• భారతదేశం
  • బిజినెస్
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • టెక్నాలజీ
మరింత
సినిమాఆటోమొబైల్స్లైఫ్-స్టైల్కథనాలు
English Hindi Tamil
మరింత
English Hindi Tamil
భారతదేశం
బిజినెస్
అంతర్జాతీయం
క్రీడలు
టెక్నాలజీ
సినిమా
ఆటోమొబైల్స్
లైఫ్-స్టైల్
కథనాలు

మమ్మల్ని అనుసరించండి
  • Facebook
  • Twitter
  • Linkedin
హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bullet Train: ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్‌లో 300 కి.మీ వయాడక్ట్ పూర్తయింది: కేంద్ర మంత్రి వైష్ణవ్
తదుపరి వార్తా కథనం
Bullet Train: ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్‌లో 300 కి.మీ వయాడక్ట్ పూర్తయింది: కేంద్ర మంత్రి వైష్ణవ్

Bullet Train: ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్‌లో 300 కి.మీ వయాడక్ట్ పూర్తయింది: కేంద్ర మంత్రి వైష్ణవ్

వ్రాసిన వారు Sirish Praharaju
May 20, 2025
04:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

అహ్మదాబాద్‌ నుంచి ముంబై వరకు నిర్మిస్తున్న దేశంలోని మొట్టమొదటి బుల్లెట్‌ రైలు మార్గం పురోగతిలో కీలక దశను చేరుకుంది.

ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటివరకు 300కిలోమీటర్ల వంతెన నిర్మాణం పూర్తయిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.

ఆయన ఈ విషయాన్ని సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్'లో వీడియోను పంచుతూ వెల్లడించారు.

ఈ హైస్పీడ్‌ రైలు మార్గం మొత్తం పొడవు 508.17 కిలోమీటర్లుగా ఉండబోతోంది. పనులు వేగంగా సాగుతుండగా, రైలు పూర్తిగా ప్రారంభమైన తర్వాత అహ్మదాబాద్‌ నుంచి ముంబయి చేరడానికి కేవలం 2 గంటలు 58 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది.

ఈ మార్గంలో గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఎనిమిది రైల్వే స్టేషన్లతో పాటు, మహారాష్ట్రలో మరో నాలుగు స్టేషన్లు ఏర్పాటవుతున్నాయి.

వివరాలు 

మొదటి ట్రయల్ రన్‌ను 2026లో..

ఇక ఈ ప్రాజెక్టు పరిధిలో బుల్లెట్‌ ట్రైన్‌ మొదటి ట్రయల్ రన్‌ను 2026లో నిర్వహించనున్నట్టు అధికారులు తెలియజేశారు.

పరీక్షాత్మక దశలో రైలు గంటకు 350 కి.మీ. వేగంతో ప్రయాణించనుండగా, ఇది విమానం టేకాఫ్‌ అయ్యే వేగంతో సమానమని వారు పేర్కొన్నారు.

అయితే, ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ రైలు గరిష్ఠంగా గంటకు 320 కి.మీ. వేగంతో నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ అత్యాధునిక ప్రాజెక్ట్‌కు అంచనా వ్యయం సుమారు రూ.1.08 లక్షల కోట్లు. ఇది కేంద్ర ప్రభుత్వం, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహకారంతో అమలవుతోంది.

మీరు
50%
శాతం పూర్తి చేశారు

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అశ్విని వైష్ణవ్ చేసిన ట్వీట్ 

300 km viaduct completed.
— Bullet Train Project pic.twitter.com/dPP25lU2Gy

— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) May 20, 2025
మీరు పూర్తి చేశారు
Facebook
Whatsapp
Twitter
Linkedin
సంబంధిత వార్తలు
తాజా
అశ్విని వైష్ణవ్

తాజా

Bangladesh: శ్రీలంకకు వెళ్లే బంగ్లాదేశ్ జట్టుకు కెప్టెన్ గా మెహిదీ హసన్ మీరాజ్   బంగ్లాదేశ్
WTC Final 2025: చరిత్ర సృష్టించిన పాట్‌ కమిన్స్‌.. రికార్డుల మీద రికార్డులు పాట్ కమిన్స్
Aircraft Accidents:  భారత్‌లో జరిగిన భారీ విమాన ప్రమాదాలు,నష్టాలు ఇవే..! విమానం
Air india Flight Crash: విమాన ప్రమాదంలో గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపానీ మృతి  గుజరాత్

అశ్విని వైష్ణవ్

భారతీయ రైల్వే 'షవర్ సౌకర్యం'; ఏసీ కోచ్‌ పైకప్పు లీక్ కావడంపై నెటిజన్లు ఫైర్ సోషల్ మీడియా
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో కొత్త ఫీచర్లు; ప్రయాణం మరింత సౌకర్యవంతం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
Vishwakarma Yojana: 5శాతం వడ్డీతో రూ.1లక్ష రుణం అందించాలని కేంద్రం నిర్ణయం  కేంద్ర ప్రభుత్వం
6నెలల్లోనే హై స్పీడ్ ట్రైన్ వచ్చేస్తుంది.. ప్రకటించిన రైల్వే మంత్రి  రైల్వే శాఖ మంత్రి
మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
మమ్మల్ని అనుసరించండి
Facebook Twitter Linkedin
All rights reserved © NewsBytes 2025