Page Loader
తెలంగాణాలో రూ.21,400 కోట్ల పెట్టుబడులు : కేటీఆర్
ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్

తెలంగాణాలో రూ.21,400 కోట్ల పెట్టుబడులు : కేటీఆర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 10, 2023
01:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

డబ్ల్యూఈఎఫ్ లో తెలంగాణ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇటీవల స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సందర్భంగా డేటా సెంటర్లు, లైఫ్ సైన్సెస్, ఎఫ్‌ఎంసిజి సహా వివిధ రంగాల్లో తెలంగాణ దాదాపు రూ.21,400 కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు గురువారం స్ఫష్టం చేశారు. గ్లోబల్ కంపెనీల పెట్టుబడులతో పాటు, హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్‌పై దృష్టి సారించిన నాల్గవ సిఎఫ్‌ఐఆర్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ కూడా ప్రకటించిందని మంత్రి చెప్పారు

కేటీఆర్

ఇసుక విక్రయాల ద్వారా ఏడాదికి రూ.800 కోట్లు అదాయం

ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని పెంచుతాయని గురువారం అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ హయాంలో 2004 నుంచి 2014 వరకు ఇసుక విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.39 కోట్లు కాగా, దాదాపుగా ఏటా రూ.4 కోట్ల ఆదాయం రానుంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఇసుక విక్రయాల ద్వారా ఏడాదికి సగటున రూ.800 కోట్ల ఆదాయం వస్తోందని మంత్రి కేటీఆర్ తెలియజేశారు.