NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ramesh : దిల్లీ లిక్కర్ స్కాం కంటే 10 రెట్లు పెద్ద కుంభకోణం.. ఏపీలో మద్యం అక్రమాలపై విచారణ జరపాలి : ఎంపీ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Ramesh : దిల్లీ లిక్కర్ స్కాం కంటే 10 రెట్లు పెద్ద కుంభకోణం.. ఏపీలో మద్యం అక్రమాలపై విచారణ జరపాలి : ఎంపీ 
    దిల్లీ లిక్కర్ స్కాం కంటే 10 రెట్లు పెద్ద కుంభకోణం.. ఏపీలో మద్యం అక్రమాలపై విచారణ జరపాలి : ఎంపీ

    Ramesh : దిల్లీ లిక్కర్ స్కాం కంటే 10 రెట్లు పెద్ద కుంభకోణం.. ఏపీలో మద్యం అక్రమాలపై విచారణ జరపాలి : ఎంపీ 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 11, 2025
    04:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లలో జరిగిన మద్యం అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.

    ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కాంపై లోక్‌సభలో విచారణ జరపాలని కోరారు.

    లోక్‌సభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, జగన్ ప్రభుత్వ హయాంలో దిల్లీ లిక్కర్ స్కాంను మించిన భారీ స్కామ్ జరిగినట్లు ఆయన ఆరోపించారు.

    Details

    ఏపీ లిక్కర్ స్కాం - 10 రెట్లు అధికం? 

    లోక్‌సభలో సీఎం రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019-2024 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ పాలసీని పూర్తిగా మార్చారని, ప్రైవేట్ దుకాణాలను తొలగించి, ప్రభుత్వ దుకాణాల ద్వారానే అమ్మకాలు జరిపినట్లు వివరించారు.

    ఐదేళ్లలో లక్ష కోట్లకు పైగా విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని, ఇవన్నీ నగదు రూపంలోనే లావాదేవీ అయినట్లు చెప్పారు.

    అంతేగాక ప్రైవేట్ ఉద్యోగులను నియమించకుండా, కేవలం కాంట్రాక్ట్ పద్ధతిలోనే ఉద్యోగులను నియమించారని, అవి పూర్తి పారదర్శకంగా లేవని ఆరోపించారు.

    రూ.2,500 కోట్ల దిల్లీ లిక్కర్ స్కామ్‌తో పోలిస్తే ఏపీలో జరిగిన కుంభకోణం 10 రెట్లు అధికమని, ఇది జాతీయ స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అంశమని పేర్కొన్నారు.

    Details

     వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కౌంటర్ 

    సీఎం రమేశ్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సీఎం రమేశ్ బీజేపీ కోసం కాదు, తెలుగుదేశం కోసం పని చేస్తున్నారని విమర్శించారు.

    చంద్రబాబు నుంచి కాంట్రాక్టులు పొందేందుకే ఆయన ఇలా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

    సీఎం రమేశ్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా తప్పుడు, నిరాధారమైనవని ఆయన వ్యాఖ్యానించారు. తాను మార్గదర్శి స్కామ్ గురించి మాట్లాడినందుకే ఇప్పుడు ఈ ఆరోపణలు చేస్తున్నారని మిథున్ రెడ్డి ఆరోపించారు.

    మార్గదర్శి స్కామ్ చాలా పెద్ద కుంభకోణమని, దానిపై కూడా సమగ్ర దర్యాప్తు అవసరమని తెలిపారు. ఈ అంశాలపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి!

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అనకాపల్లి
    బీజేపీ

    తాజా

    Pawan Kalyan: రాజధానిపై కుట్రలు చేసిన వారిని విడిచిపెట్టం : పవన్‌ కళ్యాణ్ హెచ్చరిక పవన్ కళ్యాణ్
    ENG vs IND: ఇంగ్లాండ్‌ టూర్‌కు ముందు కీలక మార్పు.. భారత జట్టుకు కొత్త కోచ్ ఇంగ్లండ్
    Tragedy : బెంగళూరులో దారుణం.. సెక్స్‌కి నిరాకరించిందని.. బాలికను హత్య చేసి సూట్‌కేస్‌లో పడేశారు! బెంగళూరు
    Thuglife : దారుణంగా పడిపోయిన థగ్ లైఫ్‌ కలెక్షన్లు.. మూడ్రోజుల్లో ఎంతంటే? కమల్ హాసన్

    అనకాపల్లి

    Dadi Veerabhadra Rao: వైసీపీ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు  ఆంధ్రప్రదేశ్
    Atchutapuram : అచ్యుతాపురం మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం.. కేంద్ర రూ.2లక్షలు అనకాపల్లి

    బీజేపీ

    BJP: జేపీ నడ్డా స్థానంలో ఫిబ్రవరి నెలాఖరులోగా బీజేపీకి కొత్త అధ్యక్షుడు  భారతదేశం
    PM Modi: 'కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తోంది'..అంబేద్కర్ వివాదంపై మోదీ స్పందన నరేంద్ర మోదీ
    Delhi: బంగ్లాదేశ్‌ పిల్లల గుర్తింపుపై MCD సర్క్యులర్‌.. దిల్లీ పాఠశాలలకు కీలక ఆదేశాలు  దిల్లీ
    Purandeshwari: అల్లు అర్జున్ అరెస్టుపై పురందేశ్వరి విమర్శలు.. రాజకీయ కుట్ర అని ఆరోపణలు అల్లు అర్జున్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025