NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / పెరుగుతున్న ఉష్ణోగ్రతలు; వేడిగాలులతో దేశంలో నగరాలు ఉక్కిరి బిక్కిరి
    తదుపరి వార్తా కథనం
    పెరుగుతున్న ఉష్ణోగ్రతలు; వేడిగాలులతో దేశంలో నగరాలు ఉక్కిరి బిక్కిరి
    పెరుగుతున్న ఉష్ణోగ్రతలు; వేడిగాలులతో దేశంలో నగరాలు ఉక్కిరి బిక్కిరి

    పెరుగుతున్న ఉష్ణోగ్రతలు; వేడిగాలులతో దేశంలో నగరాలు ఉక్కిరి బిక్కిరి

    వ్రాసిన వారు Stalin
    Apr 19, 2023
    01:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలో ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

    సూర్యుడి భగభగలకు వేడి గాలులు తోడవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

    ముఖ్యంగా దేశంలోని నగరాలు వేడి గాలులకు ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.

    ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్, ప్రయాగ్‌రాజ్‌లో అత్యధికంగా 44.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి.

    దిల్లీలో కూడా వరుసగా నాలుగు రోజులుగా 40 డిగ్రీలకు తగ్గకుండా ఎండలు మండిపోతున్నాయి.

    పశ్చిమ హిమాలయ ప్రాంతంలో వాయువ్య మైదానాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది.

    ఎండకాలం

    రానున్న రోజుల్లో సాధారణం కంటే ఎక్కువ వేడిగాలులు 

    ఈ నెల ప్రారంభంలోనే వాయువ్య మైదాన, ద్వీపకల్ప ప్రాంతాలు మినహా, ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

    రానున్న రోజుల్లో తూర్పు, వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వేడిగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

    బిహార్‌లోని పాట్నా, బంకా, జాముయి, నవాడా, ఔరంగాబాద్, సుపాల్, అనేక ఇతర జిల్లాల్లో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికతో 'ఆరెంజ్' అలర్ట్ జారీ చేశారు.

    బిహార్‌లోని బెగుసరాయ్, నలంద, గయా, అర్వాల్, భోజ్‌పూర్, రోహ్తాస్, బక్సర్, ఖగారియా, ముంగేర్ ప్రాంతాలలో కూడా 'గ్రీన్' హెచ్చరిక జారీ చేయబడింది.

    వేసవి

    రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గే అవకాశం

    పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 43.7 డిగ్రీల సెల్సియస్, కోల్‌కతాలో గరిష్టంగా 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది.

    హర్యానా, పంజాబ్‌లలో ఉధిక ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగుతాయని ఐఎండీ చెప్పింది. రెండు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదున్నాయి.

    హర్యానాలోని హిసార్‌లో 41.4 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. పంజాబ్‌లోని భటిండాలో గరిష్టంగా 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు ఐఎండీ వెల్లడించింది.

    ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్‌లో కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, చిత్తోర్‌గఢ్‌లో 43.2 డిగ్రీలు, కోటా, బన్స్వారా, ఫలోడి, ధోల్‌పూర్‌లో 42 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వేసవి కాలం
    ఉష్ణోగ్రతలు
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    వేసవి కాలం

    National Strawberry Day 2023: స్ట్రాబెర్రీలతో ఈ రెసిపీలు ట్రై చేస్తే టేస్ట్ అదుర్స్ రెసిపీస్
    ఐఎండీ హెచ్చరిక: ఫిబ్రవరిలోనే దంచికొట్టిన ఎండలు; 1901 తర్వాత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు భారతదేశం
    సమ్మర్ ఫ్యాషన్: వేసవిలో అందంగా మెరిసిపోయేలా చేసే సరికొత్త ఫ్యాషన్ ఫ్యాషన్
    హైదరాబాద్‌ వాసులూ జాగ్రత్త; పెరిగిన పగటి పూట ఉష్ణోగ్రతలు హైదరాబాద్

    ఉష్ణోగ్రతలు

    మార్చిలో భగభగమన్న భూమి; చరిత్రలో రెండోసారి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు తాజా వార్తలు
    తెలంగాణలో పెరిగిన ఎండలు; రాబోయే ఐదు రోజులు పెరగనున్న ఉష్ణోగ్రతలు  తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్‌లోని 116 మండలాల్లో వేడిగాలులు; అమసరమైతే బయటకు రావాలని ఐఎండీ సూచన ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్: మండుతున్న ఎండలు, ఉక్కపోత; 4రోజుల్లోనే అమాంతం పెరిగిన విద్యుత్ వినియోగం ఆంధ్రప్రదేశ్

    తాజా వార్తలు

    సింగరేణిపై వేసవి ఎఫెక్ట్: రోజుకు 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం విద్యుత్
    Explainer: యూపీ మొదటి 'గ్యాంగ్‌స్టర్'; 'అతిక్ అహ్మద్' అరెస్టు, మరణం ఎందుకు సంచలనమయ్యాయి?  ఉత్తర్‌ప్రదేశ్
    మార్చిలోనే గ్యాంగ్‌స్టర్, అతిక్, అష్రఫ్‌ను పోలీసులు చంపేయాలనుకున్నారా?  ఉత్తర్‌ప్రదేశ్
    కాంగ్రెస్‌లో చేరిన జగదీష్ షెట్టర్; బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు  కర్ణాటక

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    రైతులకు గుడ్ న్యూస్; ఈ ఏడాది సాధారణ వర్షాపాతమే: ఐఎండీ అంచనా ఐఎండీ
    ధూలి కారణంగా మరింత క్షీణిస్తున్న  గాలి నాణ్యత దిల్లీ
    ఎన్నికల వేళ రాజకీయాల నుంచి తప్పుకున్న బీజేపీ సీనియర్ నేత  కర్ణాటక
    'నా అధికారాలతో చెలగాటాలొద్దు'; న్యాయవాదిపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అసహనం సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025