Karnataka: సిద్ధరామయ్య vs డీకే శివకుమార్.. సీఎం కుర్చీ కోసం భగ్గుమన్న రాజకీయాలు
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి పదవి చుట్టూ తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.
మరోవైపు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్ష పదవి కోసం కూడా పలువురు నేతలు పోటీ పడుతున్నారు.
సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ ఏడాది నవంబరుకు రెండున్నరేళ్లు పూర్తియైంది.
ఈ నేపథ్యంలో ఆయన స్థానాన్ని డీకే శివకుమార్కు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి.
Details
సిద్ధరామయ్య పదవి మారనుందా?
విపక్ష నేత ఆర్. అశోక్ చేసిన వ్యాఖ్యల ప్రకారం, నవంబరు 15, 16 తేదీల్లో సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి డీకే శివకుమార్కు బాధ్యతలు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
రామనగర జిల్లా చెన్నపట్టణలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే హెచ్సీ బాలకృష్ణ కూడా దీనిని సమర్థించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడంలో సిద్ధరామయ్యతో సమానంగా డీకే శివకుమార్ పాత్ర ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
డీకే శివకుమార్ కేపీసీసీ అధ్యక్షుడిగా, ఉప ముఖ్యమంత్రిగా రెండు కీలక పదవులు నిర్వహించలేకపోతున్నారని మంత్రులు రాజణ్ణ, సతీష్ జార్ఖిహొళి, పరమేశ్వర్ ఇప్పటికే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
రాజణ్ణ ఈ నెల 5న దిల్లీ వెళ్లి శివకుమార్పై ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు.
Details
ముఖ్యమంత్రి పదవి కోసం వ్యూహాలు
డీకే శివకుమార్ పదవి మార్పుకు అధిష్ఠానం నుంచి ఆదేశాలు వచ్చేలా వేచి చూస్తుండగా దళిత ముఖ్యమంత్రి నినాదాన్ని మరో వర్గం తెరపైకి తెచ్చింది.
పరమేశ్వర్, జార్ఖిహొళి, మహదేవప్ప వంటి నేతలు వరుసగా విందు సమావేశాలు నిర్వహిస్తూ తమ వర్గాన్ని బలోపేతం చేసుకుంటున్నారు. ఒక సమావేశానికి సిద్ధరామయ్య కూడా హాజరయ్యారు.
అయితే ఉప ముఖ్యమంత్రి వర్గం మాత్రం ఈ కార్యక్రమాల వెనుక సిద్ధరామయ్య ప్రోత్సాహం ఉందని ఆరోపిస్తోంది.
Details
బీజేపీలో తీవ్ర అంతర్యుద్ధం
ఇక కర్ణాటకలో బీజేపీలో కూడా తీవ్ర అంతర్యుద్ధంలో ఉంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ముడా కేసులో చిక్కించి గద్దె దించేందుకు చేసిన ప్రయత్నాలు భాజపాకు ఎదురుదెబ్బగా మారాయి.
లోకాయుక్త ఇప్పటికే సిద్ధరామయ్యకు క్లీన్చిట్ ఇచ్చింది. మరోవైపు బీవై విజయేంద్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తన పదవిని కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప వర్గాన్ని పార్టీ అధిష్ఠానానికి దూరం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని మాజీ మంత్రి ఎంపీ రేణుకాచార్య ఆరోపించారు.
బీజేపీలో యత్నాళ్, రమేశ్ జార్ఖిహొళి, శ్రీరాములు తదితరులు రాష్ట్ర అధ్యక్షుడి పదవిని తాము చేపట్టాలని భావిస్తున్నారు.
అయితే కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, మాజీ మంత్రి డీవీ సదానందగౌడ మాత్రం విజయేంద్ర నాయకత్వాన్ని విఫలమైందిగా అభివర్ణించారు.
Details
జనతాదళ్లో కొత్త అధ్యాయం.. నిఖిల్పై ఆశలు
జనతాదళ్ (ఎస్) అధ్యక్షుడిగా నిఖిల్ కుమారస్వామికి బాధ్యతలు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అయితే నిఖిల్ ఇప్పుడే ఈ బాధ్యతలు చేపట్టలేనని స్పష్టం చేశారు.
నిఖిల్కు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు, కుమారస్వామికి జాతీయ అధ్యక్ష పదవి అప్పగించాలని భావిస్తున్నారు.
దళపతి దేవేగౌడ త్వరలో ఏకవాక్య తీర్మానం చేయనున్నారు. ఇక రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుపై దిల్లీ అధిష్ఠానం నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి.