NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Places of Worship Act: ప్రార్థ‌నా స్థలాల చట్టంపై విచామ‌ధ్యంత‌ర పిటీష‌న్ల‌పై సుప్రీంకోర్టు అస‌హ‌నం 
    తదుపరి వార్తా కథనం
    Places of Worship Act: ప్రార్థ‌నా స్థలాల చట్టంపై విచామ‌ధ్యంత‌ర పిటీష‌న్ల‌పై సుప్రీంకోర్టు అస‌హ‌నం 
    ప్రార్థ‌నా స్థలాల చట్టంపై విచామ‌ధ్యంత‌ర పిటీష‌న్ల‌పై సుప్రీంకోర్టు అస‌హ‌నం

    Places of Worship Act: ప్రార్థ‌నా స్థలాల చట్టంపై విచామ‌ధ్యంత‌ర పిటీష‌న్ల‌పై సుప్రీంకోర్టు అస‌హ‌నం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 17, 2025
    02:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    1991 ప్రార్థనా స్థలాల చట్టంపై ఇంకా పిటీషన్లు దాఖలవుతున్నాయి. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ కేసులు దాఖలవుతున్న నేపథ్యంలో, సుప్రీంకోర్టు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

    మధ్యంతర అప్లికేషన్లు దాఖలు చేయడంపై ఒక పరిమితి ఉండాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

    చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ప్రార్థనా స్థలాల చట్టం అమలుపై వాదనలు చేపట్టింది.

    అయితే,మధ్యంతర పిటీషన్లు అధికంగా ఉండటంతో,ఈ రోజు ఈ కేసును విచారణకు స్వీకరించలేమని న్యాయస్థానం ప్రకటించింది.

    త్రిసభ్య ధర్మాసనం ముందే చాలా ఎక్కువ పిటీషన్లు పెండింగ్‌లో ఉన్నాయని,ఈ కేసును ఏప్రిల్ మొదటి వారంలో విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.

    వివరాలు 

    అనేక పిటీషన్లకు అనుమతి

    మధ్యంతర పిటీషన్లు దాఖలు చేయడానికి ఒక పరిమితి ఉండాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా అభిప్రాయపడ్డారు.

    ఈ ప్రార్థనా స్థలాల చట్టంపై అనేక రాజకీయ పార్టీలు మధ్యంతర పిటీషన్లు దాఖలు చేశాయి.

    వాటిలో కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, జమాత్ ఉల్మా హింద్, ఎంఐఎం వంటి పార్టీలు ఉన్నాయి.

    ఈ రాజకీయ పార్టీలు 1991 ప్రార్థనా స్థలాల చట్టాన్ని సమర్థించాయి. అయితే, ఈ చట్టాన్ని సవాల్ చేసే పిటీషన్లను ఈ పార్టీలు వ్యతిరేకించాయి.

    గత విచారణ సమయంలోనూ అనేక పిటీషన్లకు అనుమతి ఇచ్చినట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

    మధ్యంతర పిటీషన్లను అనుమతించరాదని సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే అభిప్రాయపడ్డారు. కొత్త అంశాలను ప్రశ్నిస్తే మాత్రమే కొత్త పిటీషన్లు స్వీకరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    సుప్రీంకోర్టు

    Supreme Court: 'కసబ్‌కు కూడా న్యాయంగానే అవకాశమిచ్చాం'..: యాసిన్ మాలిక్ కేసులో ఎస్సీ భారతదేశం
    Sardar jokes: సిక్కు సమాజంపై జోకులను నిషేధించాలి.. సుప్రీం కోర్టులో విచారణకు రాబోతున్న అంశం.. భారతదేశం
    Delhi Air Pollution: నేడు ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ.. GRAP4 సడలింపుపై నిర్ణయం తీసుకునే ఛాన్స్.. దిల్లీ
    Supreme Court: హౌసింగ్‌ సొసైటీలకు భూకేటాయింపులను రద్దు చేసిన సుప్రీంకోర్టు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025