NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఒడిశా రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం; సీబీఐ విచారణను కోరిన రైల్వే శాఖ 
    తదుపరి వార్తా కథనం
    ఒడిశా రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం; సీబీఐ విచారణను కోరిన రైల్వే శాఖ 
    ఒడిశా రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం; సీబీఐ విచారణను కోరిన రైల్వే శాఖ

    ఒడిశా రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం; సీబీఐ విచారణను కోరిన రైల్వే శాఖ 

    వ్రాసిన వారు Stalin
    Jun 05, 2023
    09:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొన్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటనపై రాజకీయ దుమారం రేగడంతో రైల్వే మంత్రిత్వ శాఖ సీబీఐ విచారణకు సిఫార్సు చేసింది. ఈ మేరకు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.

    'ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్'లో వచ్చిన మార్పు వల్లే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైందని, ఈ క్రమంలో దాని ఇంజిన్, కోచ్‌లు లూప్ లైన్‌లలో ఒకదానిపై ఒకటి పడిపోయినట్లు మంత్రి ఇదివరకే ప్రకటించారు.

    ఈ క్రమంలో లూప్‌లైన్ మార్గంలో వచ్చిన గూడ్స్ రైలు ట్రాక్‌పై పడి ఉన్న కోచ్‌లను ఢీకొట్టినట్లు మంత్రి వెల్లడించారు.

    దీని వల్ల కోరమాండల్ కోచ్‌లు మూడో ట్రాక్‌లోకి వెళ్లడంతో, అధికవేగంతో వస్తున్న బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ వాటిని ఢీకొట్టినట్లు రైల్వేశాఖ తెలిపింది.

    రైలు

    భద్రతా చర్యలు లేకపోవడంపై ప్రతిపక్షాల విమర్శలు

    మూడు రైళ్లు ఢీకొన్ని మార్గంలో దేశీయంగా అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ "కవాచ్" కూడా అందుబాటులో లేదు. ఇది అమల్లో ఉన్నా కూడా ఇలాంటి ప్రమాదాన్ని నివారించడంలో ఈ వ్యవస్థ ఉపయోగపడేది కాదని రైల్వే అధికారి ఒకరు చెప్పారు.

    రైలు భద్రతలో అనేక తీవ్రమైన లోపాలతో కూడిన రైల్వే ఆడిట్ నివేదికను గతేడాది సెప్టెంబర్‌లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.

    అయితే ఆ లోపాలను సవరించడంలో విఫలమైనందు వల్లే ఇప్పుడు ఇంతపెద్ద రైలు ప్రమాదం జరిగిందని రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

    భద్రతా చర్యలు లేకపోవడంపై ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో రాజకీయ దుమారం రేగింది.

    రైళ్లలో యాంటీ-కాల్షన్ సిస్టమ్‌ను అమర్చినట్లయితే ప్రమాదాన్ని నివారించవచ్చని గతంలో రైల్వేమంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీ పేర్కొన్నారు.

    రైలు

    సీబీఐ పని నేరాలను పరిశోధించడమే: తృణమూల్ 

    ఈ ప్రమాదంలో సీబీఐ విచారణకు సిఫార్సు చేయడంపై కూడా రాజకీయ ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

    సీబీఐ పని నేరాలను పరిశోధించడమే అని, రైల్వే ప్రమాదాలు, లోపాల గురించి కాదని తృణమూల్ ప్రతినిధి సాకేత్ గోఖలే ట్వీట్ చేశారు.

    రైల్వే మంత్రిని రక్షించడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నం ఇదన్నారు. ఇదిలా ఉంటే, ఒడిశా ప్రభుత్వం ప్రమాదంలో మరణాల సంఖ్యను సవరించింది.

    సంఖ్యను 288 నుంచి 275కి తగ్గించింది. గాయపడిన వారి సంఖ్యను 1,175గా ఉంచింది. దేశంలో ఇది మూడో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం అని గణాంకాలు సూచిస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రైలు ప్రమాదం
    ఒడిశా
    సీబీఐ
    రైల్వే శాఖ మంత్రి

    తాజా

    Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్
    Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత అస్సాం/అసోం
    Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది టాలీవుడ్
    Hyderabad Metro: నేటి నుంచి మెట్రో ఛార్జీల్లో పెంపు.. ప్రయాణికులకు అదనపు భారం మెట్రో స్టేషన్

    రైలు ప్రమాదం

    మధ్యప్రదేశ్: రెండు గూడ్స్ రైళ్లు ఢీ; లోకో పైలట్ మృతి  మధ్యప్రదేశ్
    కోజికోడ్ రైలు దహనం కేసు: కేరళ ఐపీఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు  కేరళ
    వైకల్యాన్ని జయించిన సూరజ్ తివారీ; రెండు కాళ్లు, కుడి చేయి లేకున్నా సివిల్స్ ర్యాంకు సాధించాడు  ఉత్తర్‌ప్రదేశ్
    రైల్వే ట్రాక్‌ను సులభంగా దాటుతున్న ఏనుగులు.. అధికారులు వినూత్న ఏర్పాటు (వీడియో వైరల్)  భారతదేశం

    ఒడిశా

    ఫిబ్రవరి 5న బీఆర్ఎస్‌లో చేరనున్న ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్! భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    మనసును కదిలించే సంఘటన: భార్య మృతదేహాన్ని భూజాలపై మోసుకుంటూ కాలిననడకన ఒడిశాకు.. ఆంధ్రప్రదేశ్
    మహిళా పోలీసును నెట్టేసిన బీజేపీ ఎమ్మెల్యే; బూతులు తిట్టారని ఇన్‌స్పెక్టర్ ఆరోపణ బీజేపీ
    ఆంధ్రప్రదేశ్‌‌కు కేంద్రం షాక్: ప్రత్యేక హోదా డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోబోమని నిర్మల ప్రకటన నిర్మలా సీతారామన్

    సీబీఐ

    'చందా కొచ్చర్‌ అరెస్టు అక్రమం'.. బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు భారతదేశం
    దిల్లీ లిక్కర్ కేసు: కవిత మాజీ ఆడిటర్‌ను అరెస్టు చేసిన సీబీఐ కల్వకుంట్ల కవిత
    దిల్లీ మద్యం కేసు: మనీష్ సిసోడియాకు మరోసారి సీబీఐ నోటీసులు జారీ దిల్లీ
    దిల్లీ: సిసోడియాకు షాకిచ్చిన కేంద్రం; పొలిటికల్ గూఢచర్యం కేసులో విచారణకు అనుమతి దిల్లీ

    రైల్వే శాఖ మంత్రి

    సంక్రాంతికి 94 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే తెలంగాణ
    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    సీసీ కెమెరా నిఘాలో రైల్వే కోచ్‌లు.. ఇక రైలు ప్రయాణం మరింత భద్రం భారతదేశం
    50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025