NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Agra: భార్య వేధింపులకు మరో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య.. భావోద్వేగ వీడియో రికార్డ్
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Agra: భార్య వేధింపులకు మరో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య.. భావోద్వేగ వీడియో రికార్డ్
    భార్య వేధింపులకు మరో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య.. భావోద్వేగ వీడియో రికార్డ్

    Agra: భార్య వేధింపులకు మరో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య.. భావోద్వేగ వీడియో రికార్డ్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 28, 2025
    01:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా డిఫెన్స్ కాలనీలో నివసిస్తున్న మానవ్ శర్మ (35) తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

    మానవ్ ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో రిక్రూట్మెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.

    తన మరణానికి ముందు, ఆయన ఒక భావోద్వేగ వీడియోను రికార్డ్ చేసి, అందులో తన భార్యపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.

    ఆ వీడియోలో కన్నీళ్లతో మానవ్ మాట్లాడుతూ... తన భార్య తనను తీవ్రంగా వేధించిందని, ఆమె ప్రవర్తనపై అనుమానం ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా, ఆమె తరచూ దురుసుగా ప్రవర్తించేదని వెల్లడించారు. గతంలో కూడా తాను ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశానని, అయితే ఇప్పుడు భార్య వల్ల మరింత మానసిక ఒత్తిడికి గురై, ఈ నిర్ణయం తీసుకున్నట్లు.. వివరించారు.

    వివరాలు 

    భావోద్వేగ వీడియోలో ఏముంది? 

    6 నిమిషాల 57 సెకన్ల ఆ వీడియోలో మానవ్ తన తల్లిదండ్రులకు క్షమాపణలు తెలియజేస్తూ, "పాపా, మమ్మీ, అక్కూ, సారీ...ఇక నేను వెళ్లిపోతున్నా"అని అన్నారు.

    సమాజంలో పురుషుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

    పురుషులు కూడా తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారని, వారిపైనా సమాజం దృష్టి పెట్టాలని అభిప్రాయపడ్డారు. చివరకు,మానవ్ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.

    తండ్రి ఫిర్యాదు

    మానవ్ తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన కుమారుడు గత ఏడాది వివాహం చేసుకున్నట్లు తెలిపారు.

    పెళ్లి తర్వాత మానవ్ తన భార్యను ముంబైకి తీసుకెళ్లారని,అయితే అక్కడ ఆమె తరచూ గొడవలు పెట్టేదని,కుటుంబంపై తప్పుడు కేసులు వేస్తామని బెదిరించేదని ఆరోపించారు.అంతేకాకుండా,ఆమె మరో వ్యక్తితో సంబంధం పెట్టుకున్నట్లు అనుమానముందని చెప్పారు.

    వివరాలు 

    ఇదే తరహాలో మరో ఘటన!

    ఫిబ్రవరి చివర్లో,మానవ్ తన భార్యను తీసుకుని ఆగ్రాకు తిరిగి వచ్చారు.అయితే, కొద్ది రోజులకే భార్య తన పుట్టింటికి వెళ్లిపోయిందని తెలిపారు.

    మానవ్ తండ్రి ప్రకారం,కోడలు తన కుటుంబ సభ్యులతో కలిసి మానవ్‌ను బెదిరించిందని,ఆ ఒత్తిడిని తట్టుకోలేక మానవ్ ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు.

    ఈ సంఘటన బెంగళూరులో జరిగిన అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసును గుర్తుకు తెచ్చింది.అతుల్ కూడా తన భార్య వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డారు.ఈరెండు ఘటనల్లోనూ భార్యల మానసిక,భావోద్వేగ వేధింపులే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.

    మానవ్ శర్మ కేసును పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు.తన భార్యను,ఆమె కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు.

    మానవ్ ఆత్మహత్యకు ముందు రికార్డ్ చేసిన వీడియో ఆధారంగా కూడా విచారణ జరుపుతున్నారు.ఈ కేసుపై మరింత సమాచారం త్వరలో వెలువడనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్
    ఆగ్రా

    తాజా

    Manipur violence: మణిపూర్‌ను మళ్లీ కుదిపేసిన అల్లర్లు.. ఆ జిల్లాలో కర్ఫ్యూ! మణిపూర్
    Vatican City: ప్రపంచంలో విరాళాలతో నిలిచే ప్రపంచపు మినీ దేశం.. అది ఎక్కడుందో తెలుసా? ప్రపంచం
    Rinku Singh: వైభవంగా భారత క్రికెటర్‌ రింకు సింగ్, ఎంపీ ప్రియ సరోజ్ నిశ్చితార్థం రింకూ సింగ్
    Singireddy Narayana Reddy: పాటలలో పరవశించిన కవి.. తెలుగు గేయానికి తాళం చెక్కిన తాత్వికుడు 'సినారే'! టాలీవుడ్

    ఉత్తర్‌ప్రదేశ్

    Maha Kumbh Mela: మహా కుంభమేళా పుణ్యస్నానాలతో రూ.2 లక్షల కోట్ల ఆదాయం ఇండియా
    Supreme Court: కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదంపై రేపు సుప్రీం కోర్టులో విచారణ సుప్రీంకోర్టు
    Maha kumbh mela 2025: ప్రయాగ్ రాజ్'లో భారీగా పెరిగిన టెంట్ అద్దె.. ఎంతంటే..?  లైఫ్-స్టైల్
    Maha Kumbh Mela: ప్రయోగ్‌రాజ్ మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన భక్తులు భారతదేశం

    ఆగ్రా

    ఘోర రోడ్డు ప్రమాదం; కారును ఢీకొట్టిన ట్రక్కు, 15 మంది మృతి మహారాష్ట్ర
    బీజేపీ ఎంపీ రామ్ శంకర్ కతేరియాకు రెండేళ్ల జైలుశిక్ష; అనర్హత వేటు పడే అవకాశం బీజేపీ
    Rajasthan: జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై బస్సు-ట్రక్కు ఢీ; 11మంది మృతి  రాజస్థాన్
    Agra: ఆగ్రా హోటల్‌లో మహిళపై సామూహిక అత్యాచారం.. ఐదుగురి అరెస్టు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025