NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rammohan Naidu: రాజమహేంద్రవరం నుండి దిల్లీకి త్వరలోనే సర్వీసు: రామ్మోహన్‌ నాయుడు
    తదుపరి వార్తా కథనం
    Rammohan Naidu: రాజమహేంద్రవరం నుండి దిల్లీకి త్వరలోనే సర్వీసు: రామ్మోహన్‌ నాయుడు
    రాజమహేంద్రవరం నుండి దిల్లీకి త్వరలోనే సర్వీసు

    Rammohan Naidu: రాజమహేంద్రవరం నుండి దిల్లీకి త్వరలోనే సర్వీసు: రామ్మోహన్‌ నాయుడు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 09, 2024
    10:18 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాజమహేంద్రవరం విమానాశ్రయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు.

    ఆదివారం ఆయన విమానాశ్రయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, విలేకర్లతో మాట్లాడారు.

    2023లో ప్రారంభమైన పెండింగ్ పనులు 2024 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

    రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనంగా మరొక టెర్మినల్ భవనం నిర్మాణం జరుగుతుందని, విమానాశ్రయం అభివృద్ధితో పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని వెల్లడించారు.

    దిల్లీకి సర్వీసు త్వరలో ప్రారంభం అవ్వొచ్చని పేర్కొన్నారు.

    వివరాలు 

    2036 ఒలింపిక్స్‌ బిడ్‌లో భారత్‌ ఉండటం గర్వకారణం 

    అదే రోజు, రాజమహేంద్రవరంలో సౌత్‌జోన్ అంతర్రాష్ట్ర బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ప్రారంభమైంది.

    ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, బ్యాడ్మింటన్ క్రీడకు ఉన్న ఆదరణను గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, 2000లో పుల్లెల గోపిచంద్‌కు హైదరాబాద్‌లో 10 ఎకరాల భూమిని బ్యాడ్మింటన్ అకాడమీకి కేటాయించారని, అమరావతిలో కూడా 15 ఎకరాల భూమి కేటాయించినట్లు గుర్తుచేశారు.

    అయితే, గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో అకాడమీ పనులు సాగలేదన్నారు. 2027-28లో జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, 2036 ఒలింపిక్స్‌కు భారతదేశం బిడ్‌లో ఉండటం దేశం కోసం గర్వకారణమని తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజమహేంద్రవరం
    కింజరాపు రామ్మోహన్ నాయుడు

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    రాజమహేంద్రవరం

    ఐఆర్‌ఆర్‌ కేసులో చంద్రబాబుపై మరో పిటిషన్ దాఖలు ఏపీ సీఐడీ  చంద్రబాబు నాయుడు
    'అధికారులు చేసిన తప్పుకు చంద్రబాబును అరెస్టు చేస్తారా?'.. మాజీ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యలు  చంద్రబాబు నాయుడు
    ఏపీ ప్రభుత్వంపై లోకేష్ సంచలన వ్యాఖ్యలు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు హత్యకు కుట్ర ఆంధ్రప్రదేశ్
    Rajahmundry: రైలులో బిర్యానీ తిని 9 మందికి తీవ్ర అస్వస్థత  వైజాగ్

    కింజరాపు రామ్మోహన్ నాయుడు

    Bharatiya Vayuyan Vidheyak 2024: బ్రిటిష్ కాలం నాటి ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం స్థానంలో కొత్త ఏవియేషన్ బిల్లు  కేంద్ర పౌర విమానయాన శాఖ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025