NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఇవాళ రేపు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం
    తదుపరి వార్తా కథనం
    తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఇవాళ రేపు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం
    ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు

    తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఇవాళ రేపు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 09, 2023
    10:13 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐఎండీ తీపి కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు దేశంలోకి ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాలు గురువారం కేరళ,తమిళనాడు రాష్ట్రాలను తాకాయి. 48 గంటల్లో కేరళ, తమిళనాడులో విస్తరించి కర్ణాటకలోని కొన్ని భాగాలలో సైతం అవి ప్రవేశించనున్నాయి.

    తెలంగాణ రాష్ట్రంలోనూ రానున్న 2 రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులుతో కూడిన వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు జల్లులతో కూడిన మోస్తారు వానలు కురిసే అవకాశం ఉందిని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

    మరోవైపు నల్గొండ, సూర్యాపేట, కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో వచ్చే 2 రోజులు వడగాలులు వీయనుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

    DETAILS

    రాయలసీమలో అక్కడ చల్లదనం, ఇక్కడ వేడి

    హైదరాబాద్ సిటీలో శుక్రవారం సాయంత్రం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఉరుములతో కూడిన తేలికపాటి జల్లులు కురవనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో పగటిపూట ఉష్ణోగ్రతలు కనిష్ఠంగా 27 డిగ్రీలు, గరిష్ఠంగా 39 డిగ్రీలు ఉండే అవకాశం ఉందని వివరించింది.

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకు వేడి నుంచి ఉపశమనం కలిగే అవకాశాలున్నాయి. ఓవైపు తేమగాలులు వీస్తుండటం, మరోవైపు రాయలసీమ జిల్లాలతో సహా కోస్తాంధ్ర వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమైంది.

    అయితే కర్నూలు, అనంతపురం, నంద్యాల జిల్లాల్లో మాత్రం వాతావరణం చల్లగా మారనుండగా, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, కడప సహా నెల్లూరు జిల్లాల్లో ఇంకా వేడి వాతావరణమే కొనసాగనుంది.

    DETAILS

    తీరప్రాంతాలకు అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ

    IMD తాజా వాతావరణ బులెటిన్ ప్రకారం తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా తీవ్రమైన బిపర్‌జోయ్ తుపాను ప్రస్తుతం గుజరాత్ పోరుబందర్‌కు నైరుతి దిశలో సుమారు 930 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. అనంతరం ఉత్తర-వాయువ్య దిశగా కదులుతుంది.

    ఈ తుపాను కారణంగా ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు దక్షిణాదితో సహా కోస్తా ప్రాంతాల్లో కురవనున్నట్లు భారత వాతావరణ కేంద్రం చెబుతోంది.

    మరోవైపు గుజరాత్, సౌరాష్ట్ర లోని అన్ని హార్బర్లలో తుపాను నేపథ్యంలో సుదూర ప్రమాద హెచ్చరిక సిగ్నల్‌ను ఎగరవేయమని ఐఎండీ నిర్దేశించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వర్షాకాలం
    నైరుతి రుతుపవనాలు
    తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Mango seed: చర్మం నుంచి జీర్ణక్రియ వరకు.. మామిడి టెంకలతో అద్భుత ప్రయోజనాలివే! జీవనశైలి
    Mohmand Dam: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు.. మోహ్మండ్ హైడ్రోపవర్ ప్రాజెక్టుపై చైనా దృష్టి చైనా
    ACUTE FOOD INSECURITY IN PAKISTAN: ఆహార సంక్షోభంలో పాక్‌.. 11మిలియన్ల మంది ఆకలితో అలమటించే ప్రమాదం: FAO పాకిస్థాన్
    Pakistan:పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ.. జ్యోతి మల్హోత్రాను ఓ అస్త్రంగా మలుచుకున్నారు: హర్యానా పోలీసులు   జ్యోతి మల్హోత్రా

    వర్షాకాలం

    ఏపీ, తెలంగాణలో ఘనంగా ఏరువాక పౌర్ణమి; వ్యవసాయ పనులు షూరూ  ఆంధ్రప్రదేశ్
    ట్రావెల్: వర్షాకాలంలో అందమైన అనుభూతిని పంచే భారతదేశంలోని పర్యాటక ప్రదేశాలు  పర్యాటకం
    ఊరిస్తున్న నైరుతిరుతుపవనాలు..ఇంకా కేరళను తాకని తొలకరిజల్లులు  శ్రీలంక
    నైరుతి రుతుపవనాల జాడేదీ..ఇంకా కేరళను తాకని నైరుతి, మరో 3 రోజుల ఆలస్యం ఆంధ్రప్రదేశ్

    నైరుతి రుతుపవనాలు

    కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు; ధృవీకరించిన ఐఎండీ  ఐఎండీ

    తెలంగాణ

    TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్ ఇలా చూసుకోండి తాజా వార్తలు
    తెలంగాణ ఆర్టీసీకి గణనీయంగా తగ్గిన నష్టాలు; నల్గొండ రీజియన్ టాప్  టీఎస్ఆర్టీసీ
    జూన్ 22నుంచి ఆషాఢ బోనాలు; నిర్వహణం కోసం రూ.15కోట్లు కేటాయించిన ప్రభుత్వం తాజా వార్తలు
    హైదరాబాద్‌: అండర్‌వాటర్‌ టన్నెల్‌ ఎక్స్‌పోకు విశేష స్పందన; భారీగా తరలివస్తున్న పబ్లిక్ హైదరాబాద్

    ఆంధ్రప్రదేశ్

     వైఎస్ వివేకా రాసిన లేఖపై వేలి ముద్రలు ఎవరివో తేల్చే పనిలో సీబీఐ  సీబీఐ
    'టీడీపీ నాయకులను సీఎం చేయడానికి నేను లేను'; పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్  పవన్ కళ్యాణ్
    అమరావతి రైతులకు షాక్, 'ఆర్5 జోన్'పై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ అమరావతి
    ఏపీలో చిట్ ఫండ్ కంపెనీలకు షాకిస్తూ కొత్త రూల్ తీసుకొచ్చిన ప్రభుత్వం ధర్మాన ప్రసాద రావు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025