NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఎమర్జెన్సీ అలెర్ట్‌ : మీ ఫోన్‌కు వచ్చిందా చూసుకోండి.. భయపడొద్దు, కారణమిదే
    తదుపరి వార్తా కథనం
    ఎమర్జెన్సీ అలెర్ట్‌ : మీ ఫోన్‌కు వచ్చిందా చూసుకోండి.. భయపడొద్దు, కారణమిదే
    మీ ఫోన్‌కు వచ్చిందా చూసుకోండి.. భయపడొద్దు, కారణమిదే

    ఎమర్జెన్సీ అలెర్ట్‌ : మీ ఫోన్‌కు వచ్చిందా చూసుకోండి.. భయపడొద్దు, కారణమిదే

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 21, 2023
    03:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎమర్జెన్సీ అలెర్టులు ఫోన్లను హోరెత్తిస్తున్నాయి. భారతదేశంలోని చాలా మంది మొబైల్‌ ఫోన్ యూజర్లకు గురువారం మధ్యాహ్నం ఎమర్జెన్సీ అలెర్ట్‌ మెసేజ్ వచ్చింది.

    తీవ్ర పరిస్థితి(SEVERE SITUATION) అన్న అర్థం వచ్చే రీతిలో ఆ ఫ్లాష్‌ మెసేజ్‌ మొబైళ్లను ముంచెత్తింది. ఈ మేరకు ఆ ఎక్కడి నుంచి వచ్చిందో, దేనికి వచ్చిందో తెలియక వినియోగదారులు బెంబెలిత్తిపోతున్నారు.

    అది ఇదేదో మాల్ వేర్ కావొచ్చని, సైబర్ నేరగాళ్ల పనే అయ్యింటుందని ఇంకొందరు వినియోగదారులు భయాందోళనకు గురయ్యారు.

    ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఓ క్లారిటీ ఇచ్చింది. ఎమర్జెన్సీ అలెర్ట్‌ సిస్టమ్‌ టెస్టింగ్‌లో భాగంగానే ఈ సందేశం పంపించామని పేర్కొంది.

    details

    విపత్తు సమయంలో ప్రజలకు అత్యవసర సందేశం కోసమే ఈ మెసేజ్

    అత్యవసర మేసేజ్ తో కూడిన ఓ ఫ్లాష్‌ మెసేజ్‌ మీ ఫోన్‌కు ఎందుకు పంపారంటే, భూకంపాలు, సునామీలు, ఆకస్మిక వరదలు లాంటి భారీ విపత్తులు తలెత్తినప్పుడు ఇలాంటి సందేశాలతోనే అప్రమత్తం చేస్తారు.

    ప్రజలకు అత్యవసర సందేశాలను పంపేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎమర్జెన్సీ అలెర్ట్ సిస్టమ్ ను రూపొందించింది.

    ఇందులో భాగంగా గురువారం దీన్ని కేంద్రం పరీక్షించింది. అందువల్లే ఉదయం 11.41 గంటల సమయంలో దేశవ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలోని వినియోగదారులకు పెద్ద బీప్ సౌండ్‌తో ఈ ఫ్లాష్‌ వచ్చింది.

    ఇంగ్లీష్‌, హిందీ సహా భారతీయ ప్రాంతీయ భాషల్లో ఈ అలెర్ట్‌ను పంపించారు. సందేశంతో పాటు ఆడియోలోనూ వినబడటంతో యూజర్లు ఆందోళన చెందారు.

    DETAILS

    పాన్ ఇండియా రేంజ్ లో ఎమర్జెన్సీ అలెర్ట్ సిస్టమ్ చెకింగ్

    అఖిల ఇండియా స్థాయిలో(PAN INDIA RANGE) ఎమర్జెన్సీ అలెర్ట్‌ వ్యవస్థను పరీక్షించేందుకే ఈ మెసేజ్‌ పంపించాని అందులో రాసి ఉంది.

    ప్రజలకు, విపరీత పరిస్థితుల్లో ముందస్తు హెచ్చరికలు పంపేందుకు ఈ సాంకేతికత ఉపయోగకరం. ప్రజా భద్రతను మెరుగుపరుస్తుందని సందేశం ద్వారా తెలుస్తోంది.

    ఈ మెసేజ్‌ కింద ఉన్న 'ఓకే' ఆప్షన్‌ క్లిక్‌ చేశాక, మరో మెసేజ్‌ కనిపించింది. ఈ మేరకు మీకు వైర్‌లెస్‌ ఎమర్జెన్సీ సందేశం వచ్చిందని, భవిష్యత్ లో అత్యవసర సందేశాలను పొందేందుకు ఆప్షన్‌ను ఎంచుకోండని రాసి పంపించారు.

    సెల్ టవర్ ఆపరేటర్లు,బ్రాడ్‌కాస్టింగ్‌ సిస్టమ్ ల అత్యవసర ప్రసార సామర్థ్యాలను పరిశీలించేందుకే ఈ ప్రయోగం చేసినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ గతంలోనే స్పష్టం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    భారతదేశం

    సెప్టెంబర్ 8న మోదీ-బైడెన్ ద్వైపాక్షిక సమావేశం: వైట్‌హౌస్ వెల్లడి  నరేంద్ర మోదీ
    భారత్‌లో అంతర్జాతీయ ఈవెంట్.. అక్టోబర్ 12 నుంచి G20 పార్లమెంట్‌ స్పీకర్ల సమావేశం దిల్లీ
    కారణం చెప్పకుండానే.. భారత్‌తో వాణిజ్య చర్చలను నిలివేసిన కెనడా  కెనడా
    Ind vs Pak: నిప్పులు చెరిగిన పాక్ పేసర్లు.. టీమిండియా 266 పరుగులకు ఆలౌట్  ఆసియా కప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025