NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Rains: గాలివాన బీభత్సం.. ఏడుగురు మృతి.. వందల ఎకరాల పంట నష్టం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    AP Rains: గాలివాన బీభత్సం.. ఏడుగురు మృతి.. వందల ఎకరాల పంట నష్టం
    గాలివాన బీభత్సం.. ఏడుగురు మృతి.. వందల ఎకరాల పంట నష్టం

    AP Rains: గాలివాన బీభత్సం.. ఏడుగురు మృతి.. వందల ఎకరాల పంట నష్టం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 05, 2025
    09:33 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆదివారం తెల్లవారక ముందు నుంచే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాతావరణం బీభత్సంగా మారింది.

    ఉరుములు, మెరుపులతో వాన ప్రారంభమై గంటకు 60-80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు విజృంభించాయి. దీంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.

    భారీ గాలుల తాకిడికి వృక్షాలు విరిగిపడ్డాయి. విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. వ్యవసాయ, ఉద్యాన పంటలు భారీగా దెబ్బతిన్నాయి. దాదాపు 50వేల ఎకరాల్లో వరి పంట నష్టపోయినట్లు అంచనా. కోతకు వచ్చిన వరి నేలకూలింది, ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది.

    ఈదురుగాలుల ధాటికి అరటి, బొప్పాయి తోటలు నేలమట్టమయ్యాయి. మొక్కజొన్న పంటలు నీట మునిగాయి.

    పిడుగుపాట్లు కూడా ప్రాణనష్టాన్ని కలిగించాయి. ఏడుగురు వ్యక్తులు పిడుగుతో మరణించగా, చెట్టు పడటంతో మరొకరు ప్రాణాలు కోల్పోయారు.

    Details

    అధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు 

    ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య కాజులూరు (కాకినాడ)లో 100 మి.మీ. వర్షపాతం నమోదైంది.

    తాళ్లరేవు మండలం చొల్లంగిపేటలో 94.5 మి.మీ., కరపలో 75.5, కాకినాడలో 66.75, అమలాపురంలో 65.5, పైడిమెట్టలో 65.5, నిడమర్రులో 65.25, ధర్మాజిగూడెంలో 64.75 మి.మీ. వర్షం కురిసింది.

    చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షాలు, గాలుల ప్రభావం తీవ్రమైంది.

    విజయవాడ నగరంలో భారీ ప్రభావం

    పండిట్ నెహ్రూ బస్టాండ్‌ వద్ద రైల్వే లోబ్రిడ్జి కింద వర్షపు నీరు చేరింది.పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచింది. చిట్టినగర్, మొగల్రాజపురం, పటమటలో నీరు పేరుకుంది.

    పెనమలూరు, ఉయ్యూరులో విద్యుత్తు తీగలు తెగిపోయాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాఠశాల కప్పు ఎగిరిపోయింది.

    Details

    తిరుపతి, చిత్తూరు, బాపట్ల జిల్లాల్లో విపరీత పరిస్థితి

    తిరుపతి జిల్లాలో విద్యుత్తు సరఫరా నిలిపేశారు. చెట్లు కూలి వాహనాలకు నష్టం జరిగింది. మధురానగర్‌లో డ్రైనేజీలు పొంగాయి. చిత్తూరులో భారీ వర్షం కురిసింది.

    బాపట్ల జిల్లాలోని నిజాంపట్నం, చీరాల, రేపల్లె, చినగంజాంలో వాన, గాలులు ఉధృతంగా ఉన్నాయి. పశ్చిమగోదావరిలో వందల విద్యుత్తు స్తంభాలు పడిపోయాయి.

    వరి రైతులకు తీరని నష్టం

    ధాన్యం రైతులకు ఇది కన్నీటి దృశ్యంగా మారింది. తూర్పుగోదావరి జిల్లాలో 95 వేల టన్నుల ధాన్యం తడిసినట్లు అధికారులు చెప్పారు.

    సమయానికి ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల ఈ నష్టం అధికమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో అరటి, బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి.

    మొక్కజొన్న రైతులకు నష్టం జరిగితే, విజయనగరం,పార్వతీపురం మన్యంలో అరటి తోటలు భారీగా నష్టపోయాయి.

    Details

    ప్రభుత్వ స్పందన 

    హోంమంత్రి తానేటి వనిత అధికారులను అప్రమత్తం చేశారు.

    లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, తాగునీరు, విద్యుత్‌ సరఫరాలో ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

    మామిడి రైతులు, ఇతర పంటల రైతులకు జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    భారీ వర్షాలు

    తాజా

    Motivation : ప్రయత్నం నీదైతే… గెలుపు కూడా నీదే! జీవితం
    Kiran Abbavaram: తండ్రైన మరో నటుడు .. మగబిడ్డకు జన్మనిచ్చిన రహస్య .. ఫొటో షేర్‌ చేసిన నటుడు కిరణ్ అబ్బవరం
    Bitcoin: దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. 1,11,000 డాలర్లకు బిట్‌కాయిన్‌ క్రిప్టో కరెన్సీ
    GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం ఐపీఎల్

    ఆంధ్రప్రదేశ్

    Andhra Pradesh: TCSకు 21.6 ఎకరాల భూమి కేటాయించిన ఎపి ప్రభుత్వం  టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్
    Election Commission: ఏపీలో రాజ్యసభ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల.. మే 9న పోలింగ్! ఎన్నికల సంఘం
    Andhra Pradesh: పెట్రోల్‌ బంకుల ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు అమరావతి
    Inflation: తెలుగు రాష్ట్రాలకు ఊరట.. మార్చిలో అతి తక్కువ ద్రవ్యోల్బణం! ద్రవ్యోల్బణం

    భారీ వర్షాలు

    Bengaluru Rains: బెంగళూరులో భారీ వర్షాలు..సిటీకి ఆరెంజ్ అలర్ట్ జారీ- స్కూళ్లు బంద్..!!  బెంగళూరు
    Chennai Rains: చెన్నైలో రెండ్రోజులుగా కుండపోత వర్షాలు.. 300 ప్రాంతాలు జలమయం చెన్నై
    Bengaluru Rains: బెంగళూరులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు.. ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్ హోమ్  బెంగళూరు
    Weather Updates: తెలంగాణకు భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు ఐఎండీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025