NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Uttarakhand Forest Fires : ఉత్తరాఖండ్ అడవుల్లో అగ్నిప్రమాదంపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు సీరియస్ 
    తదుపరి వార్తా కథనం
    Uttarakhand Forest Fires : ఉత్తరాఖండ్ అడవుల్లో అగ్నిప్రమాదంపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు సీరియస్ 
    ఉత్తరాఖండ్ అడవుల్లో అగ్నిప్రమాదంపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు సీరియస్

    Uttarakhand Forest Fires : ఉత్తరాఖండ్ అడవుల్లో అగ్నిప్రమాదంపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు సీరియస్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 15, 2024
    03:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తరాఖండ్ అడవుల్లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.

    ఎన్నికల విధుల్లో అటవీ అగ్నిమాపక సిబ్బందిని ఎందుకు నియమించారని ప్రశ్నించింది.

    అగ్నిప్రమాదం మధ్య అటవీ అగ్నిమాపక దళ సిబ్బందిని ఎన్నికల విధుల్లో ఎందుకు పెట్టారని ప్రభుత్వం తరఫు న్యాయస్థానం ప్రశ్నించింది.

    అలాగే నిధులు కేటాయించని కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడింది. గత ఏడాది నవంబర్‌ నుంచి ఉత్తరాఖండ్‌ అడవుల్లో మంటలు చెలరేగుతున్నాయి.

    మంటలు విస్తరిస్తుండటంతో 1,437 హెక్టార్లకుపైగా పచ్చని చెట్లు కాలిపోయాయి.

    అటవీ ప్రాంతం దగ్ధంతో లక్షల్లో నష్టం వాటిల్లింది. కాగా, ఉత్తరాఖండ్‌లో అగ్నిప్రమాదంపై పిటిషన్లు దాఖలయ్యాయి.

    Details 

    40 శాతంపైగా అడవులు అగ్నికి ఆహుతి 

    జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.

    విచారణ సందర్భంగా న్యాయవాది పరమేశ్వర ఈరోజు మాట్లాడుతూ, 40 శాతంపైగా అడవులు అగ్నికి ఆహుతైనట్లు న్యాయవాది పరమేశ్వర్‌ కోర్టుకు తెలిపారు.

    మంటలను నియంత్రించలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ మంటలను ఎదుర్కోవడానికి కేంద్రం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు రాలేదని న్యాయవాది వాదించారు.

    మంటల నియంత్రణకు 9,000 మందికిపైగా పని చేస్తున్నారని అన్నారు.

    కేంద్రం, రాష్ట్రానికి చెందిన ఆరుగురు సభ్యుల కమిటీ పర్యవేక్షిస్తున్నదని, 420 కేసులు నమోదయ్యాయని వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తరాఖండ్
    సుప్రీంకోర్టు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ఉత్తరాఖండ్

    Earthquake: దిల్లీ-ఎన్‌సీఆర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రత నమోదు  దిల్లీ
    Earthquake: ఉత్తరాఖండ్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4తీవ్రత నమోదు  భూకంపం
    Harish Rawat: కారు ప్రమాదం.. మాజీ సీఎం హరీష్‌ రావత్‌‌‌కు గాయాలు  రోడ్డు ప్రమాదం
    Uttarakhand UCC: దేశంలోనే తొలిసారిగా ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ అమలు  యూనిఫాం సివిల్ కోడ్

    సుప్రీంకోర్టు

    MLC Kavitha: సుప్రీంకోర్టుని ఆశ్రయించిన కవిత.. అనిల్‌ను విచారించేందుకు సిద్ధమైన ఈడీ కల్వకుంట్ల కవిత
    Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను వెల్లడించాలని ఎస్‌బీఐని సుప్రీంకోర్టు ఆదేశం  భారతదేశం
    CAA : సీఏఏ అమలును సవాల్ చేస్తూ దాఖలైన 200కు పైగా పిటిషన్లు.. నేడు విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు భారతదేశం
    Baba Ramdev: యాడ్ కేసులో వ్యక్తిగతంగా హాజరు కావాలని యోగా గురు రాందేవ్ ను సుప్రీంకోర్టు ఆదేశం  పతంజలి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025