NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / LRS: వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ ద్వారా ఎల్‌ఆర్‌ఎస్‌ సమస్యకు పరిష్కారం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    LRS: వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ ద్వారా ఎల్‌ఆర్‌ఎస్‌ సమస్యకు పరిష్కారం
    వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ ద్వారా ఎల్‌ఆర్‌ఎస్‌ సమస్యకు పరిష్కారం

    LRS: వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ ద్వారా ఎల్‌ఆర్‌ఎస్‌ సమస్యకు పరిష్కారం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 13, 2025
    09:10 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అనధికార లేఔట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు తీసుకొచ్చిన లేఔట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) అమలును మరింత పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

    రిజిస్ట్రార్లు, మున్సిపల్‌ అధికారులు కుమ్మక్కై పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తుండటంపై ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేయించింది.

    ఈ నేపథ్యంలో మొత్తం పెండింగ్‌ దరఖాస్తులను ఒకేసారి పరిష్కరించేందుకు వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

    Details

    25శాతం రాయితీ

    ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రెవెన్యూ, పురపాలక, రిజిస్ట్రేషన్ల శాఖల ముఖ్య కార్యదర్శులు నవీన్‌మిత్తల్, దానకిశోర్, జ్యోతి బుద్ధప్రకాశ్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి, డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ ప్లానింగ్‌ దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

    2020లో ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్న మొత్తం నుంచి 25శాతం రాయితీ కల్పించి ఓటీఎస్‌ విధానం అమలు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    అయితే ఎఫ్‌టిఎల్‌ పరిధిలో ఉన్న లేఔట్లను మినహాయించి మిగిలిన వాటికి మాత్రమే ఓటీఎస్‌ వర్తించనుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనున్నారు.

    Details

    పెండింగ్‌ దరఖాస్తులు, అక్రమ రిజిస్ట్రేషన్ల సమస్య 

    2020 ఆగస్టులో ఎల్‌ఆర్‌ఎస్‌ అమలు ప్రారంభించినప్పటి నుండి దాని అమలుపై అనేక చర్చలు జరిగాయి. అప్పట్లో 25 లక్షల దరఖాస్తులు అందగా, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కూడా కొన్ని దరఖాస్తులు సమర్పించారు.

    ప్రస్తుతం 7-8 లక్షల దరఖాస్తులు మినహా మిగిలినవన్నీ పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

    అయితే కొన్ని ప్రాంతాల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తులు పరిష్కారం కాకముందే అక్రమ లేఔట్లు వేశారని, వాటిని అధికారులు అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారని గుర్తించారు.

    మరికొన్ని చోట్ల మున్సిపల్‌ అధికారులు అక్రమ లేఔట్లకు ఇంటి నంబర్లు మంజూరు చేసి రిజిస్ట్రేషన్‌కు సహకరించారని ఆరోపణలు ఉన్నాయి.

    Details

    అక్రమ రిజిస్ట్రేషన్లపై కఠిన చర్యలు 

    అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబంధించి 2020 నుంచి 132 మంది రిజిస్ట్రార్లు సస్పెండ్‌ అయ్యారు. అందులో 92 మంది ఎల్‌ఆర్‌ఎస్‌. అక్రమాలకు సంబంధించినవారే కావడం గమనార్హం.

    అనధికార లేఔట్లలో రిజిస్ట్రేషన్‌ సాధ్యమయ్యేలా కొందరు అధికారులను బెదిరించి సెలవుపై వెళ్లేలా చేసి, క్లర్క్‌లను ఇన్‌ఛార్జ్‌గా పెట్టి అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకున్న ఘటనలు కూడా జరిగినట్లు గుర్తించారు.

    ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా తగినంత ఆదాయం రాకపోగా, అక్రమ రిజిస్ట్రేషన్ల కారణంగా ప్రభుత్వం నష్టపోయిందని నిర్ధారణకు రావడంతోనే ఓటీఎస్‌ విధానాన్ని తీసుకువచ్చినట్లు సమాచారం.

    ఈ విధానం ద్వారా పెండింగ్‌ దరఖాస్తులను పరిష్కరించడం మాత్రమే కాకుండా అక్రమ రిజిస్ట్రేషన్లను పూర్తిగా అరికట్టే చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రేవంత్ రెడ్డి
    తెలంగాణ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    రేవంత్ రెడ్డి

    Revanth Reddy: 'మైలురాయిగా నిలుస్తుంది'.. కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత తెలంగాణ
    Revanth Reddy: ధాన్యం ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవాల్సిన అవసరం లేదు.. రైతులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా తెలంగాణ
    Revanth Reddy: నేడు సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి భారతదేశం
    CM Revanth: అదానీ ఇచ్చిన రూ.100 కోట్లు వెనక్కి ఇచ్చేస్తున్నాం : రేవంత్‌రెడ్డి భారతదేశం

    తెలంగాణ

    KCR: కేసీఆర్ కుటుంబంలో విషాద ఛాయలు.. సోదరి సకలమ్మ మృతి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    Telangana: 'ప్రత్యేక' పాలనలోకి.. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లు  భారతదేశం
    Inter Syllabus: ఇంటర్ కెమిస్ట్రీలో 30 శాతం సిలబస్ తగ్గింపు.. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే దిశగా చర్యలు భారతదేశం
    Hussain Sagar: హుస్సేన్ సాగర్ అగ్ని ప్రమాదంలో యువకుడు మిస్సింగ్.. కుటుంబ సభ్యుల ఆందోళన భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025