NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana cabinet decisions: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.. 30వేల ఎకరాల్లో ఫ్యూచర్‌ సిటీ
    తదుపరి వార్తా కథనం
    Telangana cabinet decisions: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.. 30వేల ఎకరాల్లో ఫ్యూచర్‌ సిటీ
    బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.. 30వేల ఎకరాల్లో ఫ్యూచర్‌ సిటీ

    Telangana cabinet decisions: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.. 30వేల ఎకరాల్లో ఫ్యూచర్‌ సిటీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 07, 2025
    08:45 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాష్ట్రంలో బీసీలకు విద్య,ఉద్యోగాలు,రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

    అలాగే, ఎస్సీ వర్గీకరణ విషయంలో జస్టిస్ షమీమ్ అక్తర్ సమర్పించిన సవరణ నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

    రాష్ట్రాన్ని కోర్, అర్బన్, రూరల్ ప్రాంతాలుగా విభజించిన ప్రభుత్వం, రీజినల్ రింగ్ రోడ్ (RRR) బఫర్ జోన్ (2 కి.మీ.) వరకు హెచ్‌ఎండీఏ పరిధిని విస్తరించింది.

    దాదాపు 30 వేల ఎకరాల్లో "ఫ్యూచర్ సిటీ" అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    దీనికి ప్రత్యేకంగా "ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA)" ఏర్పాటు చేసింది.

    హైదరాబాద్‌లో మే-2025లో మిస్ వరల్డ్ పోటీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, 140 దేశాల నుంచి వచ్చే అతిథులకు అన్ని వసతులు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

    వివరాలు 

    మంత్రివర్గ నిర్ణయాలు 

    "తెలంగాణ టూరిజం పాలసీ-2025"కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. యాదగిరిగుట్ట ఆలయానికి ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు ప్రత్యేక ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.

    రెవెన్యూశాఖలో 10,954 గ్రామ స్థాయి పరిపాలన అధికారి (GPO) పోస్టులు, అలాగే 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులు మంజూరు చేయాలని మంత్రివర్గం ఆమోదించింది.

    సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన 6 గంటలపాటు సమావేశమైన మంత్రివర్గం, వివిధ కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది.

    మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ విలేకరుల సమావేశంలో ఈ నిర్ణయాలను వెల్లడించారు.

    వివరాలు 

    ఎస్సీ వర్గీకరణ 

    సుప్రీంకోర్టు తీర్పు అమలులో భాగంగా జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ నివేదికను చర్చించి, సవరణ నివేదిక ఆమోదించింది.

    దీనిని చట్ట రూపంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది.

    బీసీ రిజర్వేషన్లు 42%కి పెంపు

    విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలకు వేర్వేరు ముసాయిదా బిల్లులు తీసుకురావాలని నిర్ణయించబడింది.

    గతంలో 37% రిజర్వేషన్‌పై కేంద్రానికి పంపిన తీర్మానాన్ని వెనక్కి తీసుకుని, కొత్తగా 42% రిజర్వేషన్‌కు చట్టం తీసుకురానున్నారు.

    వివరాలు 

    మూడు సెక్టార్లుగా రాష్ట్రా విభజన 

    రాష్ట్ర విభజన - కోర్, అర్బన్, రూరల్. ఓఆర్‌ఆర్ (ORR) లోపలి ప్రాంతం.. కోర్ ఏరియా ఔటర్ రింగ్ రోడ్ (ORR) నుండి RRR బఫర్ వరకు .. అర్బన్ తెలంగాణ RRR బఫర్ అవతల ప్రాంతం.. రూరల్ తెలంగాణ (నగరాలు, మున్సిపాలిటీలు మినహా) ఫ్యూచర్ సిటీ (Future City) 7 మండలాలు, 56 గ్రామాలతో FCDA ఏర్పాటు 30,000 ఎకరాల్లో అభివృద్ధి హెచ్‌ఎండీఏ పరిధిలోని 36 గ్రామాలను FCDAకి బదిలీ హెచ్‌ఎండీఏ విస్తరణ RRR బఫర్ జోన్ (2 కి.మీ.) వరకు హెచ్‌ఎండీఏ పరిధిని విస్తరించి, 11 జిల్లాల్లో 104 మండలాలు, 1,355 గ్రామాలు కొత్తగా చేరుస్తున్నారు.

    వివరాలు 

    మహిళా సంక్షేమం - "ఇందిరా మహిళాశక్తి మిషన్-2025" 

    కోటి మంది మహిళలకు ఆర్థిక స్వావలంబనం స్వయం సహాయక సంఘాలను ఒకే గొడుగు కిందకు తెచ్చే ప్రణాళిక.

    సంఘ సభ్యుల వయస్సు పరిమితి 65 ఏళ్లకు పెంపు

    కొత్త సభ్యుల కనీస వయస్సు 15 ఏళ్లకు తగ్గింపు

    యాదగిరిగుట్ట ఆలయానికి ప్రత్యేక బోర్డు

    తిరుమల తితిదే మాదిరిగా యాదగిరిగుట్ట ఆలయానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.

    వివరాలు 

    పర్యాటక అభివృద్ధి - "తెలంగాణ టూరిజం పాలసీ 2025-30" 

    27 ప్రత్యేక పర్యాటక కేంద్రాలు అభివృద్ధి

    రూ. 15,000 కోట్లు పెట్టుబడులు 3 లక్షల ఉద్యోగావకాశాలు

    రెవెన్యూ శాఖ - 10,954 గ్రామాలకు రెవెన్యూ అధికారుల నియామకం

    గత VRO, VRA వ్యవస్థల్లో యోగ్యులైన వారికి అవకాశాలు

    గంధమల్ల రిజర్వాయర్ సామర్థ్యం తగ్గింపు

    4.28 టీఎంసీల నుంచి 1.41 టీఎంసీలకు సామర్థ్యం తగ్గించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

    శంషాబాద్‌ మండలం పెద్దగోల్కొండ సమీపంలో ఈఎస్‌ఐ ఆసుపత్రి కోసం 5.15 ఎకరాల కేటాయింపు

    వివరాలు 

    నియోజకవర్గాల పునర్విభజనపై భట్టి, జానారెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్షం 

    పారాలింపిక్స్ క్రీడాకారిణి దీప్తికి ప్రభుత్వ ఉద్యోగం

    361 కొత్త రెవెన్యూ డివిజన్, మండల పోస్టులు

    గురుకుల పాఠశాలలకు 330 పోస్టులు మంజూరు

    జీవన్‌దాన్ పాలసీలో కణజాల మార్పిడికి అనుమతి

    నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశం

    కేంద్ర ప్రభుత్వం దక్షిణాదిపై వివక్ష చూపిస్తోందని మంత్రివర్గం అభిప్రాయపడింది. తెలంగాణకు నష్టం లేకుండా పునర్విభజన కోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.

    డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, జానారెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో తొలి అఖిలపక్ష సమావేశం జరగనుంది.

    మంత్రివర్గ భేటీ ముగింపు మంత్రివర్గ సమావేశం అనంతరం, ఎమ్మెల్సీ ఎన్నికలు, రాష్ట్ర బడ్జెట్ సమావేశాలపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Manchu Manoj :'అత్తరు సాయిబు'గా మంచు మనోజ్.. సోలో హీరోగా రీఎంట్రీ! మంచు మనోజ్
    Virender Sehwag: పాక్‌కు మర్చిపోలేని సమాధానం అందుతుంది.. భారత సైన్యానికి సెహ్వాగ్ మద్దతు వీరేంద్ర సెహ్వాగ్
    Vikram Misri: పాకిస్థాన్‌కు ఆర్థిక సహాయంపై ఐఎంఎఫ్‌లో తన వాదన వినిపించనున్న భారత్  ఆపరేషన్‌ సిందూర్‌
    Pakistan:భారత్‌ దెబ్బ.. చిన్నాభిన్నమైన పాక్‌ ఆర్థిక వ్యవస్థ .. అప్పుకోసం అర్థిస్తూ ట్వీట్ పాకిస్థాన్

    తెలంగాణ

    ATLAS: 'అట్లాస్‌' రూపకల్పనలో నిర్లక్ష్యంపై సీఎం ఆగ్రహం.. బాధ్యులైన పదిమందికిపైగా అధికారులపై చర్యలకు ఆదేశం! భారతదేశం
    Free Driving Classes: మహిళలకు జిల్లాలవారీగా ఆటో, కారు డ్రైవింగ్‌ కేంద్రాలు ఏర్పాటు  భారతదేశం
    Nandipet: మహాశివరాత్రి ప్రత్యేకం.. 9 అంతస్తుల గోపురం, నవనాథుల మహిమ  నిజామాబాద్
    Telangana: ఎటిఎం కార్డు తరహాలో తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇక స్వైప్ చేస్తే చాలు! ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025