Page Loader
Uttarakhand Forest Fires : ఉత్తరాఖండ్ అడవుల్లో అగ్నిప్రమాదంపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు సీరియస్ 
ఉత్తరాఖండ్ అడవుల్లో అగ్నిప్రమాదంపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు సీరియస్

Uttarakhand Forest Fires : ఉత్తరాఖండ్ అడవుల్లో అగ్నిప్రమాదంపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు సీరియస్ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 15, 2024
03:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరాఖండ్ అడవుల్లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ఎన్నికల విధుల్లో అటవీ అగ్నిమాపక సిబ్బందిని ఎందుకు నియమించారని ప్రశ్నించింది. అగ్నిప్రమాదం మధ్య అటవీ అగ్నిమాపక దళ సిబ్బందిని ఎన్నికల విధుల్లో ఎందుకు పెట్టారని ప్రభుత్వం తరఫు న్యాయస్థానం ప్రశ్నించింది. అలాగే నిధులు కేటాయించని కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడింది. గత ఏడాది నవంబర్‌ నుంచి ఉత్తరాఖండ్‌ అడవుల్లో మంటలు చెలరేగుతున్నాయి. మంటలు విస్తరిస్తుండటంతో 1,437 హెక్టార్లకుపైగా పచ్చని చెట్లు కాలిపోయాయి. అటవీ ప్రాంతం దగ్ధంతో లక్షల్లో నష్టం వాటిల్లింది. కాగా, ఉత్తరాఖండ్‌లో అగ్నిప్రమాదంపై పిటిషన్లు దాఖలయ్యాయి.

Details 

40 శాతంపైగా అడవులు అగ్నికి ఆహుతి 

జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా న్యాయవాది పరమేశ్వర ఈరోజు మాట్లాడుతూ, 40 శాతంపైగా అడవులు అగ్నికి ఆహుతైనట్లు న్యాయవాది పరమేశ్వర్‌ కోర్టుకు తెలిపారు. మంటలను నియంత్రించలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ మంటలను ఎదుర్కోవడానికి కేంద్రం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు రాలేదని న్యాయవాది వాదించారు. మంటల నియంత్రణకు 9,000 మందికిపైగా పని చేస్తున్నారని అన్నారు. కేంద్రం, రాష్ట్రానికి చెందిన ఆరుగురు సభ్యుల కమిటీ పర్యవేక్షిస్తున్నదని, 420 కేసులు నమోదయ్యాయని వివరించారు.