NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Maharashtra : ఉద్ధవ్ శివసేనకు షాక్.. 23 సీట్ల డిమాండ్'ను తిరస్కరించిన కాంగ్రెస్
    తదుపరి వార్తా కథనం
    Maharashtra : ఉద్ధవ్ శివసేనకు షాక్.. 23 సీట్ల డిమాండ్'ను తిరస్కరించిన కాంగ్రెస్
    23 సీట్ల డిమాండ్'ను తిరస్కరించిన కాంగ్రెస్

    Maharashtra : ఉద్ధవ్ శివసేనకు షాక్.. 23 సీట్ల డిమాండ్'ను తిరస్కరించిన కాంగ్రెస్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 28, 2023
    03:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మహారాష్ట్రలో పొత్తులపై చర్చలు జరుగుతున్నాయి.

    అయితే తమకు 23 లోక్‌సభ సీట్లు కావాలని పట్టుబట్టిన మిత్రపక్షం శివసేన(యుబిటి) డిమాండ్‌ను కాంగ్రెస్ తిరస్కరించింది.

    లోక్‌సభ ఎన్నికల కోసం మహారాష్ట్ర వికాస్ అఘాడి భాగస్వాములైన శివసేన(యుబిటి), కాంగ్రెస్, ఎన్‌సిపి మధ్య సీట్ల పంపకాలపై చర్చించేందుకు పార్టీల నేతలు సమావేశమయ్యారు.

    గత ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 సీట్లలో 23 సీట్లను శివసేన తన ఖాతాలో వేసుకుంది.అయితే శివసేన రెండుగా విడిపోవడంతో ఏక్‌నాథ్ షిండే వైపే ఎక్కువమంది నేతలు మొగ్గు చూపారు.

    మరోవైపు పార్టీ విభజనతో తగినంత మంది ఎంపీ అభ్యర్థులు కూడా యూబీటీకి లేకపోవడంతో శివసేన ఉద్ధవ్ వర్గం సవాల్ ఎదుర్కొంటుందని కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ అభిప్రాయపడ్డారు.

    DETAILS

    విభేదాలు మానుకోవాలన్న కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్

    శివసేన, శరద్‌పవార్‌ల ఎన్‌సీపీలో చీలికలు ఏర్పడిన తర్వాత, రాష్ట్రంలో పాత పార్టీ ఒక్కటే స్థిరమైన ఓట్‌ బ్యాంకుతో కనిపిస్తోందని కాంగ్రెస్ ప్రతినిధులు సమావేశంలో స్పష్టం చేశారు.

    పార్టీల మధ్య సర్దుబాట్లు అవసరమని మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్ అన్నారు.

    ప్రతి పార్టీ సీట్లలో ఎక్కువ వాటాను కోరుకుంటున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా శివసేన 23 సీట్ల డిమాండ్ పెట్టడం ఎక్కువగా ఉందన్నారు.

    సీట్ల పంపకాల్లో మిత్రపక్ష నాయకులు విభేదాలు మానుకోవాలని సంజయ్ నిరుపమ్ సూచించారు. శివసేన 23 సీట్లు డిమాండు చేయొచ్చు కానీ వాటిని ఏం చేస్తారు, సంక్షోభం తెచ్చిపెట్టిన శివసేన నేతలు వెళ్లిపోయారన్నారు. ఈ క్రమంలోనే శివసేనకు అభ్యర్థుల కొరత సమస్య ఉందన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర
    శివసేన

    తాజా

    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ
    Russia drone attacks: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి: ఒకేసారి 273 డ్రోన్లు ప్రయోగం ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Nandigam Suresh: టీడీపీ కార్యకర్తపై దాడి.. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు వైసీపీ

    మహారాష్ట్ర

    2019-2021 మధ్య 13.13 లక్షల మంది బాలికలు, మహిళలు మిస్సింగ్: కేంద్రం వెల్లడి కేంద్ర ప్రభుత్వం
    రన్నింగ్ ట్రైన్‌లో ఆర్పీఎఫ్ జవాన్ కాల్పులు; నలుగురు మృతి తుపాకీ కాల్పులు
    PM Modi Pune Visit: 'మిస్టర్ క్రైమ్ మినిస్టర్ గో బ్యాక్'.. పుణెలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు  నరేంద్ర మోదీ
    Maharashtra: మహారాష్ట్రలోని థానేలో ఘోర ప్రమాదం; 17మంది కార్మికులు మృతి  తాజా వార్తలు

    శివసేన

    కౌ హగ్ డే ప్రకటన వెనక్కి తీసుకున్న యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా భారతదేశం
    'శివసేన' పార్టీ గుర్తుకోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ ఠాక్రే- రేపు విచారణ సుప్రీంకోర్టు
    శివసేన కేసు: ఈసీ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    మహారాష్ట్ర: సంజయ్ రౌత్‌పై పరువు నష్టం కేసు; హత్యాయత్నం ఆరోపణలపై రాజకీయ దుమారం ఉద్ధవ్ థాకరే
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025