NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Sushil Modi: ఆరు నెలలుగా క్యాన్సర్ తో బాధపడుతున్న .. బీజేపీ నేత సంచలన ప్రకటన 
    తదుపరి వార్తా కథనం
    Sushil Modi: ఆరు నెలలుగా క్యాన్సర్ తో బాధపడుతున్న .. బీజేపీ నేత సంచలన ప్రకటన 
    ఆరు నెలలుగా క్యాన్సర్ తో బాధపడుతున్న .. బీజేపీ నేత సంచలన ప్రకటన

    Sushil Modi: ఆరు నెలలుగా క్యాన్సర్ తో బాధపడుతున్న .. బీజేపీ నేత సంచలన ప్రకటన 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 03, 2024
    01:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బీజేపీ నేత, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ క్యాన్సర్ బారిన పడ్డారు.

    ఈ కారణంగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కూడా తెలిపినట్లు సుశీల్‌ మోదీ తెలిపారు.

    ఈ మేరకు బుధవారం ఉదయం ఆయన ఎక్స్‌ వేదికగా ఓ ట్వీట్‌ చేశారు.'నేను గత 6 నెలలుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నాను.ఇప్పుడు ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నాను. ఈ కారణంగా లోక్‌సభ ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు.ప్రధాని మోదీకి అన్ని విషయాలూ చెప్పాను. దేశం, బీహార్‌, పార్టీకి ఎల్లప్పుడూ అంకిత భావంతో పనిచేశాను. అందుకు కృతజ్ఞుతుడిని' అని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

     సుశీల్ కుమార్ మోదీ చేసిన ట్వీట్ 

    पिछले 6 माह से कैंसर से संघर्ष कर रहा हूँ । अब लगा कि लोगों को बताने का समय आ गया है । लोक सभा चुनाव में कुछ कर नहीं पाऊँगा ।
    PM को सब कुछ बता दिया है ।
    देश, बिहार और पार्टी का सदा आभार और सदैव समर्पित |

    — Sushil Kumar Modi (मोदी का परिवार ) (@SushilModi) April 3, 2024

    Details 

    నాలుగు సభలలో సభ్యుడుగా సుశీల్ మోదీ

    సుశీల్ మోదీ చాలా కాలం పాటు (2005-2013, 2017-20)బీహార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.

    బీహార్ రాజకీయాల్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. నితీష్‌తో అయన జోడీ చాలా స్పెషల్‌గా పరిగణించబడుతుంది.

    ఈ అనారోగ్యం కారణంగా కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయన ఈ విషయాన్ని చాలా కాలం పాటు దాచిపెట్టారు.

    ఇప్పుడు తనకు క్యాన్సర్ ఉందని చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా బీహార్ బీజేపీకి ఇది పెద్ద దెబ్బ. పార్టీలో ఆయన కార్యాచరణ చాలా ప్రత్యేకం.

    సుశీల్ కుమార్ మోదీ బీహార్ డిప్యూటీ సీఎంగానే కాకుండా రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు.

    తన మూడు దశాబ్దాల ప్రజా జీవితంలో,అయన రాజ్యసభ,లోక్‌సభ,శాసన మండలి,శాసనసభతో సహా మొత్తం నాలుగు సభలలో సభ్యుడుగా ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025