NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: అన్నదాతకు గుడ్ న్యూస్.. రైతు భరోసాపై కీలక అప్డేట్
    తదుపరి వార్తా కథనం
    Telangana: అన్నదాతకు గుడ్ న్యూస్.. రైతు భరోసాపై కీలక అప్డేట్
    అన్నదాతకు గుడ్ న్యూస్.. రైతు భరోసాపై కీలక అప్డేట్

    Telangana: అన్నదాతకు గుడ్ న్యూస్.. రైతు భరోసాపై కీలక అప్డేట్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 24, 2024
    10:52 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీని అమలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రూ.2 లక్షల వరకు రుణమాఫీని మూడు విడతలలో పూర్తి చేసింది.

    దాదాపు రూ.31 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

    టెక్నికల్ సమస్యల కారణంగా ఇంకా కొన్ని అర్హత కలిగిన రైతులకు ఈ రుణమాఫీ సాయం అందలేదు.

    అలాంటి రైతులకు కూడా మాఫీ రాశిని అందించేందుకు సర్వే నిర్వహిస్తున్నారు. రైతు రుణమాఫీ అమలవ్వడంతో, అన్నదాతలు రైతు భరోసా పథకానికి ఎదురు చూస్తున్నారు.

    వివరాలు 

    వానాకాలం పెట్టుబడిగా ఎకరాకు రూ.7,500 రైతుల ఖాతాల్లో జమ

    కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీలలో రైతు భరోసా పథకం కూడా ఉంది.ఈ పథకం ద్వారా పంట పెట్టుబడికి ఎకరాకు రూ.15వేలు అందిస్తామని ప్రకటించారు.

    ఖరీఫ్,రబీ సీజన్లలో మొత్తం రూ.15వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు.

    రైతు భరోసా పథకం అమలుకు దసరా (అక్టోబర్ 12)నుండి పెట్టుబడినిధులు అందించేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది.

    ఈ నిధులను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌ను ఆదేశించారు.

    ఎకరాకు రూ.7,500 చొప్పున కొన్ని నిబంధనలతో పకడ్బందీగా రైతు భరోసాను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది.

    వచ్చే నెల తొలివారంలో పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయాలని యోచిస్తోంది.

    వానాకాలం పెట్టుబడిగా ఎకరాకు రూ.7,500 రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు సమాచారం.

    వివరాలు 

    సాగులో లేని భూములకు కూడా రైతుబంధు

    గత ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు రూ.10 వేలు రెండు విడతలలో అందించిన విషయం తెలిసిందే.

    అయితే, అప్పట్లో సాగులో లేని భూములకు కూడా రైతుబంధు అందించారని ఆరోపణలు ఉన్నాయి.

    ఈసారి, సాగు చేసిన భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది.

    వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయం స్పష్టంగా చెప్పారు.

    రియల్ ఎస్టేట్ భూములు, కొండలు, గుట్టలపై రైతు భరోసా ఇవ్వబడదని, కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే ఈ పథకం అమలు చేయబోతున్నట్లు తెలిపారు.

    వివరాలు 

     రూ.10 వేల కోట్లు అవసరం 

    ఈ సమయంలో, రైతు భరోసా కోసం బడ్జెట్‌లో రూ.15 వేల కోట్లు కేటాయించారు. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం, ఈ వానాకాలంలో 1.39 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి.

    రైతు భరోసా కోసం ఎకరాకు రూ.7,500 చొప్పున మొత్తం సాగైన భూములకు డబ్బులు అందిస్తే దాదాపు రూ.10 వేల కోట్లు అవసరమవుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Motivation: అవమానాలు తాత్కాలికం.. మీ విలువే శాశ్వతం! జీవితం
    MI vs DC: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ముంబై.. ఇంటిబాట పట్టిన ఢిల్లీ ముంబయి ఇండియన్స్
    Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం పాకిస్థాన్
    Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్ మాలీవుడ్

    తెలంగాణ

    Flood Effects: వరద ప్రభావిత ప్రాంతాల్లో.. నేడు కేంద్ర బృందం పర్యటన భారతదేశం
    Telangana: దెబ్బతిన్న రోడ్ల  పునరుద్ధరణకు రూ.2,282 కోట్లు.. కేంద్ర బృందానికి నివేదిక  భారతదేశం
    Telangana: తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి 547 మంది ఎస్‌ఐలు భారతదేశం
    Hydra: 262 అక్రమ నిర్మాణాలు కూల్చివేత.. ప్రభుత్వానికి హైడ్రా నివేదిక  హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025