిమాండ్?.. పార్లమెంటులో ప్రత్యేక సమావేశాలు కోరుతూ ప్రధానికి రాహుల్‌ లేఖ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 29, 2025
    11:38 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

    ఈ దారుణ ఘటన నేపథ్యంలో, దేశ రాజకీయ వర్గాల్లో చర్చలు వేడెక్కుతున్నాయి.

    ముఖ్యంగా విపక్ష పార్టీలు దీనిపై పార్లమెంటులో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి.

    ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా లేఖలు రాశారు.

    రాహుల్‌ గాంధీ 'ఎక్స్‌' (మాజీ ట్విటర్‌) వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.

    వివరాలు 

     మల్లికార్జున ఖర్గే కూడా ప్రధాని మోదీకి లేఖ 

    "పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ప్రతి భారత పౌరుడి మనసులో ఆవేశం కలిగించింది. ఇలాంటి సంక్షోభ సమయంలో, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకతాటిపై ఉన్నట్టు ప్రపంచానికి స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందుకే పార్లమెంటు రెండు సభల్లో కూడా ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి" అని రాహుల్‌ పేర్కొన్నారు.

    అదే విషయాన్ని మల్లికార్జున ఖర్గే కూడా ప్రధాని మోదీకి లేఖ ద్వారా తెలియజేశారు.

    ఈ విషయం గురించి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జైరాం రమేశ్‌ 'ఎక్స్‌'లో పోస్ట్‌ చేస్తూ లేఖ వివరాలను వెల్లడించారు.

    పహల్గాం ఘటనపై విపక్ష పార్టీలు ఏకకంఠంగా ధ్వజమెత్తి ఖండించాయి. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఏదైనా చర్యలు చేపడితే తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టంగా తెలియజేశాయి.

    వివరాలు 

    కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా కలిసికట్టుగా ముందుకు రావాలి 

    అదే సమయంలో, ఈ ఘటనను పరిశీలిస్తూ పార్లమెంటులో ప్రత్యేకంగా చర్చలు జరిపేలా సమావేశాలు నిర్వహించాలని నిరంతరంగా విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.

    ఈ విషయంలో మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని స్వతంత్ర రాజ్యసభ సభ్యుడు కపిల్‌ సిబల్‌ సూచించారు.

    ఇప్పటికే ఆయన అన్ని రాజకీయ పార్టీలను ఉద్దేశించి ఒక విజ్ఞప్తి చేస్తూ, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా కలిసికట్టుగా ముందుకు రావాలని కోరారు.

    "పహల్గాం ఘటనపై ఖండన తీర్మానం చేయడం ద్వారా దేశం ఒక్కటిగా ఉంది అనే బలమైన సందేశం ప్రపంచానికి వెళ్లాలి" అని ఆయన పేర్కొన్నారు.

    వివరాలు 

    భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు

    ఏప్రిల్‌ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో పర్యాటకులపై విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.

    ఈ దాడి అనంతరం భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

    పాకిస్థాన్‌ ఆధారిత ఉగ్రవాదాన్ని పూర్తిగా అరికట్టే వరకు ఆ దేశానికి వ్యతిరేకంగా కఠినంగా వ్యవహరించాలనే సంకల్పంతో భారత్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాహుల్ గాంధీ
    మల్లికార్జున ఖర్గే

    తాజా

    India Test Squad: టీమిండియా టెస్టు సారథిగా శుభ్‌మన్‌ గిల్‌ ఎంపిక శుభమన్ గిల్
    Chandrababu: 2.4 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంతో ఏపీ ముందుకు.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ప్రణాళికలు చంద్రబాబు నాయుడు
    Travel India: వేసవిలో స్విట్జర్లాండ్‌ లాంటి అనుభవం.. భారతదేశపు మినీ హిల్ స్టేషన్లు ఇవే! భారతదేశం
    KTR: పార్టీ అధినేతకు సూచనలు ఇవ్వడం కోసం లేఖలు రాయొచ్చు : కేటీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    రాహుల్ గాంధీ

    Powerful Political Leader: అత్యంత శక్తివంతమైన ప్రధానిగా మోదీ.. ముఖ్యమంత్రుల్లో అగ్రస్థానంలో చంద్రబాబు నరేంద్ర మోదీ
    Rahul Gandhi helicopter: జార్ఖండ్‌లోని గొడ్డాలో చిక్కుకున్న రాహుల్‌ గాంధీ హెలికాప్టర్‌.. లభించని ఏటీసీ క్లియరెన్స్‌ భారతదేశం
    Rahul Gandhi on adani: అదానీని అరెస్ట్ చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్, ప్రధాని మోదీపై మరోసారి విమర్శలు అదానీ గ్రూప్
    Priyanka Gandhi: 'మీ ప్రేమ, నమ్మకానికి రుణపడి ఉంటాను'.. విజయంపై ప్రియాంక గాంధీ ఎమోషనల్ ప్రియాంక గాంధీ

    మల్లికార్జున ఖర్గే

    రెండో రోజూ రూల్స్ 267, 176లపై దుమారం.. ప్రధానికి ఖర్గే ఘాటు ప్రశ్నలు కాంగ్రెస్
    మణిపూర్‌ పరిస్థితిపై ప్రధాని మోదీ మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్: ఈ నెల 24న నిరసన మణిపూర్
    రాష్ట్రపతిని కలిసిన ప్రతిపక్ష నేతల బృందం; మణిపూర్ పరిస్థితిపై మెమోరాండం అందజేత ద్రౌపది ముర్ము
    రూల్ ఏదైనా చర్చకు మేం రెడీ.. కానీ ప్రధాని ప్రకటనపై మార్చుకొని వైఖరి ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025