NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Supreme Court : ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీం ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు 
    తదుపరి వార్తా కథనం
    Supreme Court : ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీం ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు 
    Supreme Court : ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీం ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు

    Supreme Court : ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీం ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 02, 2023
    01:14 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలోని రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్‌ స్కీమ్‌ చెల్లుబాటు పిటిషన్ పై సుప్రీం సంచలన వ్యాఖ్యలు చేసింది.

    ఈ మేరకు దాఖలైన పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌ను 2018 జనవరి 2న కేంద్రం నోటిఫై చేసింది.

    ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.

    ప్రభుత్వం, దాతల మధ్య క్విడ్ ప్రోకోకు అవకాశం కల్పిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.

    అయితే కేంద్రం అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలని భావిస్తే విరాళాలన్నీ ఎన్నికల సంఘానికి ఇవ్వాలని ధర్మాసనం సూచించింది.ఈ మేరకు ఆయా విరాళాలను ఈసీ పార్టీలకు సమానంగా పంచుతుందని పేర్కొంది.

    details

    విరాళాల వివరాలు ప్రజలకు అందుబాటులో లేవు : సుప్రీం

    ఇదే సమయంలో ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ వివరాలు అందరికీ అందుబాటులో లేకపోవడంపై సుప్రీం ప్రశ్నించింది.

    బాండ్ల ద్వారా దాతలు అందించే విరాళాల వివరాలు ప్రజలకు అందుబాటులో లేవని అసంతృప్తి వ్యక్తం చేసింది.

    వీటిని జారీ చేసే అధీకృత బ్యాంక్ భారతీయ స్టేట్ బ్యాంక్, దర్యాప్తు సంస్థలు మాత్రమే విరాళాల వివరాలు పొందే వీలుందని కోర్టు వెల్లడించింది.

    రాజకీయ పార్టీలకు డబ్బులు అందించడం ద్వారా ఇది ముడుపులకు చట్ట బద్ధత కల్పిస్తుందని స్పష్టం చేసింది.

    ఒకవేళ ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలని భావిస్తే విరాళాలన్నీ ఎన్నికల సంఘానికి ఇవ్వాలని సూచించింది. వాటిని ఈసీ రాజకీయ పార్టీలకు సమానంగా పంచుతుందని తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు

    తాజా

    Pakistan: ఆపరేషన్‌ సిందూర్‌ వేళ 50 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు కుట్ర.. తిప్పికొట్టిన బీఎస్‌ఎఫ్‌  బీఎస్‌ఎఫ్‌
    IPL 2025: నిబంధనను అతిక్రమించిన ముంబయి ఇండియన్స్‌.. పెనాల్టీగా నోబాల్‌! ముంబయి ఇండియన్స్
    Delhi Police: భారత్'లో మరో ఉగ్ర దాడికి ఐఎస్‌ఐ కుట్ర ..స్లీపర్ సెల్ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థలు  ఐఎస్‌ఐ
    Trump - Ramaphosa Meeting: సౌత్ ఆఫ్రికాలో శ్వేత జాతీయులపై దాడి ఆరోపణలు.. తిప్పికొట్టిన సిరిల్ రామఫోసా డొనాల్డ్ ట్రంప్

    సుప్రీంకోర్టు

    మతమార్పిడిలపై సుప్రీంలో పిల్.. పిటిషనర్ పై ప్రశ్నల వర్షం కురిపించిన సర్వోన్నత న్యాయస్థానం భారతదేశం
    Ban on firecrackers: ఢిల్లీ ప్రభుత్వ ఉత్తర్వులపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన  సుప్రీంకోర్టు   భారతదేశం
    దిల్లీ లిక్కర్ పాలసీ: మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ వాయిదా  మనీష్ సిసోడియా
    దిల్లీ లిక్కర్ స్కామ్.. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట  కల్వకుంట్ల కవిత
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025