NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / పేరు మార్పు అభ్యర్థనలు వచ్చినప్పుడు పరిశీలిస్తాం: ఐక్యరాజ్యసమితి
    తదుపరి వార్తా కథనం
    పేరు మార్పు అభ్యర్థనలు వచ్చినప్పుడు పరిశీలిస్తాం: ఐక్యరాజ్యసమితి
    పేరు మార్పు అభ్యర్థనలు వచ్చినప్పుడు పరిశీలిస్తాం: ఐక్యరాజ్యసమితి

    పేరు మార్పు అభ్యర్థనలు వచ్చినప్పుడు పరిశీలిస్తాం: ఐక్యరాజ్యసమితి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 07, 2023
    02:14 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    G20 ఆహ్వాన పత్రికలో 'ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌'పేరిట రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి అన్ని పక్షాలకు ఆహ్వానాలు అందడంతో దేశం పేరుపై రాజకీయ వివాదం మొదలైంది.

    ఈ విషయమై ఐక్యరాజ్య సమితి స్పందించింది.తమ దేశం పేర్ల మార్పుపై ఏ దేశం నుండైనా అభ్యర్థనలు వస్తే..ఐరాస వాటిని స్వీకరించి పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపింది.

    భారతదేశం పేరును భారత్‌గా మారుస్తారా అంటూ విలేఖరులు అడిగిన ప్రశ్నకు..ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్,డిప్యూటీ అధికార ప్రతినిధి ఫర్హాన్ హక్ స్పందించారు.

    టర్కీ తన పేరును తుర్కియేగా మార్చుకున్న ఉదాహరణను ఉదహరించారు.తుర్కియే విషయంలో,ఆ దేశ ప్రభుత్వం మాకు పంపిన అధికారిక అభ్యర్థనను మేము స్వీకరించాము. సహజంగానే, మాకు అలాంటి అభ్యర్థనలు ఏమైనా వస్తే, వాటిని మేముపరిగణలోకి తీసుకుంటామని తెలిపారు.

    Details 

    దేశం పేరు మార్పుపై స్పందించిన మోదీ 

    ప్రెసిడెంట్ ముర్ము G20 విందుకు ఆహ్వానాలు పంపిన తర్వాత మంగళవారం భారతదేశంలో దేశం పేరు మార్పుపై గందరగోళం చెలరేగింది.

    ఆహ్వాన పత్రికలో'ప్రెసిడెంట్ అఫ్ ఇండియా'కి బదులుగా 'ప్రెసిడెంట్ అఫ్ భారత్ 'అని ముద్రించారు.

    ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశం పేరు ఇంగ్లీష్ లో ఇండియా బదులు భారత్ అని మార్చాలని యోచిస్తున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి.

    అటు ఈవిషయమై ప్రధాని మోదీ స్పందింస్తూ..ఈ అంశం పై జాగ్రత్తగా వ్యవహరించాలని అనవసరమైన రాజకీయ దుమారాన్ని నివారించాలని తన మంత్రివర్గ సహచరులకు చెప్పినట్లు వార్తలొచ్చాయి.

    భారత అధ్యక్షతన సెప్టెంబర్ 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో G20 సమ్మిట్ జరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా పలువురు దేశాధినేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐక్యరాజ్య సమితి

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    ఐక్యరాజ్య సమితి

    భారత్‌లో హిందూ వ్యతిరేక శక్తులు నిత్యానందను వేధించాయి: 'కైలాస' రాయబారి విజయప్రియ కైలాసం
    పుతిన్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు; సమర్థించిన బైడెన్ వ్లాదిమిర్ పుతిన్
    ఐపీసీసీ హెచ్చరిక; 'గ్లోబల్ వార్మింగ్‌ 1.5 డిగ్రీలు దాటుతోంది, ప్రపంచదేశాలు మేలుకోకుంటే ఉపద్రవమే' ప్రపంచం
    ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్; చైనా కంటే 2.9 మిలియన్లు ఎక్కువ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025