NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / HCU: కంచ గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    HCU: కంచ గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ 
    కంచ గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ

    HCU: కంచ గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 03, 2025
    04:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కంచ గచ్చిబౌలిలోని భూవివాదంపై తెలంగాణ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీంకోర్టు (Supreme Court), కీలక ఆదేశాలు జారీ చేసింది.

    తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

    ఈ కేసు గురువారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం, తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ మధ్యంతర నివేదికను కోర్టుకు సమర్పించారు.

    ఈ నివేదికను పరిశీలించిన జస్టిస్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం, "ప్రభుత్వం చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటుంది?" అని ప్రశ్నించింది. ఈ వ్యవహారం అత్యంత తీవ్రమైనదని పేర్కొంది. వార్తా కథనాలను అమికస్‌ క్యూరీ కోర్టు ముందు ప్రస్తావించారు.

    వివరాలు 

    తదుపరి విచారణ ఈ నెల 16కి వాయిదా

    ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని (CS) ప్రతివాదిగా చేర్చింది.

    "అత్యవసరంగా ఈ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఏమిటి?" అని ప్రశ్నించింది. ఈ భూమి అటవీ భూమి కాకపోయినా, చెట్లు తొలగించే ముందు కేంద్ర పర్యావరణ సంఘం (CEC) అనుమతి తీసుకున్నారా?" అని నిలదీసింది. ఒక్క రోజులో 100 ఎకరాల్లో చెట్లు నరికివేయడం సాధారణ విషయం కాదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించిన సుప్రీం కోర్టు, సమాధానం ఇవ్వాలని కోరింది. అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించిన కోర్టు, తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది.

    వివరాలు 

    ఇది అటవీ భూమి కాదని ఆధారాలు లేవు

    ఇవాళ ఉదయం కూడా ఈ కేసుపై విచారణ జరిగింది. మధ్యాహ్నం 3.30 గంటలలోగా నివేదిక అందించాలని సుప్రీం ఆదేశించింది.

    30 సంవత్సరాలుగా ఈ భూమి వివాదంలో ఉందని ప్రభుత్వ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

    "ఇది అటవీ భూమి కాదని ఆధారాలు లేవు" అని కోర్టులో వాదించారు. అయితే, ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం, "ప్రభుత్వ చర్యలను నిలిపివేయాలి" అంటూ మరోసారి ఆదేశాలు జారీ చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు

    తాజా

    Operation Sindoor: మే 7 తర్వాత.. సరిహద్దు రాష్ట్రాల నుంచి పాక్‌కు చాటింగ్‌లు.. ఈమెయిల్స్‌పై నిఘా..!  ఆపరేషన్‌ సిందూర్‌
    MS Dhoni: స్ట్రైక్‌రేట్ పై కాదు, స్థిరతపై దృష్టి పెట్టండి : ఎంఎస్ ధోని ఎంఎస్ ధోని
    Bengaluru: SBIలో కన్నడ భాషా వివాదం.. స్పందించిన సీఎం సిద్ధరామయ్య  సిద్ధరామయ్య
    Ferrari 12 Cilindri: పవర్‌ఫుల్ ఫెరారీ వచ్చేసింది.. 'సిలిండ్రీ' బుకింగ్స్ స్టార్ట్! ఫెరారీ

    సుప్రీంకోర్టు

    Godra Case: ఫిబ్రవరి 13న గోద్రా కేసు విచారణ.. సుప్రీంకోర్టు నిర్ణయం  భారతదేశం
    Kolkata Murder Case: నా కొడుకు తప్పు చేశాడు.. అతడికి జీవించే హక్కు లేదు : ఆర్జీకర్ కేసు దోషి తల్లి కోల్‌కతా
    Rahul Gandhi: సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్.. రాహుల్ గాంధీ
    Supreme Court: నేడు సుప్రీంకోర్టులో సంజయ్‌ రాయ్‌ జీవితఖైదుపై విచారణ  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025