NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Sanjay Raut: షిండే శకం ముగిసింది.. మళ్లీ సీఎం కాలేరు: సంజయ్ రౌత్
    తదుపరి వార్తా కథనం
    Sanjay Raut: షిండే శకం ముగిసింది.. మళ్లీ సీఎం కాలేరు: సంజయ్ రౌత్
    షిండే శకం ముగిసింది.. మళ్లీ సీఎం కాలేరు: సంజయ్ రౌత్

    Sanjay Raut: షిండే శకం ముగిసింది.. మళ్లీ సీఎం కాలేరు: సంజయ్ రౌత్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 05, 2024
    01:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్రలో పది రోజులుగా కొనసాగిన రాజకీయ ఉత్కంఠకు తెరపడింది.

    కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్‌ ఈరోజు (గురువారం) సాయంత్రం 5:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

    దక్షిణ ముంబయిలోని ఆజాద్ మైదానంలో ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు.

    ఇదే సమయంలో, శివసేన అధినేత ఏక్‌నాథ్ షిండేను మరోసారి ముఖ్యమంత్రిగా నియమించకపోవడంపై ఉద్దవ్ వర్గానికి చెందిన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

    షిండే పాలన శకం ముగిసిందని, ఇక ఆయన మహారాష్ట్రకు సీఎం కావడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

    ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ, బీజేపీ షిండేను ఒక పావులా వాడుకుని ఇప్పుడు పక్కన పెట్టిందని ఆరోపించారు.

    వివరాలు 

    పాలక కూటమిలో చీలిక మొదలైంది: సంజయ్  

    సంజయ్ రౌత్ మాట్లాడుతూ, "షిండే శకం ముగిసింది. ఆయన రెండు సంవత్సరాలు మాత్రమే సీఎంగా ఉన్నారు. ఇప్పుడు ఆయనను పక్కన పెట్టేశారు. ఇక నుంచి షిండే మహారాష్ట్రకు సీఎం కాలేడు. బీజేపీ తన వ్యూహాన్ని ఉపయోగించి తమతో కలసి పనిచేసే పార్టీలను బలహీనపరుస్తోంది, విచ్ఛిన్నం చేస్తోంది" అని అన్నారు.

    షిండే పార్టీని కూడా విచ్ఛిన్నం చేసే అవకాశముందని,బీజేపీ వ్యూహం ఇదేనని రౌత్ మండిపడ్డారు.

    మెజారిటీ ఉన్నప్పటికీ మహాయుతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 15 రోజులు పట్టిందని, ఇది వారి పాలక కూటమిలో ఉన్న లోపాలను వెల్లడిస్తోందని అన్నారు.

    "పాలక కూటమిలో చీలిక మొదలైందని,రేపటి నుంచి ఈ సమస్య మరింత పెద్దదవుతుంది.ప్రజల ఆశయాలకు వ్యతిరేకంగా వారు కలిసి పని చేస్తున్నారు"అని ఆయన విమర్శించారు.

    వివరాలు 

    డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్

    అయితే బుధవారం ముంబయిలో జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు.

    ఇది ఆయన మూడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టడం. కొత్త ప్రభుత్వంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉంటారని ఫడ్నవీస్ ప్రకటించారు.

    ఇందులో ఎన్సీపీ నేత అజిత్ పవార్ తన డిప్యూటీ సీఎంగా కొనసాగుతామని వెల్లడించారు.

    అదేవిధంగా, షిండే కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారనే వార్తలున్నప్పటికీ, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సంజయ్ రౌత్‌

    తాజా

    PM Modi: ఉగ్రవాదులను చావు దెబ్బకొట్టాం.. సైనికుల ధైర్యానికి దేశం గర్విస్తోంది : మోదీ నరేంద్ర మోదీ
    Truecaller: ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్.. స్పామ్ సందేశాలకు చెక్‌! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూట్ రీస్టార్ట్.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం! నరేంద్ర మోదీ

    సంజయ్ రౌత్‌

    Sanjay Raut: 'సామ్నా'లో ప్రధాని మోదీపై 'అభ్యంతరకరమైన' కథనం..సంజయ్ రౌత్‌పై కేసు భారతదేశం
    Sanjay Raut: పరువు నష్టం కేసులో సంజయ్ రౌత్‌కు కోర్టు 15 రోజుల జైలు శిక్ష   ముంబై
    Sanjay raut: ఎన్నికల సంఘం సహాయంతో బీజేపీ ఓటర్ల జాబితా తారుమారు చేస్తోంది..  సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025