Page Loader
Demolitions: ఇళ్ల కూల్చివేతల చర్యలతో అంతా కలవరపడ్డారు: యూపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం 
యూపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Demolitions: ఇళ్ల కూల్చివేతల చర్యలతో అంతా కలవరపడ్డారు: యూపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 01, 2025
03:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వంపై ఇళ్ల కూల్చివేతల సంబంధించి సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆ తీరు దిగ్భ్రాంతికరమని వ్యాఖ్యానించింది. "బాధితులకు కనీసం ఆశ్రయం పొందే హక్కు కూడా లేదా ?" అంటూ ప్రశ్నించింది . "ఇలాంటి కూల్చివేతలు పూర్తిగా అమానవీయమైనవి, చట్టవిరుద్ధమైనవి. దేశంలో రూల్‌ ఆఫ్‌ లా (Law) అమలులో ఉన్నది. ఈ తరహా కూల్చివేతలు ఒక ఫ్యాషన్‌గా మారకూడదు. బాధితులకు ఆరువారాలలో రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలి," అని సుప్రీంకోర్టు ప్రయాగ్‌రాజ్‌ అభివృద్ధి సంస్థకు ఆదేశించింది.

వివరాలు 

ఈ చర్యలు తప్పుడు సంకేతాలను ప్రసారం చేస్తున్నాయి

ప్రయాగ్‌రాజ్‌లో చట్ట ప్రక్రియను పాటించకుండా, గడిచిన కొన్ని రోజులలో కూల్చివేతలు చేపట్టినందుకు సుప్రీంకోర్టు గతంలోనూ తీవ్రంగా స్పందించింది. "ఈ చర్యలు తప్పుడు సంకేతాలను ప్రసారం చేస్తున్నాయి," అని సుప్రీం అసహనం వ్యక్తం చేసింది. 2023లో పోలీస్‌ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్‌కు చెందిన భూమిగా భావించి,, అక్కడి నివాసాలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుగా కూల్చివేసిందని బాధితులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. వారిలో ఒక న్యాయవాది, ఒక ప్రొఫెసర్‌తో పాటు మరికొందరు బాధితులు ఉన్నారు. అయితే, హైకోర్టులో వేసిన పిటిషన్లను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. ఆ తర్వాత, వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.