NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Karnataka: సిద్ధరామయ్య vs డీకే శివకుమార్..  సీఎం కుర్చీ కోసం భగ్గుమన్న రాజకీయాలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Karnataka: సిద్ధరామయ్య vs డీకే శివకుమార్..  సీఎం కుర్చీ కోసం భగ్గుమన్న రాజకీయాలు
    సిద్ధరామయ్య vs డీకే శివకుమార్.. సీఎం కుర్చీ కోసం భగ్గుమన్న రాజకీయాలు

    Karnataka: సిద్ధరామయ్య vs డీకే శివకుమార్..  సీఎం కుర్చీ కోసం భగ్గుమన్న రాజకీయాలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 03, 2025
    09:55 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి పదవి చుట్టూ తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.

    మరోవైపు కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (కేపీసీసీ) అధ్యక్ష పదవి కోసం కూడా పలువురు నేతలు పోటీ పడుతున్నారు.

    సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ ఏడాది నవంబరుకు రెండున్నరేళ్లు పూర్తియైంది.

    ఈ నేపథ్యంలో ఆయన స్థానాన్ని డీకే శివకుమార్‌కు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి.

    Details

    సిద్ధరామయ్య పదవి మారనుందా?

    విపక్ష నేత ఆర్‌. అశోక్ చేసిన వ్యాఖ్యల ప్రకారం, నవంబరు 15, 16 తేదీల్లో సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి డీకే శివకుమార్‌కు బాధ్యతలు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

    రామనగర జిల్లా చెన్నపట్టణలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే హెచ్‌సీ బాలకృష్ణ కూడా దీనిని సమర్థించారు.

    కర్ణాటకలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో సిద్ధరామయ్యతో సమానంగా డీకే శివకుమార్‌ పాత్ర ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

    డీకే శివకుమార్ కేపీసీసీ అధ్యక్షుడిగా, ఉప ముఖ్యమంత్రిగా రెండు కీలక పదవులు నిర్వహించలేకపోతున్నారని మంత్రులు రాజణ్ణ, సతీష్‌ జార్ఖిహొళి, పరమేశ్వర్‌ ఇప్పటికే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

    రాజణ్ణ ఈ నెల 5న దిల్లీ వెళ్లి శివకుమార్‌పై ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు.

    Details

     ముఖ్యమంత్రి పదవి కోసం వ్యూహాలు 

    డీకే శివకుమార్ పదవి మార్పుకు అధిష్ఠానం నుంచి ఆదేశాలు వచ్చేలా వేచి చూస్తుండగా దళిత ముఖ్యమంత్రి నినాదాన్ని మరో వర్గం తెరపైకి తెచ్చింది.

    పరమేశ్వర్, జార్ఖిహొళి, మహదేవప్ప వంటి నేతలు వరుసగా విందు సమావేశాలు నిర్వహిస్తూ తమ వర్గాన్ని బలోపేతం చేసుకుంటున్నారు. ఒక సమావేశానికి సిద్ధరామయ్య కూడా హాజరయ్యారు.

    అయితే ఉప ముఖ్యమంత్రి వర్గం మాత్రం ఈ కార్యక్రమాల వెనుక సిద్ధరామయ్య ప్రోత్సాహం ఉందని ఆరోపిస్తోంది.

    Details

    బీజేపీలో తీవ్ర అంతర్యుద్ధం

    ఇక కర్ణాటకలో బీజేపీలో కూడా తీవ్ర అంతర్యుద్ధంలో ఉంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ముడా కేసులో చిక్కించి గద్దె దించేందుకు చేసిన ప్రయత్నాలు భాజపాకు ఎదురుదెబ్బగా మారాయి.

    లోకాయుక్త ఇప్పటికే సిద్ధరామయ్యకు క్లీన్‌చిట్ ఇచ్చింది. మరోవైపు బీవై విజయేంద్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తన పదవిని కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

    మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప వర్గాన్ని పార్టీ అధిష్ఠానానికి దూరం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని మాజీ మంత్రి ఎంపీ రేణుకాచార్య ఆరోపించారు.

    బీజేపీలో యత్నాళ్, రమేశ్‌ జార్ఖిహొళి, శ్రీరాములు తదితరులు రాష్ట్ర అధ్యక్షుడి పదవిని తాము చేపట్టాలని భావిస్తున్నారు.

    అయితే కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి, మాజీ మంత్రి డీవీ సదానందగౌడ మాత్రం విజయేంద్ర నాయకత్వాన్ని విఫలమైందిగా అభివర్ణించారు.

    Details

     జనతాదళ్‌లో కొత్త అధ్యాయం.. నిఖిల్‌పై ఆశలు 

    జనతాదళ్ (ఎస్) అధ్యక్షుడిగా నిఖిల్‌ కుమారస్వామికి బాధ్యతలు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

    అయితే నిఖిల్‌ ఇప్పుడే ఈ బాధ్యతలు చేపట్టలేనని స్పష్టం చేశారు.

    నిఖిల్‌కు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు, కుమారస్వామికి జాతీయ అధ్యక్ష పదవి అప్పగించాలని భావిస్తున్నారు.

    దళపతి దేవేగౌడ త్వరలో ఏకవాక్య తీర్మానం చేయనున్నారు. ఇక రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుపై దిల్లీ అధిష్ఠానం నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక
    కాంగ్రెస్
    బీజేపీ

    తాజా

    Sharmishta Panoli: 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని అరెస్ట్‌.. విడుదల చేయాలంటూ ప్రధాని మోదీని కోరిన డచ్ ఎంపీ ఆపరేషన్‌ సిందూర్‌
    Upcoming IPOs: స్టాక్ మార్కెట్లో లిస్టింగ్‌ల జోరు.. ఒకే ఒక్క కంపెనీకి సబ్‌స్క్రిప్షన్ అవకాశం స్టాక్ మార్కెట్
    NIA: పాక్‌ గూఢచర్య నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం.. దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు ఎన్ఐఏ
    Commercial LPG: ఏప్రిల్, మే తర్వాత మరోసారి తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర గ్యాస్

    కర్ణాటక

    Karnataka: కర్ణాటకలో గణపతి ఊరేగింపుపై రాళ్లదాడి.. రెండు వర్గాల మధ్య ఘర్షణ పోలీస్
    Karnataka: భద్రతా వైఫల్యం.. సీఎం సిద్ధరామయ్య వైపు దూసుకొచ్చిన యువకుడు సిద్ధరామయ్య
    Supreme Court: హైకోర్టు మహిళ న్యాయమూర్తిపై జడ్జి వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం  సుప్రీంకోర్టు
    Karnataka Muda scam: ముడా స్కామ్‌ కేసులో సిద్ధరామయ్యకు షాక్‌.. గవర్నర్‌ నిర్ణయాన్ని సమర్ధించిన హైకోర్టు  సిద్ధరామయ్య

    కాంగ్రెస్

    Prajwal Shetty: కాంగ్రెస్ నేత కొడుకు ర్యాష్ డ్రైవింగ్.. ఒకరు దుర్మరణం కర్ణాటక
    Assembly Polls: ఎగ్జిట్ పోల్స్ డిబేట్‌లకు కాంగ్రెస్ దూరం మహారాష్ట్ర
    congress: అమెరికాలో అదానీపై కేసు.. సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుచేయాలని కాంగ్రెస్ డిమాండ్ అదానీ గ్రూప్
    Priyanka Gandhi : ప్రియాంక గాంధీ రాజకీయ పయనం.. నానమ్మ ఆశయాలతో పార్లమెంట్‌కి..! ప్రియాంక గాంధీ

    బీజేపీ

    Narendra Modi: దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు 'నో ఎంట్రీ'.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు  నరేంద్ర మోదీ
    Haryana: హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో చేరిన ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు హర్యానా
    Naib Singh Saini: అక్టోబరు 17న హర్యానా సీఎంగా నాయబ్‌సింగ్‌ సైనీ ప్రమాణస్వీకారం హర్యానా
    Haryana: హర్యానాలో బీజేపీ శాసనసభాపక్షానికి నాయబ్ సింగ్ సైనీ నాయకత్వం.. ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణస్వీకారం  హర్యానా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025