NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభ మేళాకు రైల్వేశాఖ రెఢీ.. 800 ప్రత్యేక రైళ్లు కేటాయింపు
    తదుపరి వార్తా కథనం
    ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభ మేళాకు రైల్వేశాఖ రెఢీ.. 800 ప్రత్యేక రైళ్లు కేటాయింపు
    800 ప్రత్యేక రైళ్లు కేటాయింపు

    ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభ మేళాకు రైల్వేశాఖ రెఢీ.. 800 ప్రత్యేక రైళ్లు కేటాయింపు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 20, 2023
    07:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలోనే అటు జనాభా పరంగా, ఇటు వైశాల్యం పరంగా అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్.

    నాలుగేళ్లకోసారి (పవిత్ర స్నానాల పండగ) కుంభమేళాను యూపీలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అయితే 2025లో ప్రయాగ్ రాజ్ కుంభమేళా జరగనుంది.

    ఈ నేపథ్యంలో రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను కేటాయించేందుకు సిద్ధమవుతోంది. స్నానాల పండగ కోసమే దేశ నలుమూలల నుంచి తరలివచ్చే కోట్లాది భక్తుల కోసం స్పెషల్ గా 800 రైళ్లను నడిపేందుకు కృషి చేస్తోంది.

    ఈ మేరకు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నతాధికారులతో కీలక మీటింగ్ నిర్వహించారు. స్టేషన్లలో ఎలాంటి ఏర్పాట్లను చేయాలనే అంశం నుంచి రైళ్ల ప్రస్తుత స్థితిగతుల వరకు సమీక్ష చేశారు.

    DETAILS

    అన్ని ఏర్పాట్లకు రైల్వే మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ 

    మహాకుంభమేళాకు నార్తర్న్ సెంట్రల్ రైల్వే నోడల్‌గా మారనుంది. ప్రయాగ్‌రాజ్‌లోని నార్తర్న్ రైల్వే, నార్త్ ఈస్టర్న్ రైల్వేలు ఏర్పాట్లు చేస్తోంది.

    ఈ దఫా 2025లో జరిగే కుంభమేళాకు సుమారు 15 కోట్ల మందికిపైగా భక్తులు తరలివస్తారని భావిస్తున్నారు. యాత్రికులకు రవాణా సౌకర్యం కోసం NCR,NR 9 రైల్వే స్టేషన్లను ఏర్పాటు చేయనుంది.

    మేళా కోసం రూ.837 కోట్ల బడ్జెట్‌తో ఆర్‌ఓబీ, ఆర్‌యూబీలు నిర్మిస్తున్నారు. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం లభించింది.

    భక్తుల రద్దీ నేపథ్యంలో రైల్వే స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేస్తోంది. రైల్వే అధికారులు, ఉద్యోగులు దిల్లీ కంట్రోల్‌ రూమ్‌ నుంచి 24 గంటల పాటు రైళ్లను పర్యవేక్షించనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    ఉత్తర్‌ప్రదేశ్

    ఉత్తర్‌ప్రదేశ్: ఆక్రమణల తొలగింపు సమయంలో ఇంటికి నిప్పు! తల్లీ, కూతురు సజీవ దహనం అగ్నిప్రమాదం
    గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం; దేశవ్యాప్తంగా 72చోట్లు దాడులు ఎన్ఐఏ
    యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ అఖిలేష్ యాదవ్: యూపీలో శాంతి‌భద్రతలపై అసెంబ్లీలో డైలాగ్ వార్ యోగి ఆదిత్యనాథ్
    ఉమేష్ పాల్ హత్య కేసు: పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నిందితుడు ఉస్మాన్ మృతి తుపాకీ కాల్పులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025