NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / NSAB: జాతీయ భద్రతా సలహా బోర్డులో మార్పులు.. చైర్మన్‌గా రా మాజీ చీఫ్ అలోక్ జోషి 
    తదుపరి వార్తా కథనం
    NSAB: జాతీయ భద్రతా సలహా బోర్డులో మార్పులు.. చైర్మన్‌గా రా మాజీ చీఫ్ అలోక్ జోషి 
    జాతీయ భద్రతా సలహా బోర్డులో మార్పులు.. చైర్మన్‌గా రా మాజీ చీఫ్ అలోక్ జోషి

    NSAB: జాతీయ భద్రతా సలహా బోర్డులో మార్పులు.. చైర్మన్‌గా రా మాజీ చీఫ్ అలోక్ జోషి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 30, 2025
    02:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహా మండలిలో పలు మార్పులను ప్రవేశపెట్టింది.

    ఈ మండలికి కొత్తగా చైర్మన్‌గా రా (R&AW) మాజీ చీఫ్ అలోక్ జోషిని నియమించింది.

    దేశానికి ముఖ్య గూఢచారి సంస్థ అయిన రీసెర్చ్ అండ్ అనలిటికల్ వింగ్‌కు గతంలో నాయకత్వం వహించిన అలోక్ జోషి, ఇప్పుడు రిటైర్డ్ సైనికాధికారులు, పోలీసు సేవల మరియు విదేశాంగ సేవల నుంచి వచ్చిన ఏడుగురు సభ్యులతో కూడిన బోర్డుకు నాయకత్వం వహించనున్నారు.

    వివరాలు 

    CCS అత్యవసర సమావేశంలో నిర్ణయం

    ఈ బోర్డులో ప్రస్తుతం రిటైర్డ్ సైనికాధికారులు అయిన వెస్ట్రన్ ఎయిర్ కమాండ్‌కు మాజీ చీఫ్ ఎయిర్ మార్షల్ పిఎం సిన్హా, సదరన్ ఆర్మీ కమాండ్‌కు మాజీ లెఫ్టినెంట్ జనరల్ ఎకె సింగ్, రియర్ అడ్మిరల్ మాంటీ ఖన్నా భాగస్వాములుగా ఉన్నారు.

    అలాగే ఇండియన్ పోలీస్ సర్వీస్‌కు చెందిన రిటైర్డ్ అధికారులు రాజీవ్ రంజన్ వర్మ, మన్మోహన్ సింగ్, విదేశాంగ సేవ (IFS)కు చెందిన రిటైర్డ్ అధికారి బి వెంకటేష్ వర్మ కూడా ఈ పునఃసంఘటిత బోర్డులో సభ్యులుగా ఉన్నారు.

    ఇటీవలి పహల్గామ్ ఉగ్రదాడికి స్పందనగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన నివాసంలో నిర్వహించిన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCS) అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    కేంద్ర ప్రభుత్వం

    Waqf bill: వక్ఫ్ సవరణ బిల్లుపై రేపు లోక్‌సభలో కీలక నిర్ణయం లోక్‌సభ
    Pakhal Lake : ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటనతో పాకాల భవిష్యత్ ఎలా మారనుంది? తెలంగాణ
    Nirmala Sitharaman: భారీగా పన్ను మినహాయించడానికి కారణమిదే.. నిర్మాలా సీతారామన్ వివరణ నిర్మలా సీతారామన్
    Vizag Railway Zone: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్.. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌, ఉత్తర్వులు జారీ  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025