NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana Teachers: తెలంగాణ ఉపాధ్యాయుల నైపుణ్యాలను పెంపొందించేందుకు.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Telangana Teachers: తెలంగాణ ఉపాధ్యాయుల నైపుణ్యాలను పెంపొందించేందుకు.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
    తెలంగాణ ఉపాధ్యాయుల నైపుణ్యాలను పెంపొందించేందుకు.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

    Telangana Teachers: తెలంగాణ ఉపాధ్యాయుల నైపుణ్యాలను పెంపొందించేందుకు.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 04, 2025
    11:55 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ ఉపాధ్యాయులను ఇతర దేశాలకు పంపించి, వారి నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

    విద్యా వ్యవస్థను సమూలంగా మారుస్తూ, ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు.

    శ్రీధర్ బాబు సమీక్ష

    సోమవారం తెలంగాణ సచివాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా. యోగితా రాణా, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు.

    గతంలో ప్రపంచానికి ప్రతిభావంతులను అందించిన ప్రభుత్వ పాఠశాలలు, ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలల పోటీని ఎదుర్కొనలేకపోతున్నాయని ఆయన అన్నారు.

    దీనికి కారణాలను గుర్తించి, అవసరమైన సంస్కరణలను చేపట్టాలని సూచించారు.

    వివరాలు 

    ప్రభుత్వం సిద్ధంగా ఉంది 

    "స్కూళ్ల మౌలిక సదుపాయాలను మెరుగుపరచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పేద విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించారు.గుజరాత్ నుంచి ప్రతి సంవత్సరం 30-40 మంది ఉపాధ్యాయులు సింగపూర్‌కు వెళ్లి శిక్షణ పొందుతున్నారు. అలాంటి విధానాన్ని మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలి" అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

    వివరాలు 

    తెలంగాణకు సింగపూర్ బృందం 

    "ఫిన్లాండ్, ఫ్రాన్స్, యూకేలో విద్యా ప్రమాణాలను అధ్యయనం చేసి, మన విద్యా వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్చాలి. సింగపూర్ ప్రభుత్వం, మన రాష్ట్రంలో ప్రపంచస్థాయి విద్యా సంస్థలను ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. త్వరలోనే సింగపూర్ బృందం తెలంగాణలో పర్యటించనుంది. దీనికి సంబంధించిన విధివిధానాలను సిద్ధం చేయాలి" అని శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు.

    వివరాలు 

     సమూల మార్పులు రావాలి 

    "వచ్చే 2-3 ఏళ్లలో విద్యావ్యవస్థలో సమూల మార్పులు రావాలి. ఖర్చు పెడుతున్నా ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల విధానాలను అధ్యయనం చేసి, వాటిని అమలు చేయడం గురించి పరిశీలించాలి. చిన్న తరగతుల నుంచే విద్యార్థులకు కృత్రిమ మేధపై అవగాహన కల్పించాలి. హైస్కూల్ స్థాయిలో దాన్ని వినియోగించి, వారి తెలివితేటలను పెంచే విధంగా చూడాలి. కన్సల్టెంట్ల సూచనలను అనుసరించి కార్యాచరణ సిద్ధం చేయాలి" అని మంత్రి వివరించారు.

    వివరాలు 

    మార్గదర్శకాలు అవసరం 

    "గతంలో డీఈవోలు తరచూ పాఠశాలలను తనిఖీ చేసేవారు. ప్రస్తుతం ఎంఈవోలు ఇతర పనుల్లో నిమగ్నమై, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం మరిచిపోతున్నారు. గతంలో స్కూళ్లలో వక్తృత్వ పోటీలు, విద్యార్థుల పిక్నిక్‌లు, ఎక్సకర్షన్‌లు జరుగుతుండేవి. ఇవన్నీ ప్రైవేట్ స్కూళ్లలో జరుగుతున్నాయి. మన ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఈ కార్యక్రమాలను ప్రవేశపెట్టాలి. భవిష్యత్ తరానికి ప్రపంచస్థాయి విద్యను అందించగలిగితేనే, వారు అంతర్జాతీయ స్థాయిలో పోటీ చేయగలుగుతారు. సమూల మార్పుల కోసం తగిన చర్యలు తీసుకోవాలి" అని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Starlink Kit: స్టార్‌లింక్‌ సర్వీస్‌కు ముందు భారీ ఖర్చు.. కిట్ ధర ఎంతంటే? స్టార్‌లింక్‌
    Sundar Pichai: గూగుల్ తర్వాత సీఈఓ ఎవరు? సుందర్ పిచాయ్ ఏం చెప్పారంటే? గూగుల్
    Maganti Gopinath : జూబ్లీహిల్స్ గోపినాథ్ కన్నుమూత.. నిర్మాతగా ఆయన తీసిన సినిమాలివే! జూబ్లీహిల్స్
    Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌ విస్తరణ.. ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం తెలంగాణ

    తెలంగాణ

    SLBC Tunnel: టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది కోసం కొనసాగుస్తున్న గాలింపు.. కుటుంబ సభ్యుల్లో పెరుగుతున్న ఆందోళన  శ్రీశైలం
    Yadagirigutta : యాదగిరిగుట్టలో స్వర్ణ శోభ.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విమాన గోపుర ఆవిష్కరణ రేవంత్ రెడ్డి
    Telangana: తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లకు గ్రీన్ సిగ్నల్! ప్రభుత్వం
    SLBC tunnel: అంతుచిక్కని ఆచూకీ.. కానరాని ఎనిమిది మంది జాడ.. సహాయక చర్యలు ముమ్మరం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025