NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Robo Hotel Biryani : హోటల్లో డబ్బులతో బిర్యాని తిన్నాడు... ఫ్రీగా కారు గెలిచాడు
    తదుపరి వార్తా కథనం
    Robo Hotel Biryani : హోటల్లో డబ్బులతో బిర్యాని తిన్నాడు... ఫ్రీగా కారు గెలిచాడు
    బిర్యాని తిన్నాడు.. కారును గెలుపొందాడు

    Robo Hotel Biryani : హోటల్లో డబ్బులతో బిర్యాని తిన్నాడు... ఫ్రీగా కారు గెలిచాడు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jan 01, 2024
    12:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ తిరుపతి నగరంలో ఓ వ్యక్తి బిర్యాని తిని ఖరీదైన కారు గెలుపొందాడు. ఈ మేరకు రెండేళ్ల కిందట రోబో డైనర్ పేరుతో ఓ హోటల్‌ ప్రారంభమైంది.

    ఈ క్రమంలోనే రెండో వార్షికోత్సవం సందర్భంగా హోటల్ యజమాని కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఓ స్కీమ్ ప్రవేశపెట్టారు.

    హోటల్‌లో బిర్యానీ తిని, తాము ఇచ్చే కూపన్ నింపాలని, ఫలితంగా డిసెంబరు 31న లక్కీ డ్రా తీస్తామన్నారు.

    లక్కీ డ్రాలో విజేతగా నిలిచిన వ్యక్తికి కారును బహుమతిగా అందజేస్తామని ప్రకటించేశారు. లక్కీడ్రాలో రాహుల్ అనే వ్యక్తి నిస్సాన్ మాగ్నట్ కారును సొంతం చేసుకున్నాడు. ఒకే ఒక్క హైదరాబాద్ దమ్ బిర్యానీ తిని దాదాపు రూ.7 లక్షల విలువైన కారును గెలుపొందడం గమనార్హం.

    details

    23వేలకుపైగా కూపన్లు

    గత సెప్టెంబర్ నెలలో రోబో హోటల్ ప్రవేశపెట్టిన వినూత్న స్కీమ్'లో భాగంగా రోబో హోటల్'లో బిర్యాని తిన్న ప్రతి ఒక్కరికి సంస్థ కూపన్ అందజేసింది. ఈ సందర్భంగా దాదాపుగా 23వేలకుపైగా కూపన్లు వచ్చి చేరాయి.

    కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆదివారం రాత్రి హోటల్ అధినేత భరత్ కుమార్ రెడ్డి,నీలిమ దంపతులు హోటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కూపన్ లక్కీ డ్రా తీశారు.

    దీంతో తిరుపతికి చెందిన రాహుల్ అనే వ్యక్తి పేరు రాగా,హోటల్ అధినేతలు స్వయంగా రాహుల్'కు ఫోన్ చేసి మరీ శుభాకాంక్షలు తెలియజేశారు.

    ఈ నేపథ్యంలోనే ఆయనకు నిస్సాన్ మ్యాగ్నెట్ కారును ఉచితంగా అందజేశారు.నగర వాసులకు హోటల్ చేరువకావాలనే ఈ స్కీం ప్రవేశపెట్టామని ఎండీ భరత్ కుమార్ రెడ్డి అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తిరుపతి

    తాజా

    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ

    తిరుపతి

    ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి
    TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు తెలంగాణ
    ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; టికెట్ ధరలు, ట్రైన్ రూట్ వివరాలు ఇలా ఉన్నాయి! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    రేపు సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; ట్రైన్ రూట్, టికెట్ ధరలను తెలుసుకోండి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025