NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ram Mandir History: 75 సంవత్సరాల అయోధ్య రామమందిర చరిత్ర
    తదుపరి వార్తా కథనం
    Ram Mandir History: 75 సంవత్సరాల అయోధ్య రామమందిర చరిత్ర
    Ayodhya Ram Mandir: 75 సంవత్సరాల అయోధ్య రామమందిర చరిత్ర

    Ram Mandir History: 75 సంవత్సరాల అయోధ్య రామమందిర చరిత్ర

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 22, 2024
    12:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    స్వాతంత్య్రానంతర భారతదేశంలో అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు వివాదంపై దాఖలైన మొదటి కోర్టు కేసు దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత, 2019లో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ సుప్రీంకోర్టు ఒక మైలురాయి తీర్పును వెలువరించింది.

    ఈరోజు అయోధ్యలో రామమందిర శంకుస్థాపన జరుగుతుండడంతో , దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది రామాలయ ప్రారంభోత్సవ సుముహూర్త గడియల కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

    Details 

    హిందువులు మసీదు లోపల రాముడి విగ్రహాలను ఉంచారని ఆరోపణ 

    1949లో, గోపాల్ సింగ్ విశారద్, బాబ్రీ మసీదులో రామ్ లల్లా విగ్రహాలు కనిపించిన తర్వాత రామ జన్మభూమి దేవతను పూజించాలని ఫైజాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

    హిందువులు మసీదు లోపల రాముడి విగ్రహాలను ఉంచారని ముస్లింలు ఆరోపించారు. చివరికి ఇది సివిల్ దావాలకు దారితీసింది. ప్రభుత్వం ఆ ప్రాంగణాన్ని వివాదాస్పద ప్రాంతంగా ప్రకటించి గేట్లకు తాళాలు వేసింది.

    1961లో మహ్మద్ హషీమ్ ఆ ఆస్తిని ముస్లింలకు పునరుద్ధరించాలని దావా వేశారు. బాబ్రీ మసీదును బోర్డు ఆస్తిగా ప్రకటిస్తూ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఫైజాబాద్ సివిల్ కోర్టులో దావా వేసింది.

    Details 

    మసీదులో హిందువులు పూజలు చేసుకునేందుకు వీలుగా తీర్పు 

    RSS ఆఫ్‌షూట్ విశ్వహిందూ పరిషత్ (VHP) 1964లో ఏర్పడినప్పటికీ, రామమందిరం 1980ల ప్రారంభంలో మాత్రమే దాని ఎజెండాలో చేర్చింది.

    రాముడి జన్మస్థలాన్ని 'విముక్తి' చేసి ఆలయాన్ని నిర్మించాలనే ఉద్యమానికి VHP నాయకత్వం వహించింది.

    అప్పుడు భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు ఎల్‌కె అద్వానీ ప్రచారానికి నాయకత్వం వహించారు.

    1986లో హరి శంకర్ దూబే చేసిన విజ్ఞప్తి మేరకు వివాదాస్పద మసీదులో హిందువులు పూజలు చేసుకునేందుకు వీలుగా అయోధ్య జిల్లా జడ్జి KM పాండే ద్వారాలను తెరవాలని ఆదేశించారు.

    ఫిబ్రవరి 06న బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు.

    Details 

    1990లో ఎల్‌కె అద్వానీ నేతృత్వంలో రథయాత్ర

    1989లో VHP వివాదాస్పద మసీదు పక్కనే ఉన్న భూమిలో రామ మందిరానికి పునాది వేసింది.

    ఫైజాబాద్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న నాలుగు వ్యాజ్యాలను హైకోర్టు ప్రత్యేక బెంచ్‌కు బదిలీ చేసింది.

    1990లో అప్పటి బీజేపీ అధ్యక్షుడు ఎల్‌కె అద్వానీ నేతృత్వంలోని బిజెపి గుజరాత్‌లోని సోమనాథ్ నుండి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య వరకు దేశవ్యాప్త రథయాత్రకు ఆదేశించింది.

    ఈ ఊరేగింపు వందలాది నగరాలు,గ్రామాల గుండా సాగింది. అనేక మతపరమైన అల్లర్లకు దారితీసింది.

    VHP వాలంటీర్లు మసీదును పాక్షికంగా ధ్వంసం చేశారు. చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రధాని చంద్రశేఖర్ ప్రయత్నించారు.

    1991లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చింది.

    Details 

    1992 అల్లర్లలో 2,000 మంది మృతి 

    డిసెంబర్ 6, 1992న, బాబ్రీ మసీదును VHP మద్దతుదారులు, శివసేన పార్టీ,BJP కూల్చివేశారు.

    దీని ఫలితంగా జరిగిన అల్లర్లలో 2,000 మంది మరణించారు. 2001లో, మసీదు కూల్చివేత వార్షికోత్సవం సందర్భంగా ఉద్రిక్తతలు పెరిగాయి.

    ఆ స్థలంలో హిందూ దేవాలయాన్ని నిర్మిస్తామని VHP మళ్లీ హామీ ఇచ్చింది.

    వాజ్‌పేయి తన కార్యాలయంలో అయోధ్య యూనిట్‌ను స్థాపించారు. హిందూ,ముస్లిం నాయకులతో చర్చలు నిర్వహించడానికి ఒక సీనియర్ అధికారి శతృఘ్న సింగ్‌ను నియమించారు.

    జనవరి 2003లో, పురావస్తు శాస్త్రజ్ఞులు ఆ స్థలంలో రాముని ఆలయం ఉందో లేదో తెలుసుకోవడానికి కోర్టు-ఆదేశంతో సర్వేను నిర్వహించారు.

    Details 

    మసీదు కింద ఆలయానికి సంబంధించిన ఆధారాలు

    మసీదు కింద ఆలయానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని సర్వే పేర్కొంది.

    అయితే ముస్లింలు ఆ సర్వేతో విభేదించారు. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని హిందువులు, ముస్లింలు,నిర్మోహి అఖారాకు మూడు భాగాలుగా విభజించాలని 2010 సెప్టెంబర్ 30న అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది.

    మహంత్ సురేశ్ దాస్, సున్నీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ వక్ఫ్, నిర్మోహి అఖారా, అఖిల భారత హిందూ మహాసభ, జమియత్ ఉలమా-ఐ-హింద్,ఇతరులు ఈ తీర్పును సవాలు చేశారు.

    హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ రామ్ లల్లా తరపున పిటిషన్ కూడా దాఖలైంది. వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలుగా విభజించాలన్న హైకోర్టు ఆదేశాలపై 2011లో సుప్రీంకోర్టు స్టే విధించింది.

    Details 

    2019 నవంబర్‌లో రామజన్మభూమి ట్రస్టుకు అప్పగింత 

    2019 నవంబర్‌లో ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం వివాదాస్పద స్థలాన్ని రామజన్మభూమి ఆలయాన్ని నిర్మించేందుకు ట్రస్టుకు అప్పగించాలని ఆదేశించింది.

    మసీదు నిర్మించేందుకు సున్నీ వక్ఫ్ బోర్డుకు మరో ప్రదేశంలో ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

    ఆగస్టు 5, 2020న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

    ఆయన భూమి పూజ చేసి భవ్య రామాలయానికి శంకుస్థాపన చేశారు.

    అయోధ్యలోని రామజన్మభూమి,హనుమాన్‌గర్హి దేవాలయాలలో దర్శనం పొందిన మొదటి ప్రధాని నరేంద్ర మోదీ అయ్యారు.

    సోమవారం రామమందిర ప్రారంభోత్సవం తర్వాత, నిర్మాణ కార్యకలాపాలు కొనసాగుతాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అయోధ్య

    తాజా

    Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం పాకిస్థాన్
    Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్ మాలీవుడ్
    Google I/O 2025: గూగుల్ కొత్త ఏఐ మోడ్‌తో షాపింగ్ ఇక స్మార్ట్‌గా.. ట్రై-ఆన్, ట్రాకింగ్, తక్షణ చెల్లింపుల సౌలభ్యం! గూగుల్
    #NewsBytesExplainer: ఫేక్ ప్రామిస్‌తో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం.. చట్టం ఏం చెబుతుందంటే? న్యాయస్థానం

    అయోధ్య

    PM Modi: 'అయోధ్య' రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    Ayodhya Airport: అయోధ్యలో మహర్షి వాల్మీకి విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ  విమానాశ్రయం
    PM Modi: జనవరి 22న ప్రజలు అయోధ్యకు రావొద్దు: ప్రధాని మోదీ పిలుపు నరేంద్ర మోదీ
    PM Modi: అయోధ్య రాముడిపై పాటలు, కవితలు రాస్తే.. షేర్ చేయండి: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025